నాకు మాత్రం హార్ట్‌బ్రేకే: ఐపీఎల్ ఫైనల్‌పై రాజమౌళి ట్వీట్ వైరల్.. అలా ఎందుకన్నాడో చూడండి

Best Web Hosting Provider In India 2024

నాకు మాత్రం హార్ట్‌బ్రేకే: ఐపీఎల్ ఫైనల్‌పై రాజమౌళి ట్వీట్ వైరల్.. అలా ఎందుకన్నాడో చూడండి

Hari Prasad S HT Telugu

ఐపీఎల్ ఫైనల్ పై దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఫైనల్లో పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ తలపడనుండటంపై జక్కన్న సోమవారం (జూన్ 2) మధ్యాహ్నం ఓ ట్వీట్ చేశాడు. తనకు హార్ట్ బ్రేక్ కాబోతోందని అతడు అనడం విశేషం.

నాకు మాత్రం హార్ట్‌బ్రేకే: ఐపీఎల్ ఫైనల్‌పై రాజమౌళి ట్వీట్ వైరల్.. అలా ఎందుకన్నాడో చూడండి

ఐపీఎల్‌కు మరో కొత్త విజేత రాబోతున్నారు. ఈసారి ఫైనల్లో ఇప్పటి వరకూ ట్రోఫీ గెలవని పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ తలపడనున్న విషయం తెలిసిందే. మంగళవారం (జూన్ 3) ఈ మెగా ఫైనల్ జరగనుంది. అయితే ఆదివారం (జూన్ 1) జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్ తర్వాత పంజాబ్ కింగ్స్ విజయం, ఫైనల్ పై ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

నాకు హార్ట్‌బ్రేకే

రాజమౌళి సోమవారం (జూన్ 2) చేసిన ట్వీట్ లో పంజాబ్ ను ఫైనల్ చేర్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. అయితే ఆ టీమ్ ఫైనల్లో తన మరో ఫేవరెట్ అయిన విరాట్ కోహ్లి ఆర్సీబీతో తలపడనుండటంతో ఇద్దరిలో ఎవరు గెలిచినా తనకు హార్ట్ బ్రేక్ తప్పదని జక్కన్న అన్నాడు.

“బుమ్రా, బౌల్ట్ యార్కర్లను అయ్యర్ థర్డ్ మ్యాన్ బౌండరీకి తరలించడం ఓ అద్భుతం. ఈ వ్యక్తి ఢిల్లీని ఫైనల్ కు తీసుకెళ్లాడు.. తర్వాత డ్రాప్ చేశారు.. కోల్‌కతాకు ట్రోఫీ అందించాడు.. అయినా డ్రాప్ చేశారు.. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ ను 11 ఏళ్ల తర్వాత ఫైనల్ కు తీసుకెళ్లాడు.

ఈసారి కూడా అతడు ట్రోఫీ అందుకోవడానికి పూర్తిగా అర్హుడు. మరోవైపు కోహ్లి ఉన్నాడు. ప్రతి ఏటా అతడు నిలకడగా ఆడుతున్నాడు. వేల కొద్దీ రన్స్ చేస్తున్నాడు. ఇది అతనికి ఆఖరి పోరాటం.. అతడు కూడా దీనికి అర్హుడే. ఫలితం ఏదైనా హార్ట్ బ్రేకే కానుంది” అని రాజమౌళి ట్వీట్ చేశాడు.

శ్రేయస్.. అండర్ రేటెడ్ కెప్టెన్

శ్రేయస్ అయ్యర్ మోస్ట్ అండర్ రేటెడ్ కెప్టెన్ అని చెప్పొచ్చు. రాజమౌళి చెప్పినట్లు అతడు ప్రతి ఐపీఎల్ టీమ్ నూ తన భుజాలపై మోస్తూ అద్భుతమైన ఫలితాలు సాధించి పెడుతున్నాడు. కానీ చివరికి అతన్ని ఆయా టీమ్స్ అన్నీ వదిలించుకుంటూనే ఉన్నాయి. గతేడాది కేకేఆర్ కు ట్రోఫీ అందించినా.. అతన్ని కొనసాగించలేదు. ఈసారి పంజాబ్ కింగ్స్ ను ఏకంగా ఫైనల్ కు తీసుకెళ్లాడు. టోర్నీ మొత్తం నిలకడగా రాణించాడు. అతని కెప్టెన్సీ కూడా అద్భుతమనే చెప్పాలి.

ఓ బ్యాటర్ గా తాను ముందుండి నడిపిస్తూ.. జట్టులోని వనరులను సరిగా ఉపయోగించుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం (జూన్ 3) జరగబోయే ఫైనల్లోనూ అతడు ఇదే దూకుడు కొనసాగిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మరోవైపు తొలిసారి ట్రోఫీ కోసం ఉవ్విళ్లూరుతున్న విరాట్ కోహ్లి కూడా అంతే ఆకలితో ఉన్నాడు. దీంతో ఈ ఇద్దరి మధ్య ఫైనల్ సమరం ఎంతో ఆసక్తికరంగా సాగనుంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024