Best Web Hosting Provider In India 2024
బెంగళూరు వాసులకు అలర్ట్- ఆర్సీబీ ‘విక్టరీ పరేడ్’తో ఈ ప్రాంతాల్లో ఫుల్ ట్రాఫిక్!
ఆర్సీబీ తొలి ఐపీఎల్ ట్రోఫీ దక్కించుకోవడంతో బెంగళూరు వ్యాప్తంగా భారీ ఎత్తున్న సంబరాలు జరుగుతున్నాయి. ఇక బుధవారం ఆర్సీబీ టీమ్.. బెంగళూరులో విక్టరీ పరేడ్ని నిర్వహించనుంది. ఫలితంగా అధికారులు ట్రాఫిక్ అలర్ట్లు జారీ చేశారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోవడంతో.. మంగళవారం అర్థరాత్రి నుంచే కర్ణాటకవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని తాకాయి. ఇక బుధవారం ఆర్సీబీ టీమ్ కప్తో బెంగళూరుకు చేరుకోనుంది. విరాట్ కోహ్లీ టీమ్ మొత్తం విక్టరీ పరేడ్ని నిర్వహించనుంది. ఈ ఆర్సీబీ విక్టరీ పరేడ్కి వేలాది మంది ఫ్యాన్స్ తరలి వస్తారని అంచనాలు ఉన్న నేపథ్యంలో అధికారులు తగిన చర్యలు చేపట్టారు.
బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ పరేడ్- ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు!
ఐపీఎల్ 2025లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో చారిత్రాత్మక విజయం సాధించింది ఆర్సీబీ. ఇక బుధవారం విరాట్ కోహ్లీ టీమ్ బుధవారం నగరం నడిబొడ్డున విక్టరీ పరేడ్ని నిర్వహించనుంది.
మధ్యాహ్నం 3.30 గంటలకు విధానసౌధ నుంచి ప్రారంభమయ్యే ఈ బస్సు పరేడ్.. చిన్నస్వామి స్టేడియంలో ముగుస్తుంది. సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ గుండా ఛాంపియన్లు వెళ్తుండగా ఎరుపు, నలుపు రంగు దుస్తులు ధరించి, జెండాలు ఊపుతూ, నినాదాలు చేసే అభిమానులతో ఈ రూట్ కిక్కిరిసిపోతుందని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అధికారులు కట్టుదిట్ట భద్రతను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు ప్రకటించి, పరిస్థితిని కంట్రోల్లో ఉంచేందుకు అదనపు భద్రతా సిబ్బందిని నియమించారు.
ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ అనంతరం ఆర్సీబీ మాజీ కెప్టెన్, కీలక ప్లేయర్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. ఐపీఎల్ ట్రోఫీతో ఆర్సీబీ జట్టు బెంగళూరుకు వెళుతుండటంపై హర్షం వ్యక్తం చేశాడు. ఆర్సీబీ మాజీ స్టార్లు క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ని కూడా బెంగళూరుకు వచ్చి సెలబ్రేషన్స్లో పాల్గొనాలని ఆహ్వానం పంపాడు.
“ఈ క్షణం మాది మాత్రమే కాదు- ప్రతి ఆర్సీబీ అభిమానిది. బెంగళూరులో ఏబీ, క్రిస్ లేకుండా ఇది పూర్తి కాదు,” అని కోహ్లీ అన్నాడు.
భారీ ఎత్తున సంబరాలు..
ఐపీఎల్ 2025లో ఆర్సీబీ గెలుపు ఖాయమైన మరుక్షణం నుంచి కర్ణాటక వ్యాప్తంగా, ముఖ్యంగా బెంగళూరులో భారీ ఎత్తున సెలబ్రేషన్స్ జరిగాయి. ఇందిరానగర్, కోరమంగళ, ఎంజీ రోడ్డు, విజయనగర వీధులన్నీ బాణసంచా శబ్దాలతో మారుమోగిపోయాయి. ఆర్సీబీ అభిమానులు రోడ్లపై నృత్యాలు చేస్తూ.. ‘ఈ సాలా కప్ నామ్దు’ అంటూ నినాదాలు చేశారు. లైవ్ స్క్రీనింగ్ లతో కూడిన పబ్లు తాత్కాలిక స్టేడియాలుగా మారడంతో భావోద్వేగానికి లోనైన అభిమానులు ఒకరిని ఒకరు హగ్ చేసుకుంటూ కనిపించారు.
ఆర్సీబీ అభిమానుల సెలబ్రేషన్స్కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Best Web Hosting Provider In India 2024
Source link