బెంగళూరు వాసులకు అలర్ట్​- ఆర్సీబీ ‘విక్టరీ పరేడ్​’తో ఈ ప్రాంతాల్లో ఫుల్​ ట్రాఫిక్​!

Best Web Hosting Provider In India 2024

బెంగళూరు వాసులకు అలర్ట్​- ఆర్సీబీ ‘విక్టరీ పరేడ్​’తో ఈ ప్రాంతాల్లో ఫుల్​ ట్రాఫిక్​!

ఆర్సీబీ తొలి ఐపీఎల్​ ట్రోఫీ దక్కించుకోవడంతో బెంగళూరు వ్యాప్తంగా భారీ ఎత్తున్న సంబరాలు జరుగుతున్నాయి. ఇక బుధవారం ఆర్సీబీ టీమ్​.. బెంగళూరులో విక్టరీ పరేడ్​ని నిర్వహించనుంది. ఫలితంగా అధికారులు ట్రాఫిక్​ అలర్ట్​లు జారీ చేశారు.

 
కప్​తో విరాట్​ కోహ్లీ (AFP)
 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోవడంతో.. మంగళవారం అర్థరాత్రి నుంచే కర్ణాటకవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని తాకాయి. ఇక బుధవారం ఆర్సీబీ టీమ్​ కప్​తో బెంగళూరుకు చేరుకోనుంది. విరాట్​ కోహ్లీ టీమ్​ మొత్తం విక్టరీ పరేడ్​ని నిర్వహించనుంది. ఈ ఆర్సీబీ విక్టరీ పరేడ్​కి వేలాది మంది ఫ్యాన్స్​ తరలి వస్తారని అంచనాలు ఉన్న నేపథ్యంలో అధికారులు తగిన చర్యలు చేపట్టారు.

 

బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ పరేడ్​- ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు​!

ఐపీఎల్​ 2025లో భాగంగా అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో చారిత్రాత్మక విజయం సాధించింది ఆర్సీబీ. ఇక బుధవారం విరాట్​ కోహ్లీ టీమ్​ బుధవారం నగరం నడిబొడ్డున విక్టరీ పరేడ్​ని నిర్వహించనుంది.

మధ్యాహ్నం 3.30 గంటలకు విధానసౌధ నుంచి ప్రారంభమయ్యే ఈ బస్సు పరేడ్.. చిన్నస్వామి స్టేడియంలో ముగుస్తుంది. సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ గుండా ఛాంపియన్లు వెళ్తుండగా ఎరుపు, నలుపు రంగు దుస్తులు ధరించి, జెండాలు ఊపుతూ, నినాదాలు చేసే అభిమానులతో ఈ రూట్​ కిక్కిరిసిపోతుందని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో అధికారులు కట్టుదిట్ట భద్రతను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు ప్రకటించి, పరిస్థితిని కంట్రోల్​లో ఉంచేందుకు అదనపు భద్రతా సిబ్బందిని నియమించారు.

ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ అనంతరం ఆర్సీబీ మాజీ కెప్టెన్, కీలక ప్లేయర్​ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. ఐపీఎల్​ ట్రోఫీతో ఆర్సీబీ జట్టు బెంగళూరుకు వెళుతుండటంపై హర్షం వ్యక్తం చేశాడు. ఆర్సీబీ మాజీ స్టార్లు క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్​ని కూడా బెంగళూరుకు వచ్చి సెలబ్రేషన్స్​లో పాల్గొనాలని ఆహ్వానం పంపాడు.

“ఈ క్షణం మాది మాత్రమే కాదు- ప్రతి ఆర్సీబీ అభిమానిది. బెంగళూరులో ఏబీ, క్రిస్ లేకుండా ఇది పూర్తి కాదు,” అని కోహ్లీ అన్నాడు.

 

భారీ ఎత్తున సంబరాలు..

ఐపీఎల్​ 2025లో ఆర్సీబీ గెలుపు ఖాయమైన మరుక్షణం నుంచి కర్ణాటక వ్యాప్తంగా, ముఖ్యంగా బెంగళూరులో భారీ ఎత్తున సెలబ్రేషన్స్​ జరిగాయి. ఇందిరానగర్, కోరమంగళ, ఎంజీ రోడ్డు, విజయనగర వీధులన్నీ బాణసంచా శబ్దాలతో మారుమోగిపోయాయి. ఆర్సీబీ అభిమానులు రోడ్లపై నృత్యాలు చేస్తూ.. ‘ఈ సాలా కప్ నామ్దు’ అంటూ నినాదాలు చేశారు. లైవ్ స్క్రీనింగ్ లతో కూడిన పబ్​లు తాత్కాలిక స్టేడియాలుగా మారడంతో భావోద్వేగానికి లోనైన అభిమానులు ఒకరిని ఒకరు హగ్​ చేసుకుంటూ కనిపించారు.

ఆర్సీబీ అభిమానుల సెలబ్రేషన్స్​కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.


Best Web Hosting Provider In India 2024


Source link