థగ్ లైఫ్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఇదో కల్ట్ క్లాసిక్ థ్రిల్లర్.. కమల్ హాసన్ యాక్టింగ్ మరో లెవెల్

Best Web Hosting Provider In India 2024

థగ్ లైఫ్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఇదో కల్ట్ క్లాసిక్ థ్రిల్లర్.. కమల్ హాసన్ యాక్టింగ్ మరో లెవెల్

Hari Prasad S HT Telugu

కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. గురువారం (జూన్ 5) ఈ మూవీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కల్ట్ క్లాసిక్ థ్రిల్లర్ అంటూ ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడు రివ్యూ ఇవ్వడం విశేషం.

థగ్ లైఫ్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఇదో కల్ట్ క్లాసిక్ థ్రిల్లర్.. కమల్ హాసన్ యాక్టింగ్ మరో లెవెల్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్లో వస్తున్న థగ్ లైఫ్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎప్పుడో 37 ఏళ్ల కిందట వచ్చిన నాయకుడు మూవీ ఓ కల్ట్ క్లాసిక్ గా మిగిలిపోయిన తర్వాత ఈ ఇద్దరూ కలిసి మరో మూవీ చేయడంతో సహజంగానే థగ్ లైఫ్ పై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.

థగ్ లైఫ్.. కల్ట్ క్లాసిక్ థ్రిల్లర్

థగ్ లైఫ్.. గురువారం (జూన్ 5) ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. మణిరత్నం డైరెక్షన్ లో కమల్ హాసన్, శింబు, త్రిషలాంటి వాళ్లు నటించిన ఈ సినిమా ఫస్ట్ రివ్యూ మాత్రం రెండు రోజుల ముందే వచ్చేసింది. ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా, ఫిల్మ్ క్రిటిక్ గా కొన్నేళ్లుగా ముందుగానే సినిమాలకు రివ్యూలు ఇచ్చే ఉమేర్ సంధుయే ఈ థగ్ లైఫ్ ఫస్ట్ రివ్యూ ఇవ్వడం విశేషం. అతడు ఈ మూవీని ఆకాశానికెత్తాడు. ఓ కల్ట్ క్లాసిక్ థ్రిల్లర్ అని అన్నాడు.

“ఫస్ట్ రివ్యూ థగ్ లైఫ్. కమల్ హాసన్, శింబు అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో కూడిన కల్ట్ క్లాసిక్ థ్రిల్లర్. పవర్ ప్యాక్డ్ స్టోరీ, యాక్షన్ స్టంట్స్. ఏఆర్ రెహమాన్, మణిరత్నం డెడ్లీ కాంబో బ్యాక్ విత్ బ్యాంగ్. కచ్చితంగా చూడండి” అని ఉమేర్ ట్వీట్ చేశాడు.

థగ్ లైఫ్ మూవీ గురించి..

థగ్ లైఫ్ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఇది తండ్రీ కొడుకుల మధ్య సాగే కథ. 1987లో వచ్చిన నాయకుడు తర్వాత మణిరత్నం, కమల్ హాసన్ కలిసి చేసిన రెండో మూవీ ఇది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. త్రిష, శింబు, జోజు జార్జ్, నాజర్ లాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.

ఈ మూవీ రిలీజ్ కు ముందు కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన కామెంట్స్ వివాదం కావడంతో కర్ణాటకలో సినిమా రిలీజ్ కావడం లేదు. క్షమాపణ చెప్పడానికి అంగీకరించని కమల్.. మూవీని అక్కడ రిలీజ్ చేయబోనని స్పష్టం చేశాడు. దీనివల్ల అతనితోపాటు మూవీ టీమ్ రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్లు నష్టపోతుందని అంచనా వేస్తున్నారు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024