ఆర్సీబీ విజయోత్సవాల్లో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట; 11 మంది మృతి; 50 మందికి పైగా గాయాలు

Best Web Hosting Provider In India 2024


ఆర్సీబీ విజయోత్సవాల్లో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట; 11 మంది మృతి; 50 మందికి పైగా గాయాలు

Sudarshan V HT Telugu

బెంగళూరులో ఆర్సీబీ ఐపీఎల్ విజయోత్సవ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. చిన్నస్వామి స్టేడియం వెలుపల గుమిగూడిన ప్రేక్షకులను నియంత్రించడానికి కర్ణాటక పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.

బెంగళూరు చిన్నసామి స్టేడియ వద్ద తొక్కిసలాట (ANI)

బెంగళూరులో ఆర్సీబీ ఐపీఎల్ విజయోత్సవ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఆర్సీబీ ఐపీఎల్ విజయోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావడంతో చిన్నసామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. అభిమానులను పోలీసులు నియంత్రించలేకపోయారు.

ముగ్గురు మృతి

బెంగళూరులోని చిన్నసామి స్టేడియం వద్ద బుధవారం మధ్యాహ్నం తొక్కిసలాట జరిగి 11 మంది ఆర్సీబీ అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. మంగళవారం రాత్రి పంజాబ్ కింగ్స్తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ విజయం తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఆటగాళ్లను చూసేందుకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్దకు భారీగా అభిమానులు తరలి వచ్చారు. స్టేడియంలో జరిగే ఆర్సీబీ IPL విక్టరీ పరేడ్‌ ను చూసేందుకు వారు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్టేడియం గేటు వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. 50 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో, మృతుల సంఖ్య పెరగవచ్చని ఆందోళన వ్యక్తం అవుతోంది.

స్టేడియంలోనే ఉన్న గవర్నర్‌, సీఎం, మంత్రులు

ఈ తొక్కిసలాట జరిగిన సమయంలో గవర్నర్‌, సీఎం సిద్ధరామయ్య, ఇతర మంత్రులు స్టేడియంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. స్టేడియంలోపలికి ఒక్కసారిగా అభిమానులు బారికేడ్లను దాటుకుని, తోసుకెళ్లడానికి ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. అభిమానులను నియంత్రించడానికి కర్ణాటక పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జ్ చేశారు.

ఆటగాళ్లకు సన్మానం

కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం కూడా బుధవారం ఆర్సీబీ ఆటగాళ్లందరికీ ప్రత్యేక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఐపీఎల్ ఫైనల్ విజయాన్ని పురస్కరించుకుని ప్రజలు సంబరాలు చేసుకుంటుండగా మంగళవారం రాత్రి నుంచి నగరంలో వర్షం కురుస్తోంది. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link