తెలంగాణ డీఈఈసెట్‌ 2025 ఫలితాలు విడుదల – మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి

Best Web Hosting Provider In India 2024

తెలంగాణ డీఈఈసెట్‌ 2025 ఫలితాలు విడుదల – మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

తెలంగాణ డీఈఈసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు deecet.cdse.telangana.gov.in వెబ్ సైట్ లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అర్హత పొందిన విద్యార్థులకు… 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల డీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

డీఈఈసెట్‌ 2025 ఫలితాలు విడుదల

తెలంగాణ డీఈఈసెట్‌ – 2025 ఫలితాలు వచ్చేశాయి. పరీక్ష రాసిన విద్యార్థులు డీఈఈసెట్ అధికారిక వెబ్ సైట్ నుంచి ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఇందుకు సంబంధించిన ఎంట్రెన్స్ ఎగ్జామ్ మే 25వ తేదీన జరిగింది.

టీజీ డీఈఈసెట్ లో అర్హత పొందిన వారికి…. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృత్తి విద్యా కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి డీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎంట్రెన్స్ పరీక్షలో వచ్చిన ర్యాంక్, రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. ఈ సారి 78.18 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 33,321 మంది పరీక్షరాస్తే, వీరిలో 28,442 మంది (78.18శాతం) క్వాలిఫై అయ్యారు.

ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి:

  • ముందుగా https://deecet.cdse.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • డీఈఈసెట్ రిజల్ట్స్ లింక్ పై క్లిక్ చేయాలి.
  • మీ హాల్ టికెట్ నెంబర్ ను నమోదు చేయాలి.
  • సబ్మిట్ చేస్తే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో D.El.Ed , D.P.S.E. లలో ప్రవేశానికి డీఎస్ఈ ప్రతి సంవత్సరం టీజీ డీఈఈసెట్ పరీక్షను నిర్వహిస్తుంది. ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా డీఈఈసెట్‌ ప్రవేశ పరీక్షకు 43,616 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

ఈ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో… త్వరలోనే కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ను విడుదల చేస్తారు. ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. మొత్తం సీట్లలో 85 శాతం సీట్లను స్థానిక అభ్యర్థులకు… మిగతా 15 శాతం సీట్లను స్థానికేతరులకు కేటాయిస్తారు.

ఈ లింక్ పై క్లిక్ చేసి టీజీ డీఈఈసెట్ – 2025 ర్యాంక్ కార్డును డౌన్లోడ్ చేసుకోండి

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

టాపిక్

Telangana NewsExamsTrending Telangana
Source / Credits

Best Web Hosting Provider In India 2024