



Best Web Hosting Provider In India 2024
అమర్ నాథ్ యాత్ర ఈ సారి 38 రోజులు మాత్రమే; ప్రారంభం అయ్యేది ఎప్పుడంటే?
శ్రీ అమర్నాథ్ యాత్ర ఈ సంవత్సరం 38 రోజుల పాటు మాత్రమే జరగనుంది. అమర్నాథ్ యాత్ర సజావుగా సాగడం కోసం వివిధ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) నుండి మొత్తం 581 కంపెనీలను యాత్ర మార్గంలో మోహరించనున్నారు.
అమర్ నాథ్ యాత్ర ఈ ఏడాది జూలై 3 నుంచి ఆగస్టు 9 వరకు జరుగుతుంది. మొదటిసారి 38 రోజుల తక్కువ వ్యవధిలో అమర్ నాథ్ యాత్ర సాగడం ఇదే ప్రథమం. ఈ యాత్ర కోసం అదనపు భద్రతతో పాటు వివిధ కేంద్ర సాయుధ పోలీసు దళాలకు చెందిన మొత్తం 581 కంపెనీలను మోహరించనున్నారు.
జూలై 3 నుంచి
అమర్ నాథ్ యాత్ర ఈ సంవత్సరం జూలై 3 నుంచి ఆగస్టు 9 వరకు, అంటే 38 రోజుల పాటు జరుగుతుంది. అమర్ నాథ్ యాత్ర కాన్వాయ్ కదలికల సమయంలో రక్షణ కోసం తొలిసారిగా జామర్లను ఏర్పాటు చేయనున్నారు. దీనికి సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) రక్షణ కల్పిస్తుంది. కాన్వాయ్ వెళ్లే సమయంలో యాత్రా మార్గాలు, జాతీయ రహదారులకు వెళ్లే అన్ని రహదారులను తాత్కాలికంగా దిగ్బంధించి గరిష్ఠ భద్రతను కల్పించనున్నారు.
పటిష్ట భద్రత
ఈ సంవత్సరం చేపట్టిన భద్రతా చర్యలలో యాత్రామార్గాలను సురక్షితం చేయడానికి, క్లియర్ చేయడానికి రోడ్ ఓపెనింగ్ పార్టీలు (ROP), తక్షణ ప్రతిస్పందన కోసం క్విక్ యాక్షన్ టీమ్స్ (QAT), పేలుడు పదార్థాలను గుర్తించడానికి మరియు నిర్వీర్యం చేయడానికి బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లు (BDS), కె 9 యూనిట్లు (ప్రత్యేకంగా శిక్షణ పొందిన స్నిఫర్ డాగ్స్) మరియు వైమానిక నిఘా కోసం డ్రోన్లు ఉంటాయి.
అమర్ నాథ్ గుహాలయానికి వెళ్లే మార్గంలో..
జమ్ముకశ్మీర్ లోని అమర్ నాథ్ గుహాలయానికి వెళ్లే పహల్గాం, బల్తాల్ మార్గాల్లో ఈ ఏర్పాట్లు ఉంటాయి. 13 ఏళ్ల లోపు వారు, 70 ఏళ్లు పైబడిన వారిని ఈ యాత్రకు అనుమతించబోమని శ్రీ అమర్ నాథ్ జీ పుణ్యక్షేత్రం బోర్డు స్పష్టం చేసింది. వారివద్ద తప్పనిసరి మెడికల్ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ వారిని అనుమతించమని పేర్కొంది. అలాగే, గర్భిణులు కూడా తమ మెడికల్ సర్టిఫికేట్ చూపించినా, వారిని కూడా అనుమతించరు.
వందే భారత్ ట్రైన్
కత్రా-శ్రీనగర్ మధ్య వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించనున్నారని ఉత్తర రైల్వే తెలిపింది. ఐఆర్సీటీసీ గురువారం మధ్యాహ్నం నుంచి అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించింది. ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో చైర్ కార్ (సీసీ), ఎగ్జిక్యూటివ్ క్లాస్ (ఈసీ) అనే రెండు ట్రావెలింగ్ క్లాసులు ఉన్నాయని, వీటి ధర వరుసగా రూ.715, రూ.1320 అని నార్తర్న్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link