బ్లాక్‌బస్టర్ మలయాళం యాక్షన్ డ్రామా.. తెలుగులోనూ రిలీజ్.. ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

Best Web Hosting Provider In India 2024

బ్లాక్‌బస్టర్ మలయాళం యాక్షన్ డ్రామా.. తెలుగులోనూ రిలీజ్.. ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

Hari Prasad S HT Telugu

మలయాళ యాక్షన్ డ్రామా ఒకటి ఇప్పుడు బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది. గత నెల 23న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా వారం తర్వాత తెలుగులోనూ వచ్చింది. ఇప్పటికే బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై ప్రస్తుతం బజ్ నెలకొంది.

బ్లాక్‌బస్టర్ మలయాళం యాక్షన్ డ్రామా.. తెలుగులోనూ రిలీజ్.. ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

మలయాళం ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు వచ్చాయి. తాజాగా గత నెల 23న వచ్చిన సినిమా నరివెట్ట (Narivetta). ప్రముఖ నటుడు టొవినో థామస్ నటించిన ఈ మూవీ 22 ఏళ్ల కిందట కేరళలో జరిగిన ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

నరివెట్ట మూవీ స్టోరీ ఏంటంటే?

నరివెట్ట మూవీ మే 23న మలయాళంలో, తర్వాత వారం రోజులకు అదే టైటిల్ తో మే 30న తెలుగులో రిలీజైంది. నక్కల వేట అనే ట్యాగ్‌లైన్ దీనికి పెట్టారు. ఈ సినిమా ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కింది. 2003లో కేరళలోని వయనాడ్ జిల్లాలోని ముత్తంగలో ఆదివాసీలు చేసిన నిరసన, వాళ్లపై కేరళ పోలీసులు జరిపిన కాల్పుల ఆధారంగా ఈ నరివెట్ట మూవీని తీశారు. ఇందులో టొవినో థామస్ ఓ కానిస్టేబుల్, మరో నటుడు సూరజ్ వెంజరమూడు హెడ్ కానిస్టేబుల్ పాత్రలు పోషించారు.

ప్రభుత్వం తమకు ఇస్తామన్న భూమిని రెండేళ్లయినా కేటాయించకపోవడంతో 2003లో అక్కడి ఆదివాసీలు నిరసనకు దిగారు. దీంతో పోలీసులు వాళ్లపై కాల్పులు జరపడంతో మొత్తం ఐదుగురు చనిపోయారు. అందులో ఒక పోలీస్ అధికారి కూడా ఉన్నారు. ఈ విషాద ఘటన ఆధారంగా నరివెట్ట మూవీని డైరెక్టర్ అనురాజ్ మనోహర్ తీశాడు. టొవినో థామస్, సూరజ్ వెంజరమూడులతోపాటు చేరన్ కూడా ఇందులో నటించాడు.

ఈ సినిమాకు కేరళ బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ వచ్చింది. రూ.10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా.. బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికే రూ.23 కోట్లకుపైగా వసూలు చేసింది. దీంతో తెలుగులోనూ వారం ఆలస్యంగా అంటే మే 30న రిలీజ్ చేశారు. పుష్ప మూవీ మేకర్స్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడం విశేషం.

నరివెట్ట ఓటీటీ రిలీజ్ డేట్

నరివెట్ట మూవీ బాక్సాఫీస్ సక్సెస్ తో ఆ సినిమా ఓటీటీ రిలీజ్ పై ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటి వరకూ మేకర్స్ ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ మధ్యకాలంలో చాలా వరకు మలయాళం సినిమాలు ఆలస్యంగానే డిజిటల్ ప్రీమియర్ అవుతున్నాయి. సుమారు రెండు నెలల గ్యాప్ ఉంటోంది.

ఆ లెక్కన ఈ నరివెట్ట కూడా జులై చివరి వారంలో ఓటీటీలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. త్వరలోనే మేకర్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ను కూడా అనౌన్స్ చేయనున్నారు. మలయాళం ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది ఇప్పటికే ఎల్2: ఎంపురాన్, తుడరుం, రేఖాచిత్రమ్, ఆఫీసర్ ఆన్ డ్యూటీలాంటి హిట్స్ వచ్చిన విషయం తెలిసిందే.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024