




Best Web Hosting Provider In India 2024
12వ తరగతి పాసైన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు- ఎస్ఎస్సీ స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష ఎప్పుడంటే!
ఎస్ఎస్సీ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ అండ్ డీ ఎగ్జామ్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో పరీక్ష తేదీ, పోస్టులు, అర్హత వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న వారికి అలర్ట్! స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ అండ్ డీ ఎగ్జామ్ 2025 నోటిఫికేషన్ని విడుదల చేసింది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సి’ & ‘డి’ ఎగ్జామినేషన్, 2025 కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ssc.gov.in ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్ ద్వారా డైరెక్ట్ లింక్ని పొందవచ్చు.
ఎస్ఎస్సీ స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్- ముఖ్యమైన తేదీలు..
ఎస్ఎస్సీ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ అండ్ డీ ఎగ్జామ్ 2025కి దరఖాస్తుకు చివరి తేదీ 2025 జూన్ 26 అని గుర్తుపెట్టుకోవాలి. ఆన్లైన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 27 జూన్ 2025. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 261 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ఫారంలో సవరణలు చేయడానికి జులై 1 నుంచి జులై 2, 2025 వరకు అవకాశం ఉంది.
సవరించిన/ సరిదిద్దిన దరఖాస్తును తొలిసారి తిరిగి సబ్మిట్ చేయడానికి రూ.200, రెండోసారి సవరించిన/ సరిదిద్దిన దరఖాస్తును తిరిగి సబ్మిట్ చేయడానికి రూ.500/-. ఏకరీతి కరెక్షన్ ఛార్జీలను కమిషన్ వసూలు చేస్తుంది. జెండర్/కేటగిరీతో సంబంధం లేకుండా అభ్యర్థులందరికీ కరెక్షన్ ఛార్జీలు వర్తిస్తాయి. కరెక్షన్ ఛార్జీలను భీమ్ యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో లేదా రూపే డెబిట్ కార్డులను ఉపయోగించడం ద్వారా మాత్రమే ఆన్లైన్ మోడ్ ద్వారా చెల్లించవచ్చు.
ఎంపిక విధానం..
ఎస్ఎఎస్సీ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ- డీ కోసం కంప్యూటర్ ఆధారిత పరీక్షను 2025 ఆగస్టు 6 నుంచి 11 వరకు నిర్వహిస్తారు. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్పై ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష 2 గంటల పాటు ఉంటుంది. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ తరహా మల్టిపుల్ చాయిస్గా మాత్రమే ఉంటుంది. ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీలో ఉంటాయి.
అర్హత..
కటాఫ్ తేదీ నాటికి అంటే 01.08.2025 నాటికి గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుంచి 12వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు ఫీజు రూ.100. రిజర్వేషన్కు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ (ఈఎస్ ఎం)లకు చెందిన మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
భీమ్ యూపీఐ, నెట్ బ్యాంకింగ్ లేదా వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో లేదా రూపే డెబిట్ కార్డులను ఉపయోగించి మాత్రమే ఫీజు చెల్లించవచ్చు.
మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్ని చూడవచ్చు.
వివరణాత్మక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link