మామిడిపండు ఇస్తానని చెప్పి చిన్నారిపై అత్యాచారం; నిందితుడికి దేహశుద్ధి, అరెస్ట్

Best Web Hosting Provider In India 2024


మామిడిపండు ఇస్తానని చెప్పి చిన్నారిపై అత్యాచారం; నిందితుడికి దేహశుద్ధి, అరెస్ట్

Sudarshan V HT Telugu

ఒక వివాహ వేడుకలో ఈ దారుణం జరిగింది. పెళ్లికి కుటుంబంతో కలిసి హాజరైన ఒక ఐదేళ్ల బాలికకు 25 ఏళ్ల యువకుడు మామిడిపండు ఇస్తానని చెప్పి బయటకు తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి ఆ సమయంలో మద్యం సేవించి ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

చిన్నారిపై అత్యాచారం

జార్ఖండ్ లోని రాంచీకి 50 కిలోమీటర్ల దూరంలోని చాన్హోలోని ఓ గ్రామంలో శుక్రవారం సాయంత్రం జరిగిన వివాహ రిసెప్షన్ లో ఐదేళ్ల బాలికపై 25 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణానికి పాల్పడిన సమయంలో ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడని, బాలికకు మామిడి పండు ఇస్తానని చెప్పి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.

చితకబాదిన గ్రామస్తులు

ఈ ఘటన తర్వాత గ్రామస్తులు నిందితుడిని చితకబాదారు, అనంతరం పోలీసులు అతడిని అరెస్టు చేశారు. బాధితురాలికి శుక్రవారం రాత్రి వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితుడిని అరెస్టు చేశామని, శనివారం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరుస్తామని చాన్హో పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ చందన్ కుమార్ గుప్తా తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ‘‘బాధిత బాలిక కుటుంబం, నిందితుడు ఒకే గ్రామానికి చెందినవారు. వారు శుక్రవారం గ్రామంలో జరిగిన వివాహ రిసెప్షన్ కు వెళ్లాడు. బాలికకు మామిడి పండు ఇస్తానని మాయమాటలు చెప్పి ఆ యువకుడు సమీపంలోని తోటలోకి తీసుకెళ్లాడు. అక్కడ మైనర్ బాలికపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు’’ అని బాధితురాలి కుటుంబ వాంగ్మూలాన్ని ఉటంకిస్తూ గుప్తా తెలిపారు.

మైనర్ బాలికపై తండ్రి అత్యాచారం

మరో ఘటనలో, పంజాబ్ లోని హోషియార్ పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో 11 ఏళ్ల బాలికపై కన్న తండ్రే అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని ముకేరియన్ ఎస్హెచ్ఓ జోగిందర్ సింగ్ తెలిపారు. నిందితుడిని 2011లో వివాహం చేసుకున్నానని, తమకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారని తల్లి పోలీసులకు తెలిపింది. తన భర్త తనతో, పిల్లలతో తరచూ గొడవపడేవాడని, తాను పుట్టింట్లోనే ఉంటున్నానని ఆమె పోలీసులకు తెలిపింది. మార్చి 22న తండ్రి కూతురిని స్వగ్రామానికి తీసుకెళ్లాడు. తన తండ్రి తనను తరచూ కొడుతున్నాడని, లైంగిక దాడికి పాల్పడుతున్నాడని ఆ బాలిక తన తల్లికి ఫోన్లో చెప్పినట్లు తల్లి ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడిని అరెస్టు చేశామని, భారతీయ న్యాయ సంహిత, పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు అధికారి తెలిపారు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link