నిమిషానికి రూ.4.35 కోట్లు! ఇండియాలో అత్యధిక పారితోషికం పొందిన నటుడు.. షారుక్, సల్మాన్, ప్రభాస్ ను ఓడించిన హీరో ఎవరంటే?

Best Web Hosting Provider In India 2024

నిమిషానికి రూ.4.35 కోట్లు! ఇండియాలో అత్యధిక పారితోషికం పొందిన నటుడు.. షారుక్, సల్మాన్, ప్రభాస్ ను ఓడించిన హీరో ఎవరంటే?

ఓ స్టార్ హీరో ఒక బ్లాక్ బస్టర్ సినిమాలో కనిపించడానికి నిమిషానికి రూ.4.35 కోట్లు ఛార్జ్ చేశాడు. దీంతో భారతీయ సినీ రంగంలోనే అత్యధిక రోజువారీ పారితోషికం పొందిన నటుడిగా నిలిచాడు. షారుక్, సల్మాన్, అల్లు అర్జున్, ప్రభాష్ ను వెనక్కినెట్టిన ఆ హీరో ఎవరో చదివేయండి.

నిమిషానికి రూ.4.35 కోట్లు తీసుకున్న హీరో

సినిమా అనేది అతిపెద్ద ఎంటర్ టైన్మెంట్ ఇండస్ట్రీ. మూవీస్ చేసేందుకు హీరోలు తీసుకుంటున్న రెమ్యునరేషన్ రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. రూ.100 కోట్లు దాటి రూ.300 కోట్ల వరకూ చేరుకుంది. కానీ ఓ స్టార్ హీరో ఓ బ్లాక్ బస్టర్ సినిమాలో క్యామియో రోల్ కోసం నిమిషానికి రూ.4.35 కోట్లు తీసుకున్నాడనే విషయం తెలుసా? అవును.. ఇది నిజమే. ఆ హీరో అజయ్ దేవగన్ అయితే.. ఆ మూవీ ఆర్ఆర్ఆర్.

8 నిమిషాలకు రూ.35 కోట్లు

బాహుబలి, బాహుబలి 2 అద్భుత విజయాల తరువాత ఎస్.ఎస్. రాజమౌళి చేసిన భారీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ మూవీ. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ హీరోలు. మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఇతర ఫేమస్ యాక్టర్లు కూడా యాక్టింగ్ చేశారు. 2019 ప్రారంభంలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ ఈ మూవీలో క్యామియో కోసం సైన్ చేశాడు. ఆయనతో పాటు ఆలియా భట్, శ్రియా శరణ్ కూడా తరువాత చేరారు.

ఆర్ఆర్ఆర్ సినిమాలో అజయ్ దేవగన్ కేవలం 8 నిమిషాలు మాత్రమే కనిపించాడు. కానీ ఆయన ఇందుకోసం ఏకంగా రూ.35 కోట్లు వసూలు చేశాడు. ఇది భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన క్యామియో. అంటే నిమిషానికి రూ.4.35 కోట్లు తీసుకున్నాడు అజయ్ దేవగన్. భారతదేశంలో ఏ నటుడు వసూలు చేయని అత్యధిక రోజువారీ పారితోషికం ఇది.

ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో డైరెక్టర్ రాజమౌళితో అజయ్ దేవగన్
ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో డైరెక్టర్ రాజమౌళితో అజయ్ దేవగన్

వీళ్ల కంటే ఎక్కువే

నిమిషాల పరంగా తీసుకున్న డబ్బు చూసుకుంటే అజయ్ దేవగన్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. షారుక్ ఖాన్ టాప్ లో నిలవాంటే జవాన్ సినిమాలో 70 నిమిషాల పాటు కనిపించడానికి రూ.300 కోట్లు (సినిమా బడ్జెట్ కంటే ఎక్కువ) వసూలు చేయాల్సింది. నిమిషానికి రూ.4.35 కోట్ల రేటు ప్రకారం.. జైలర్ సినిమాలో రజినీకాంత్, టైగర్ 3లో సల్మాన్ ఖాన్, కల్కి 2898 ఏడీలో ప్రభాస్, పుష్ప 2లో అల్లు అర్జున్ అందరూ రూ.250-300 కోట్లు వసూలు చేయాల్సి ఉండేది. కానీ వాళ్లు తీసుకున్నది తక్కువే. ఆర్ఆర్ఆర్ లో క్యామియో అజయ్‌ను భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందిన నటుడిగా మార్చింది.

ఓటీటీలోనూ హైయ్యస్ట్

అజయ్ చివరగా 2021లో హాట్‌స్టార్ రూపొందించిన రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్ కోసం రూ.125 కోట్లకు సైన్ చేసినప్పుడు దేశంలో అత్యధిక పారితోషికం పొందిన ఓటీటీ స్టార్ అయ్యాడు. అజయ్ దేవగన్ ఇటీవలి చిత్రాలు అతని స్టార్ డమ్ ను అమాంతం పెంచేశాయి. దృశ్యం 2, రైడ్ 2, సింగం అగైన్ వంటి చిత్రాల విజయంతో తిరుగులేని స్టార్ గా ఎదిగాడు. ఈ నటుడు ప్రాజెక్ట్‌ను బట్టి తన ఫీజును మారుస్తున్నట్లు తెలుస్తోంది. ఆరోన్ మేన్ కాహాన్ డుమ్ థా, రైడ్ 2 వంటి చిన్న బడ్జెట్ చిత్రాలకు రెమ్యునరేషన్ ను రూ.20 కోట్లకు తగ్గించాడు. కానీ సింగం అగైన్ వంటి పెద్ద చిత్రాలకు దాన్ని రూ.40 కోట్లకు పెంచాడు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024