





Best Web Hosting Provider In India 2024

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్ చెప్పిన డైరెక్టర్.. హరిహర వీరమల్లులో ఆ యాక్షన్ సీక్వెన్స్ హైలైట్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు రిలీజ్ మరోసారి వాయిదా పడిన సంగతి తెలిసిందే. కానీ ఈ మూవీ బజ్ మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ సినిమా గురించి డైరెక్టర్ చేసిన కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. యాక్షన్ సీక్వెన్స్ మరో రేంజ్ లో ఉన్నాయంటూ అంచనాలు పెంచేశారు.
హరిహర వీరమల్లు రిలీజ్ కోసం ఎంతో వెయిట్ చేసిన ఫ్యాన్స్ కు నిరాశ తప్పలేదు. జూన్ 12న రిలీజ్ కావాల్సిన మూవీ మరోసారి వాయిదా పడింది. థియేట్రికల్ రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. అయినా ఈ మూవీ గురించి క్రేజీ బజ్ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ మూవీపై అంచనాలను మరింత పెంచేసేలా హరిహర వీరమల్లు డైరెక్టర్ జ్యోతికృష్ణ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
సీజ్ ద షిప్
జనసేన పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి వచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని నెలల కిందట కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాపై పవన్ మండిపడ్డారు. ఆ సందర్భంగా ‘సీజ్ ద షిప్’ అంటూ పవన్ చెప్పిన డైలాగ్ ఫేమస్ గా మారిన సంగతి తెలిసిందే. హరిహర వీరమల్లులోనూ ‘సీజ్ ద షిప్’ అనే మాటను రీ క్రియేట్ చేసినట్లు యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందని జ్యోతికృష్ణ తెలిపారు.
భారీ యాక్షన్ సీక్వెన్స్
మచిలీపట్నంలో జరిగిన బీచ్ ఫెస్టివల్ లో హరిహర వీరమల్లు డైరెక్టర్ జ్యోతికృష్ణ, హీరోయిన్ నిధి అగర్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూవీలోని భారీ యాక్షన్ సీక్వెన్స్ గురించి జ్యోతికృష్ణ చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్ కు ఫుల్ కిక్కిచ్చేలా ఉన్నాయి. ‘‘బందరు పోర్ట్ కు సంబంధించి మన సినిమాలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంది. పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఈ సీక్వెన్స్ ను ప్రేక్షకులు ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. కథకు తగిన విధంగా సీజీలో ఈ పోర్ట్ రీ క్రియేట్ చేయడానికి రెండేళ్లు కష్టపడ్డాం’’ అని జ్యోతికృష్ణ అన్నారు.
మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్
హరిమర వీరమల్లులో భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేశారని డైరెక్టర్ జ్యోతికృష్ణ వెల్లడించారు. అలాగే పవన్ నిజ జీవితానికి రిలేట్ అయ్యేలా అనేక సీన్స్ సినిమాలో ఉన్నాయన్నారు. ఈ మూవీలో మచిలీపట్నం పోర్టు చూశాక ఆంధ్రానే కాదు దేశమంతా దద్దరిల్లిపోతుందని పేర్కొన్నారు.
రూ.250 కోట్ల బడ్జెట్
పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు మూవీని క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ కలిసి డైరెక్ట్ చేశారు. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్. మెగా సూర్య ప్రొడక్షన్ పై ఏఎం రత్నం ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటున్న ఈ మూవీ బడ్జెట్ రూ.250 కోట్లు అని డైరెక్టర్ జ్యోతికృష్ణ వెల్లడించారు.
‘‘పవన్ కల్యాణ్ తో వర్క్ చేసే అవకాశం దొరకడం నా లక్. ఎవరిలో టాలెంట్ ఉన్నా ఆయన గుర్తిస్తారు. ఒక్కసారి నమ్మితే ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. నన్ను నమ్మి నాతో సినిమా చేశారు. ఇప్పటికే ఆయన ఒక్కసారి కాదు మూడు సార్లు సినిమా చూశారు. నన్నెంతో మెచ్చుకుంటూ.. నాతో మరో సినిమా చేయాలనుందని చెప్పారు’’ అని జ్యోతికృష్ణ చెప్పారు.
సంబంధిత కథనం