‘కమిషన్ ముందుకు తప్పకుండా వెళ్తాం’ – కాళేశ్వరంపై హరీశ్ రావ్ ప్రజంటేషన్, ఇవిగో పాయింట్స్

Best Web Hosting Provider In India 2024

‘కమిషన్ ముందుకు తప్పకుండా వెళ్తాం’ – కాళేశ్వరంపై హరీశ్ రావ్ ప్రజంటేషన్, ఇవిగో పాయింట్స్

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొత్తం 20 లక్షల 33 వేల 572 ఎకరాలకు సాగు నీరు అందిందని మాజీ మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఇవాళ తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన ఆయన…క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేశారు. కాళేశ్వరం కమిషన్ ముందుకు తప్పకుండా వెళ్తామని స్పష్టం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ – మాజీ మంత్రి హరీశ్ రావ్ ప్రజంటేషన్

‘కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై దుష్ప్రచారం – వాస్తవాలు’ అనే అంశంపై తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు.మేడిగడ్డ ప్రాజెక్టులో 85 పిల్లర్లకు కేవలం 2 మాత్రమే కుంగితే… మొత్తం ప్రాజెక్టే కూలిపోయినట్లు కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా కేవలం 11 టీఎంసీల నీటి మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉండేదన్నారు. కానీ… కేసీఆర్ ముందు చూపుతో కాళేశ్వరం ద్వారా 141 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా 16 రిజర్వాయర్ల నిర్మాణం జరిగిందని చెప్పారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవుతామని… వాస్తవాలను వాళ్ల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు.

పవర్ పాయింట్ ప్రజెంటేషన్ – హరీశ్ రావ్ చెప్పిన విషయాలు:

  • కేంద్రంలో, మహారాష్ట్రలో, ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా 8 ఏండ్ల కాలంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు ఒక్క అనుమతి సాధించలేదు.
  • “గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా కేవలం 11 టీఎంసీల నీటి మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉండేది.
  • కేసీఆర్ ముందు చూపుతో కాళేశ్వరం ద్వారా 141 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా 16 రిజర్వాయర్ల నిర్మాణం జరిగింది.
  • కాళేశ్వరం అంటే.. మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజ్ లు, 203 కిలో మీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98కిలో మీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు, 530 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసేటువంటి వ్యవస్థ, 240 టీఎంసీల నీటి వినియోగం ఉంటుంది.
  • మేడిగడ్డ, అన్నరం, సుందిళ్ల, మేడారం, మల్కపేట, అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, బుస్సాపూర్, గంధమల్ల, కొండం చెరువు, భూంపల్లి, మోతె, ధర్మారావుపేట, కాటేవాడి, ముద్దోజివాడి, తిమ్మక్కపల్లి రిజర్వాయర్లలో 141 నీటి నిల్వ సామర్ధ్యం ఉంది.
  • ఒక్క మల్లన్న సాగర్ లోనే 50 టీఎంసీల నీటి నిల్వ ఉంటుంది. ఎస్సారెస్పీకి నీళ్లు రానపుడు, కడెం నిండకుండా ఎల్లంపల్లికి కూడా నీళ్లు రానపుడు, మేడిగడ్డలో నీళ్లుంటాయి. ఎక్కడా నీళ్లు లేనపుడు కూడా నీళ్లు లభ్యమయ్యే పాయింట్ మేడిగడ్డ.
  • వర్షాలు బాగా కురిసినపుడు ఎస్సారెస్పీ నుంచి మిడ్ మానేరుకు నీళ్లు తెచ్చుకున్నాం. మిడ్ మానేర్ లో పంప్ చేసి నుంచి అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ వరకు నీళ్లు తెచ్చుకున్నాం.
  • కాళేశ్వరంలో అంతర్భాగమైన వీటి అంతటా లక్షల ఎకరాల్లో పంటలు పండాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టిన మోటార్లతోనే అన్నపూర్ణకు నీళ్లొచ్చినయి.
  • అన్నపూర్ణలో పెట్టిన మోటార్లతో రంగనాయక సాగర్ కు నీళ్లొచ్చినయి. రంగనాయక సాగర్ మోటార్లతో మిడ్ మానేర్ కు నీళ్లొచ్చినయి. మిడ్ మానేర్ మోటార్లతో మల్లన్నసాగర్ కు, అక్కడి మోటార్లతో కొండ పోచమ్మ సాగర్ కు నీళ్లొచ్చినయి.
  • ఇదంతా కాళేశ్వరంలో భాగంగానే.. వ్యవస్థ అంతా పనిచేయడం వల్లనే లక్షల ఎకరాల్లో పంట పండింది.
  • కాళేశ్వరం కింద ఒక్క ఎకరా పారలేదు అంటడు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే, 50 వేల ఎకరాలు మాత్రమే సాగయింది అంటడు. ఇంకో కాంగ్రెస్ నాయకుడేమో లక్ష ఎకరాలే పారింది అంటడు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు, ఒక్కో నాయకుడు ఒక్కో లెక్క చెబుతున్నారు.
  • కాళేశ్వరం నీళ్లతో ఇప్పటి వరకు నేరుగా 98,570 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందింది.
  • కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వల ద్వారా నింపిన 456 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల ద్వారా 39,146 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందింది.
  • కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో ఎస్సారెస్పీ స్టేజీ 1, ఎస్సారెస్పీ స్టేజీ 2 మరియు నిజాంసాగర్ నీటితో నింపిన 2143 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల ద్వారా 1 లక్షా 67 వేల కొత్త ఆయకట్టు సాగయింది.
  • ఎస్సారెస్పీ స్టేజీ 1, ఎస్సారెస్పీ స్టేజీ 2 మరియు నిజాంసాగర్ ప్రాజెక్టులకు కాళేశ్వరం నీరందించి 17 లక్షల 8 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం జరిగింది.
  • కాళేశ్వరం నీళ్లు కూడెల్లి వాగు, హల్దీ వాగుల ద్వారా 66 చెక్ డ్యాములతో మరో 20 వేల 576 ఎకరాలకు సాగునీరందింది.
  • దేశంలోనే అతి తక్కువ కాస్ట్ ఎస్కలేషన్‌తో పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం
  • నాగార్జునసాగర్ ప్రాజెక్టు ముందు 122 కోట్లతో అంచనా వేస్తే పూర్తయ్యే నాటికి 1183.94 కోట్లకు పెరిగింది అంటే 9 రేట్లు పెరిగింది
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ముందు 40 కోట్లతో అంచనా వేస్తే పూర్తయ్యే నాటికి 4300 కోట్లకు పెరిగింది అంటే 107 రేట్లు పెరిగింది
  • జూరాల ప్రాజెక్టు ముందు 70 కోట్లతో అంచనా వేస్తే పూర్తయ్యే నాటికి 1815 కోట్లకు పెరిగింది అంటే 25 రేట్లు పెరిగింది.
  • కాళేశ్వరం ప్రాజెక్ట్ 80 వేల కోట్లతో డీపీఆర్ అప్రూవ్ అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి 94 వేల కోట్లు మాత్రమే అయింది అంటే 0.5 రేట్లు పెరిగింది – హరీష్ రావు
  • కాళేశ్వరం కమిషన్ ముందుకు తప్పకుండా వెళతాం. కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారాలన్నీ పటాపంచలు చేస్తాం.
  • కరువు కాలంలో తెలంగాణకు కల్పతరువు కాళేశ్వరం ప్రాజెక్టు. కాంగ్రెస్ సర్కార్ చిల్లర రాజకీయాలు, చిల్లర ప్రచారాలు మాని.. ఇప్పటికైనా ప్రాజెక్టును రిపేర్ చేయాలి” అని హరీశ్ రావ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

టాపిక్

Kaleshwaram ProjectTelangana NewsTrending TelanganaBrsHarish Rao
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024