





Best Web Hosting Provider In India 2024

ఇప్పటికీ తగ్గని మాస్టర్ బ్లాస్టర్ క్రేజ్.. ఆమిర్ ఖాన్ ఇంట్లో సచిన్ సచిన్.. చూడగానే షాక్.. వీడియో వైరల్
ఆమిర్ ఖాన్ లేటెస్ట్ సినిమా ‘సితారే జమీన్ పర్’ ప్రీమియర్ జరిగింది. ఈ సందర్భంగా ఆమిర్ ఖాన్ ఇంట్లో సచిన్ టెండూల్కర్ కు ఘన స్వాగతం దక్కింది. సచిన్ చూడగానే షాక్ అని అక్కడివాళ్లు సచిన్, సచిన్ అంటూ అరిచారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ లేటెస్ట్ మూవీ ‘సితారే జమీన్ పర్’. ఈ సినిమా ప్రీమియర్ తాజాగా నిర్వహించారు. దీని కోసం ఆమిర్ ఖాన్ ఇంటికి క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వెళ్లారు. ఆమిర్ ఇంట్లో సచిన్ అడుగుపెట్టగానే అక్కడి వాతావరణమే మారిపోయింది. ఒక్కసారిగా ఆ ఇల్లు స్టేడియంగా మారిపోయింది. సచిన్, సచిన్ పేరుతో మార్మోగిపోయింది.
అందరూ షాక్
ఆమిర్ ఖాన్ అప్పటివరకూ సరదాగా గేమ్ ఆడుతూ ఉన్నారు. సచిన్ టెండూల్కర్ వస్తున్నారని ఎవరో చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయినట్లు కనిపించారు. ఆమిర్ వెళ్లి సచిన్, అంజలి దంపతలకు వెల్ కమ్ చెప్పారు. అక్కడున్న వాళ్లంతా సచిన్ ను చూసి ఫుల్ సర్ ప్రైజ్ అయ్యారు. నమ్మశక్యం కానట్లు చూశారు. ఓ కుర్రాడైతే ఎగిరి గంతేశాడు. ఇక అందరూ సచిన్, సచిన్ అంటూ కేరింతలు కొట్టారు.
ఆ అరుపులు
రెండు దశాబ్దాలకు పైగా స్టేడియంలో వినిపించిన సచిన్, సచిన్ అరుపులు.. ఇప్పుడు ఆమిర్ ఖాన్ ఇంట్లో కూడా ప్రతిధ్వనించాయి. ఎప్పటిలాగే వినయంగా ఉన్న టెండూల్కర్ తన చిరునవ్వుతో ముందుకు వెళ్లిపోయారు. వారి ప్రేమకు, మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు. సితారే జమీన్ పర్ మూవీ ప్రీమియర్ సందర్భంగా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదీ సచిన్ క్రేజ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. 2013లో సచిన్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.
స్పెషల్ బాండ్
సచిన్ టెండూల్కర్, ఆమిర్ ఖాన్ మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ ఇద్దరు దిగ్గజాలు వేర్వేరు రంగాల నుండి వచ్చినప్పటికీ ఒకరి పనిని మరొకరు ఎప్పుడూ ప్రశంసించుకుంటూనే ఉంటారు. సినిమా ప్రీమియర్లో, క్రికెట్ మ్యాచ్ ల్లో వీళ్లు కలవడం హాట్ టాపిక్ గా మారేది. ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్, ఖుషీ కపూర్ నటించిన లవ్యాప సినిమా ప్రత్యేక ప్రదర్శనకు కూడా ఈ సంవత్సరం ఫిబ్రవరిలో టెండూల్కర్ను ఆమిర్ ఆహ్వానించారు.
ఆ సిరీస్ కు పేరు
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబయి ఇండియన్స్ ఐపీఎల్ 2025 ప్లేఆఫ్కు చేరుకున్నప్పుడు టెండూల్కర్ చివరిసారిగా డగౌట్లో కనిపించారు. అయితే క్వాలిఫయర్ 2లో పంజాబ్ కింగ్స్ చేతిలో ముంబయి ఓడిపోయింది. ఇక ఇంగ్లాండ్, ఇండియా మధ్య స్టార్ట్ కాబోయే టెస్టు సిరీస్ కు టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీ అని పేరు పెడతారనే వార్తలు వస్తున్నాయి.
క్రికెట్ చరిత్రలో గొప్ప ఆటగాళ్లలో ఒకరైన టెండూల్కర్ టెస్ట్ క్రికెట్లో 15,921 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. 52 ఏళ్ల టెండూల్కర్ 1989 నుంచి 2013 మధ్య 200 టెస్టులు ఆడాడు. టెస్ట్, వన్డే ఫార్మాట్లలో ఎన్నో రికార్డులు సృష్టించాడు. అండర్సన్ ఇంగ్లాండ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా, టెస్ట్ క్రికెట్లో 704 వికెట్లతో అత్యంత విజయవంతమైన పేస్ బౌలర్గా కొనసాగుతున్నాడు.
సంబంధిత కథనం