‘‘మహారాష్ట్ర ఎన్నికలను బీజేపీ రిగ్గింగ్ చేసి గెలిచింది’’: స్టెప్ బై స్టెప్ వివరించిన రాహుల్ గాంధీ

Best Web Hosting Provider In India 2024


‘‘మహారాష్ట్ర ఎన్నికలను బీజేపీ రిగ్గింగ్ చేసి గెలిచింది’’: స్టెప్ బై స్టెప్ వివరించిన రాహుల్ గాంధీ

Sudarshan V HT Telugu

2024లో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రిగ్గింగ్ కు పాల్పడిందని, రిగ్గింగ్ వల్లనే విజయం సాధించిందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. త్వరలో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే జరుగుతుందని విమర్శించారు.

రాహుల్ గాంధీ (HT Photo)

గత ఏడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రిగ్గింగ్ కు పాల్పడిందని, రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే పునరావృతమవుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ లో ఆయన ఒక పోస్ట్ పెట్టారు. అందులో ఒక వార్తాపత్రికలో ప్రచురితమైన తాను రాసిన ఒక వ్యాసాన్ని షేర్ చేశారు. ‘‘ఎన్నికలను ఎలా రిగ్గింగ్ చేయాలి? 2024లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని రిగ్గింగ్ చేయడానికి బ్లూప్రింట్ గా నిలిచాయి. అంచెలంచెలుగా ఇది ఎలా జరిగిందో నా వ్యాసం చూపిస్తుంది’’ అని ఆ పోస్ట్ లో తెలిపారు.

స్టెప్ బై స్టెప్ వివరణ

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ఎలా రిగ్గింగ్ చేసి గెలిచిందో రాహుల్ గాంధీ స్టెప్ బై స్టెప్ వివరించారు. అవి ఇలా ఉన్నాయి.

దశ 1: ముందుగా ఎన్నికల కమిషన్ ను నియమించడానికి ఏర్పాటైన ప్యానెల్ ను రిగ్ చేస్తారు.

దశ 2: నకిలీ ఓటర్లను జాబితాలో చేరుస్తారు.

దశ 3: ఓటింగ్ శాతాన్ని కృత్రిమంగా పెంచుతారు.

దశ 4: బీజేపీ కచ్చితంగా గెలవాల్సిన చోట బోగస్ ఓటింగ్ ను లక్ష్యంగా చేసుకుంటారు.

దశ 5: సాక్ష్యాలను దాచేస్తారు.

అని రాహుల్ గాంధీ వివరించారు. రిగ్గింగ్ అనేది మ్యాచ్ ఫిక్సింగ్ లాంటిదని, అది మోసం చేసే జట్టును గెలిపిస్తుందని వ్యాఖ్యానించారు. ‘‘కానీ, అది ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేస్తుంది. ప్రజల నమ్మకాన్ని నాశనం చేస్తుంది’’ అన్నారు. సంబంధిత భారతీయ పౌరులందరూ సమాధానాలు కోరాలని, సాక్ష్యాలను మదింపు చేసేటప్పుడు పరిస్థితిని స్వయంగా అంచనా వేయాలని ఆయన కోరారు.

నెక్స్ట్ బిహార్..

మహారాష్ట్ర మ్యాచ్ ఫిక్సింగ్ తర్వాత బిహార్ కు వస్తుందని, ఆ తర్వాత ఎక్కడ బీజేపీ ఓడిపోయే పరిస్థితి ఉంటే అక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ ప్రారంభమవుతుంది’ అన్నారు. అయితే, మ్యాచ్ ఫిక్సింగ్ ఎన్నికలు ఏ ప్రజాస్వామ్యానికైనా విషం లాంటివని రాహుల్ గాంధీ హెచ్చరించారు. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని మహాయుతి కూటమి 235 సీట్లతో నిర్ణయాత్మక విజయం సాధించగా, కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link