





Best Web Hosting Provider In India 2024

నిన్ను కోరి జూన్ 9 ఎపిసోడ్: శ్యామలను ఏడిపించిన కామాక్షి- శాలిని కన్నింగ్ ప్లాన్ ఫెయిల్- శ్రుతికి తల్లిలాంటి గతి!
నిన్ను కోరి సీరియల్ జూన్ 9 ఎపిసోడ్లో తాళి గొప్పతనం గురించి శ్యామల చెబుతుంది. ఆ తాళికి శ్యామల నోచుకోలేదని కామాక్షి అంటుంది. దాంతో శ్యామల కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తుంది. నల్ల పూసలను శాలిని మాయం చేస్తుంది. కానీ, వాటిని తిరిగి తీసుకొచ్చిన చంద్రకళ ఆ ప్లాన్ ఫెయిల్ అయ్యేలా చేస్తుంది.
నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో చంద్రకళకు తల్లిగా భీమవరం శ్యామల పుస్తెల తాడు తెప్పిస్తుంది. దాంతో చంద్రకళ చాలా ఎమోషనల్ అవుతుంది. వెళ్లి శ్యామలను హగ్ చేసుకుంటుంది. అది చూసి జగదీశ్వరి కూడా ఎమోషనల్ అవుతుంది. ఏమైందమ్మా. ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావ్. నీకు ఎవరు లేరనుకోకు. నేనున్నాను అని శ్యామల అంటుంది.
పుట్టింటి లేని లోటు
నా పుట్టింటివాళ్లు లేని లోటు తీర్చారు. మీరు నాకు మా అమ్మలాగే కనిపిస్తున్నారు పిన్నిగారు. మీకెలా కృతజ్ఞత చెప్పాలో తెలియట్లేదు అని చంద్రకళ అంటుంది. అసలు తల్లి ప్రేమను పంచే అదృష్టమే నాకు లేదనుకున్నా. నీ వల్ల నాకు అనుభూతి దొరికినందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి అని శ్యామల అంటుంది.
వదినా నీ కొడుకు గొప్ప అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు. చంద్రను చూస్తుంటే నిన్ను చూస్తున్నట్లే ఉంది. పుట్టింటికి దూరమైన బాధ నీకు తెలుసు. అది చంద్రకళ పడకూడదు. తనకు అత్తతోపాటు తల్లివి కూడా నువ్వే కావాలి అని శ్యామల అంటుంది. అత్తయ్య నాకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నారు అని చంద్రకళ అంటుంది. దృష్టత్రయంపై కోప్పడుతుంది శ్యామల.
నీ కూతురుకు అదే గతి
నీకు బంధాలను కలుపుకుపోవడం తెలియదు కాబట్టే ఇలా ఇంకా పుట్టింట్లో ఉన్నావ్. రేపు నీ కూతురుకు కూడా నీ గతే పడుతుందని కామాక్షిని అంటుంది శ్యామల. శాలిని అనుభవం గురించి అన్నావ్. చూశావుగా. మీ ముగ్గురికి చంద్రకళ కోడలు అవ్వడం నచ్చలేదని అర్థమైంది. అది ఎందుకో పూజ తర్వాత కనిపెడతా అని శ్యామల అంటుంది. విరాట్ గురించి అడిగితే మీటింగ్ ఉందని వెళ్లిపోయారని చంద్రకళ చెబుతుంది.
అలా ఎలా వెళ్లనిచ్చావ్. నాకు చెప్పింటే నేను ఆపేదాన్నిగా అని కోప్పడుతుంది శ్యామల. ఫోన్ చేస్తే విరాట్ స్విచ్ఛాఫ్ వస్తుంది. కట్ చేస్తే విరాట్ ఆఫీస్కు శ్యామల వెళ్తుంది. దాంతో విరాట్ షాక్ అవుతాడు. ముహుర్తానికి ఇంకో అరగంట ఉంది. పదా వెళ్దాం అని శ్యామల అంటుంది. టైమ్ ఉంది కాబట్టే నేను వచ్చాను. లేకుంటే వీడి భార్యను తీసుకొచ్చి తాళి కట్టిచ్చేదాన్ని అని విరాట్ను బలవంతంగా ఈడ్చుకెళ్తుంది శ్యామల.
విరాట్ను తీసుకొచ్చిన శ్యామల
ఈ కార్యక్రమం జరగలేదని శ్యామలను దెప్పిపొడుస్తే ఊరుకోను అని కామాక్షి, శ్రుతి, శాలినికి వార్నింగ్ ఇస్తుంది జగదీశ్వరి. ఇంతలో విరాట్ను శ్యామల తీసుకొస్తుంది. తర్వాత విరాట్ను డ్రెస్ మార్చుకోమని పైకి పంపిస్తారు. కార్యక్రమం జరగాలంటే నల్లపూసలు కూడా ఉండాలిగా. అవి మాయం చేశానని తన కన్నింగ్ ప్లాన్ గురించి చెబుతుంది శాలిని. విరాట్ పట్టు పంచే కట్టుకుని వస్తాడు.
ముత్యం, పగడం, నల్లపూసలు ఏవని పంతులు అడిగితే దేవుడి దగ్గర ఉన్నాయని శ్యామల తీసుకొస్తుంది. అవి చూసి దుష్టత్రయం షాక్ అవుతారు. నల్లపూసలు మాయం చేశానన్నావ్ అని కామాక్షి అంటే.. నేను మాయం చేశాక ఆ చంద్రకళ ఏదో మాయ చేసినట్లుందని శాలిని అంటుంది. అవును అన్నట్లుగా చంద్రకళ తల ఊపుతుంది. అలా శాలిని కన్నింగ్ ప్లాన్ ఫెయిల్ అవుతుంది.
ఏడ్చిన శ్యామల
శ్యామల, జగదీశ్వరి నల్లపూసలు, పగడాలు, సూత్రాలు, తాళికి కుచ్చుతారు. శ్యామల, జగదీశ్వరి ఇద్దరు కలిసి తాళి రెడీ చేస్తారు. తాళి గురించి బాగా చెప్పారు అని చంద్రకళ అంటుంది. ఏం చెప్పి ఏం లాభం తనే తాళికి నోచుకోలేదని కామాక్షి అంటుంది. దాంతో శ్యామల కన్నీళ్లు పెట్టుకుని పక్కకు జరుగుతుంది. కామాక్షి అని జగదీశ్వరి వారిస్తుంది.
అన్ని తెలిసి ఆ మాట ఎలా అన్నావ్. ఇంత వయసు వచ్చి ఏం మాట్లాడాలో కూడా తెలియనప్పుడు ఏం లాభం. శ్యామల ప్రేమకోసం ఒంటరిగా ఉండిపోయింది. అది లోటు కాదు, లోపం కాదు అని జగదీశ్వరి తిడుతుంది. తనకు నాకు కొత్త ఇది. కానీ, ఒక్క క్షణం జివుక్కుమంది. మొండిదాన్ని అయినా నేను ఆడదాన్నే కదా అని కన్నీళ్లుపెట్టుకుంది శ్యామల.
ఓదార్చిన చంద్రకళ
అలా శ్యామలను ఏడిపిస్తుంది కామాక్షి. మిమ్మల్ని వదులుకున్నవాళ్లు చాలా దురదృష్టవంతులు అని చంద్రకళ అంటుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్