అమ్మవారి కథతో చండీ దుర్గమా.. ముఖ్య అతిథిగా కమెడియన్ అలీ.. సౌందర్య అమ్మోరు తర్వాత అంటూ డైరెక్టర్ మైను ఖాన్ కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

అమ్మవారి కథతో చండీ దుర్గమా.. ముఖ్య అతిథిగా కమెడియన్ అలీ.. సౌందర్య అమ్మోరు తర్వాత అంటూ డైరెక్టర్ మైను ఖాన్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

టాలీవుడ్‌లో అమ్మవారి కథతో తెరకెక్కుతోన్న కొత్త సినిమా చండీ దుర్గమా. ఈ సినిమాకు డైరెక్టర్ మైను ఖాన్ దర్శకత్వం వహించారు. ఇవాళ (జూన్ 9) చండీ దుర్గమా సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమెడియన్ అలీ విచ్చేశారు. ఈ సందర్భంగా అలీ, మైను ఖాన్ కామెంట్స్ చేశారు.

అమ్మవారి కథతో చండీ దుర్గమా.. ముఖ్య అతిథిగా కమెడియన్ అలీ.. సౌందర్య అమ్మోరు తర్వాత అంటూ డైరెక్టర్ మైను ఖాన్ కామెంట్స్

మంచి ఆర్టిస్టులతో పాటు నూతన నటీనటులను పరిచయం చేస్తూ హెచ్ బీజే క్రియేషన్స్, మదర్ అండ్ ఫాదర్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమా చండీ దుర్గమా. ఈ సినిమాకు జయశ్రీ వెల్ది నిర్మాత. ఒలి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చండీ దుర్గమా సినిమాకు మైను ఖాన్ ఎండీ దర్శకత్వం వహిస్తున్నారు.

ముఖ్య అతిథిగా అలీ

చండీ దుర్గమా సినిమా పూజా కార్యక్రమాలతో ఈ రోజు (జూన్ 9) హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ కమెడియన్ అలీ ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. నటుడు చిట్టి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, ముహూర్తపు సన్నివేశానికి రఘు కారుమంచి దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా కమెడియన్ అలీ మాట్లాడుతూ.. “చండీ దుర్గమా సినిమా ప్రారంభోత్సవానికి అతిథిగా రావడం సంతోషంగా ఉంది. అమ్మవారి కథతో వస్తున్న సినిమా కాబట్టి మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. సినిమా కూడా ప్రేక్షకుల ఆదరణ పొందాలి. ప్రొడ్యూసర్ జయశ్రీ గారికి, డైరెక్టర్ మైను ఖాన్‌తో సహా టీమ్ అందరికీ మంచి పేరు తీసుకువస్తుందని ఆశిస్తున్నా. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్” అని అన్నారు.

అమ్మోరు, చండీ తర్వాత

డైరెక్టర్ మైను ఖాన్ ఎండీ మాట్లాడుతూ.. “ఈ రోజు మా చండీ దుర్గమా చిత్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చి క్లాప్ కొట్టిన అలీ గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. రఘు కారుమంచి, చిట్టి కూడా మాకు సపోర్ట్ చేసేందుకు ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది” అని అన్నారు.

“ఇటీవల అమ్మవారి నేపథ్యంగా సినిమాలు రూపొందడం లేదు. సౌందర్య గారి అమ్మోరు, విజయశాంతి గారి చండీ సినిమా తర్వాత అమ్మవారి కథతో సినిమా రాలేదు. ఇప్పటి ట్రెండ్‌కు అనుగుణంగా, ఈతరం ప్రేక్షకులకు నచ్చేలా డార్క్ థీమ్‌లో సరికొత్త స్క్రీన్ ప్లే, కాన్సెప్ట్‌తో చండీ దుర్గమా చిత్రాన్ని రూపొందిస్తున్నాం” అని డైరెక్టర్ మైను ఖాన్ తెలిపారు.

థియేటర్స్‌కు రప్పించేలా

“ప్రస్తుతం థియేటర్స్‌కు ప్రేక్షకులు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్స్‌కు ఆడియెన్స్‌ను రప్పించేలా చండీ దుర్గమా సినిమా మేకింగ్‌ను డిజైన్ చేస్తున్నాం. కో ప్రొడ్యూసర్ ఒలీ గారు చెప్పిన ఒక పాయింట్ ఆధారంగా ఈ చిత్ర కథను నేను రాశాను. ఇటీవల కాలంలో ఇలాంటి కాన్సెప్ట్ రాలేదు. చండీ దుర్గమా సినిమా ఒక మాస్టర్ పీస్ అవ్వాలని కోరుకుంటున్నా” అని దర్శకుడు మైను ఖాన్ ఆశించారు.

అలాగే, నిర్మాత జయశ్రీ వెల్ది మాట్లాడుతూ.. “అమ్మవారి నేపథ్యంతో ఒక మంచి కథతో చండీ దుర్గమా సినిమాను నిర్మించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. మన తెలుగు ఆడియెన్స్ అమ్మవారి నేపథ్యంగా వచ్చిన చిత్రాలను ఎంతో ఆదరించారు. మా సినిమాకు కూడా అలాంటి సక్సెస్ ఇస్తారని ఆశిస్తున్నాం. హై క్వాలిటీ మేకింగ్‌తో మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులు, ప్రతిభ గల కొత్త నటీనటులతో చండీ దుర్గమా సినిమాను మీ ముందుకు తీసుకొస్తాం” అని వెల్లడించారు.

విజువల్స్ పరంగా

“చండీ దుర్గమా సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మా మూవీని విజువల్స్ పరంగా కొత్తగా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. మీ అందరి సపోర్ట్ ఉంటుందని నమ్ముతున్నాం” అని సినిమాటోగ్రాఫర్ వైఎస్ కృష్ణ పేర్కొన్నారు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024