





Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి రూ.150 కోట్ల హిస్టారిక్ కోర్ట్ రూమ్ డ్రామా.. ఐఎండీబీలో 8.2 రేటింగ్.. తెలుగులోనూ స్ట్రీమింగ్?
ఓటీటీలోకి మరో హిట్ కోర్ట్ రూమ్ డ్రామా వచ్చేస్తోంది. సుమారు రెండు నెలల తర్వాత ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఐఎండీబీలో 8.2 రేటింగ్ సొంతం చేసుకున్న ఈ సినిమాకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు.
ఓటీటీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న హిట్ కోర్ట్ రూమ్ డ్రామా కేసరి ఛాప్టర్ 2 డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. తెలుగులోనూ ఈ మూవీ రిలీజ్ కావడంతో.. హిందీతోపాటు తెలుగులోనూ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.
కేసరి ఛాప్టర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్
అక్షయ్ కుమార్, మాధవన్, అనన్య పాండే నటించిన హిస్టారికల్ కోర్ట్ రూమ్ డ్రామా కేసరి ఛాప్టర్ 2. జలియన్వాలా బాగ్ మారణ హోమం గురించి తెలియని స్టోరీని ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఏప్రిల్ 18న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది.
జూన్ 13 నుంచి జియోహాట్స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.
కేసరి ఛాప్టర్ 2 మూవీ గురించి..
కేసరి ఛాప్టర్ 2 మూవీని సుమారు రూ.150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ లభించలేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇంచుమించు రూ.150 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మూవీకి పాజిటివ్ రివ్యూలు వచ్చినా.. అది కలెక్షన్ల రూపంలో కనిపించలేదు.
అయితే ఓటీటీలో మాత్రం ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, మాధవన్, అనన్య పాండేతోపాటు రెజీనా, సైమన్ పైస్లీ డేలాంటి వాళ్లు కీలక పాత్రలు పోషించారు. ధర్మ ప్రొడక్షన్స్, లియో మీడియా కలెక్టివ్ , కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. కరణ్ సింగ్ త్యాగి ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు.
ఈ కేసరి ఛాప్టర్ 2 మూవీ 1919లో జరిగిన జలియన్వాలా బాగ్ మారణహోమం, దాని వెనుక దాగి ఉన్న కుట్రకోణాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇందులో శంకరన్ నాయర్ అనే పాత్రలో అక్షయ్ కుమార్ నటించాడు. అతడు వైస్రాయ్ కౌన్సిల్ లో సభ్యుడిగా ఉంటాడు. ఈ హత్యాకాండపై రిపోర్ట్ ఇచ్చే బాధ్యతను అతనికి అప్పగిస్తారు.
రిపోర్ట్ తమకు అనుకూలంగా వస్తుందని బ్రిటీష్ ప్రభుత్వం భావించినా.. అసలు ఈ హత్యాకాండ వెనుక దాగి ఉన్న చీకటి రహస్యాలను తెలుసుకున్న తర్వాత బ్రిటన్ రాణి, జనరల్ డయ్యర్ లపై శంకరన్ నాయర్ కేసు వేస్తాడు. ఇక కోర్టులో బ్రిటీష్ తరపున వాదించడానికి నెవిల్ మెకిన్లీ (మాధవన్) వస్తాడు. ఈ ఇద్దరి మధ్య కోర్టులో జరిగే వాదోపవాదాల చుట్టూనే ఈ సినిమా తిరుగుతుంది. మంచి కోర్ట్ రూమ్ డ్రామా చూడాలనుకుంటే ఈ కేసరి ఛాప్టర్ 2ని మిస్ కావద్దు.
సంబంధిత కథనం