అప్పుల ఊబిలో పాకిస్థాన్.. ఆర్థిక సర్వేలో షాకింగ్ వివరాలు.. మొత్తం ఎంత రుణం?

Best Web Hosting Provider In India 2024


అప్పుల ఊబిలో పాకిస్థాన్.. ఆర్థిక సర్వేలో షాకింగ్ వివరాలు.. మొత్తం ఎంత రుణం?

Anand Sai HT Telugu

పాకిస్థాన్ అప్పులతో కొట్టుమిట్టాడుతోంది. వడ్డీ భారం ఇలాగే పెరిగి, జాగ్రత్తలు తీసుకోకపోతే దీర్ఘకాలిక ఆర్థిక సుస్థిరత, ఆర్థిక భద్రత దెబ్బతింటుందని పాకిస్థాన్ ప్రీ బడ్జెట్ ఎకనమిక్ సర్వే నివేదిక పేర్కొంది.

అప్పుల ఊబిలో పాకిస్థాన్

ొరుగు దేశమైన పాకిస్థాన్ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. సోమవారం విడుదల చేసిన పాకిస్థాన్ ఆర్థిక సర్వే నివేదికలో ఆ దేశ అప్పులు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయని వెల్లడైంది. ఇది ఇప్పటికే అధ్వాన్నంగా ఉన్న పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చింది. ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం, పాకిస్థాన్ మొత్తం ప్రజా రుణం (మార్చి 2025 నాటికి) 76,007 బిలియన్ పాకిస్థాన్ రూపాయలకు చేరుకుంది. ఇది దేశ చరిత్రలో ఎన్నడూ నమోదు చేయని అత్యధిక రుణం.

నాలుగేళ్లలో రెట్టింపు

అంటే ఈ అప్పు భారత కరెన్సీలో రూ.23 లక్షల కోట్లు. 2020-21లో రూ.39,860 బిలియన్లుగా ఉన్న పాకిస్థాన్ ప్రభుత్వ రుణం గత నాలుగేళ్లలో దాదాపు రెట్టింపు అయిందని నివేదికలు చెబుతున్నాయి. పదేళ్ల క్రితం పాకిస్థాన్ ప్రభుత్వ రుణం రూ.17,380 బిలియన్లు. ఈ విధంగా గత దశాబ్దంలో ప్రభుత్వ రుణం దాదాపు ఐదు రెట్లు పెరిగింది. పాకిస్థాన్ తన వార్షిక బడ్జెట్ ను మంగళవారం (జూన్ 10) ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.

జాగ్రత్తలు తీసుకోకపోతే కష్టం

షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం సోమవారం దేశ ఆర్థిక సర్వే 2024-25 నివేదికను తన ఆర్థిక మంత్రి మహ్మద్ ఔరంగజేబ్ ద్వారా విడుదల చేసింది. రూ.76,007 బిలియన్ల రుణంలో దేశీయ రుణం రూ.51,518 బిలియన్లు, విదేశీ రుణం రూ.24,489 బిలియన్లు ఉన్నాయి. మితిమీరిన లేదా సరిగా నిర్వహించని రుణాలు తీవ్రమైన బలహీనతలను సృష్టిస్తాయని పాకిస్థాన్ ఆర్థిక సర్వే పేర్కొంది. వడ్డీ భారం ఇలాగే పెరిగి, జాగ్రత్తలు తీసుకోకపోతే దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం, ఆర్థిక భద్రత దెబ్బతింటుందని నివేదిక తెలిపింది.

బడ్జెట్‌లో ప్రజలకు ప్రయోజనం ఉందా?

2025 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో ప్రభుత్వ రుణాల వృద్ధి 6.7 శాతంగా ఉంది. ఐఎంఎఫ్ ఎక్స్పాండెడ్ ఫండ్ ఫెసిలిటీ కింద పాకిస్థాన్‌కు ఇటీవల 1.03 బిలియన్ డాలర్ల సాయం అందింది. మంగళవారం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఉద్దేశం పాకిస్థాన్ ప్రజల శ్రేయస్సు కాదని, ఐఎంఎఫ్‌ను ప్రసన్నం చేసుకోవడమేనని, ఆర్థిక దిశ ప్రజాప్రయోజనాల ద్వారా కాకుండా రుణదాత షరతులతో నిర్ణయించబడుతోందని అంటున్నారు. పాకిస్థాన్‌లో ఇంధనం, ఆహారం వంటి కనీస అవసరాల కోసం ప్రజలు ఇప్పటికీ ఇబ్బందులు పడుతుంటే, యువత నిరుద్యోగం అంతకంతకూ పెరుగుతోంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link