కూటమి సర్కార్ శుభవార్త – ‘తల్లికి వందనం స్కీమ్’ అమలుకు ముహుర్తం ఫిక్స్ – రేపట్నుంచే ఖాతాలోకి డబ్బులు..!

Best Web Hosting Provider In India 2024

కూటమి సర్కార్ శుభవార్త – ‘తల్లికి వందనం స్కీమ్’ అమలుకు ముహుర్తం ఫిక్స్ – రేపట్నుంచే ఖాతాలోకి డబ్బులు..!

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

‘తల్లికి వందనం స్కీమ్’ కు అమలుపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రేపు(జూన్ 12) నిధులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. మొత్తం 67 లక్షల మంది తల్లుల ఖాతాల్లో డబ్బులను జమ చేయనున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

తల్లికి వందనం స్కీమ్ – కూటమి సర్కార్ గ్రీన్ సిగ్నల్

సూపర్ సిక్స్ లో మరో ముఖ్యమైన హామీకి ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా రేపు(జూన్ 12) తల్లులకు కానుకగా తల్లికి వందనం నిధులను జమ చేయనున్నారు.మొత్తం 67 లక్షల మందికి డబ్బులు అందనున్నాయి.

రేపట్నుంచే నిధుల జమ…

ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ తల్లికి వందనం స్కీమ్ అందించనున్నారు. 67,27,164 మంది విద్యార్థులకు పథకాన్ని వర్తింపజేయనున్నారు. ఈ స్కీమ్ కింద రేపు తల్లుల ఖాతాల్లో రూ. 8745 కోట్లు జమ చేయనున్నారు.

1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లల నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్ధులకు కూడా అర్హులవుతారు. అడ్మిషన్లు పూర్తయ్యి డేటా అందుబాటులోకి రాగానే ఆ విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. విధి విధానాలను ఖరారు చేస్తూ ఇవాళనే ప్రభుత్వం జీవో విడుదల చేయనుంది.

ప్రతి ఏడాది రూ. 15 వేలు….

తల్లికి వందనం స్కీమ్ కింద ఒకటవ తరగతి నుంచి 12 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఆర్థిక సహాయం కింద డబ్బులు జమ చేస్తారు. ప్రతి సంవత్సరం 15,000 ఇస్తారు. అయితే తల్లికి వందనం స్కీమ్ కింద అందే డబ్బులు జమ కావాలంటే… విద్యార్థుల తల్లిదండ్రులు 3 పనులను తప్పకుండా పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే వీటిపై తల్లిదండ్రులకు అవగాహన కూడా కల్పిస్తున్నారు.

ఈకైవైసీ ప్రక్రియ తప్పకుండా పూర్తి చేసుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. లేకుండా డబ్బుల చెల్లింపు ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తుతాయని అంటున్నారు. ఇక బ్యాంక్ ఖాతా యాక్టివ్‌గా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా ఎన్పీసీఐతో లింక్ చేయబడి ఉండాలని చెబుతున్నారు. ఇవన్నీ సక్రమంగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు రాకుండా డబ్బులు జమవుతాయని చెబుతున్నారు.

లింకింగ్ ప్రాసెస్ పూర్తి చేసుకునేందుకు పోస్టల్, సచివాలయ సిబ్బంది, బ్యాంకు అధికారులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. వెంటనే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెబుతున్నారు.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

టాపిక్

Ap GovtThalliki Vandanam SchemeChandrababu Naidu
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024