ప్రమాదంలో నెతన్యాహు ప్రభుత్వం.. పార్లమెంట్ రద్దు బిల్లు, మిత్రపక్షాల తిరుగుబాటు!

Best Web Hosting Provider In India 2024


ప్రమాదంలో నెతన్యాహు ప్రభుత్వం.. పార్లమెంట్ రద్దు బిల్లు, మిత్రపక్షాల తిరుగుబాటు!

Anand Sai HT Telugu

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పార్లమెంటును రద్దు చేస్తూ విపక్షాలు తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. మరోవైపు ప్రభుత్వ మిత్రపక్షాలు కూడా ప్రతిపక్షాల ప్రతిపాదనకు మద్దతిస్తామని నెతన్యాహును హెచ్చరించాయి.

బెంజమిన్ నెతన్యాహు

జ్రాయెల్‌లో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం ప్రమాదంలో పడింది. ఇజ్రాయెల్ పార్లమెంటును రద్దు చేసే బిల్లును ప్రతిపక్షాలు ప్రవేశపెట్టాయి. నెతన్యాహుకు అతిపెద్ద సమస్య ఏమిటంటే, అతని సంకీర్ణ ప్రభుత్వంలోని అల్ట్రా కన్జర్వేటివ్ పార్టీలు కూడా ప్రతిపక్షాల ప్రతిపాదనకు మద్దతు ఇవ్వవచ్చని హెచ్చరించాయి. ఇదే జరిగితే దేశంలో ముందస్తు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం రావచ్చు. అల్ట్రా ఆర్థోడాక్స్ యువతను ఇజ్రాయెల్ సైనిక సేవ నుండి మినహాయించే చట్టం, దీనిని ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదు.

ఈ సమస్య చాలాకాలంగా ఇజ్రాయెల్ సమాజాన్ని విభజించింది. కానీ గాజా యుద్ధం నేపథ్యంలో ఇది మరింత సున్నితంగా మారింది. దేశంలోని యువతలో ఎక్కువ మంది సైన్యంలో పనిచేస్తుండగా, ఒక సామాజిక వర్గానికి మినహాయింపు ఇవ్వడం సరికాదని విమర్శకులు ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షాలు పార్లమెంటును రద్దు చేసే బిల్లును ప్రవేశపెట్టిన తరువాత, నెతన్యాహు ప్రభుత్వం ప్రతి వ్యూహాన్ని అవలంబించింది. సమయం ఇవ్వడానికి, రాజీకి రావడానికి బుధవారం పార్లమెంటు ఎజెండాలో అనేక బిల్లులను చేర్చింది. పార్లమెంటును రద్దు చేయాలంటే మరో మూడు ఓట్లు రావాల్సి ఉంటుందని, దీనికి కొన్ని రోజులు లేదా వారాలు పట్టొచ్చు.

తప్పనిసరిగా సైన్యంలో సేవలు అందించాలన్న నిబంధన నుంచి తమకు మినహాయింపు కావాలని కొన్ని వర్గాలు కోరుతున్నాయి. అయితే ఆ చట్టం ఆమోదం లభించకపోవడం కూడా ఆగ్రహానికి కారణమైంది.

అక్టోబర్ 7 సంఘటనపై నెతన్యాహు కూడా చిక్కుల్లో పడ్డారు. 2023 అక్టోబర్ 7 న హమాస్ దాడి తర్వాత నెతన్యాహు ప్రభుత్వానికి ఈ సంక్షోభం అతిపెద్ద ఎదురుదెబ్బగా అవుతుంది. ఆ దాడి ఇజ్రాయెల్ చరిత్రలో అతిపెద్ద భద్రతా వైఫల్యంగా పరిగణిస్తున్నారు. ఇది ప్రభుత్వ ప్రజాదరణను తీవ్రంగా దెబ్బతీసింది. వాస్తవానికి అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు భీకరంగా ఊచకోతకు పాల్పడ్డారు. మొదట వైమానిక దాడుల్లో చాలా మంది మరణించగా, ఆ తర్వాత టెర్రరిస్టు ఫైటర్లు సరిహద్దులు దాటి ఇజ్రాయెలీలను హతమార్చారు. ఈ దాడిలో 1,200 మందికి పైగా ఇజ్రాయెలీలు మరణించారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link