కన్నప్ప ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా.. ఘోర విమాన ప్రమాదం నేపథ్యంలో మంచు విష్ణు నిర్ణయం.. ఒక రోజు ఆలస్యంగా ట్రైలర్

Best Web Hosting Provider In India 2024

కన్నప్ప ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా.. ఘోర విమాన ప్రమాదం నేపథ్యంలో మంచు విష్ణు నిర్ణయం.. ఒక రోజు ఆలస్యంగా ట్రైలర్

Hari Prasad S HT Telugu

కన్నప్ప ప్రీరిలీజ్ ఈవెంట్ ను రద్దు చేశాడు మంచు విష్ణు. అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం కూలిన నేపథ్యంలో అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఈవెంట్ శుక్రవారం (జూన్ 13) ఇండోర్ లో జరగాల్సి ఉంది.

కన్నప్ప ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా.. ఘోర విమాన ప్రమాదం నేపథ్యంలో మంచు విష్ణు నిర్ణయం.. ఒక రోజు ఆలస్యంగా ట్రైలర్

మంచు విష్ణు తొలి పాన్ ఇండియా మూవీ కన్నప్ప ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గురువారం (జూన్ 12) తన ఎక్స్ అకౌంట్ ద్వారా మంచు విష్ణు వెల్లడించాడు. దీంతో ఒక రోజు ఆలస్యంగా ఈ మూవీ ట్రైలర్ రానుంది.

కన్నప్ప ప్రీరిలీజ్ ఈవెంట్

కన్నప్ప మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ శుక్రవారం (జూన్ 13) ఇండోర్ లో జరగాల్సి ఉంది. అయితే ఈ పెను విషాదం నేపథ్యంలో ఈ ఈవెంట్ వాయిదా పడింది. ఈ విషయాన్ని విష్ణు తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు.

“అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసి నా గుండె పగిలింది. ఈ విషాదం నేపథ్యంలో రేపు ఇండోర్లో జరగాల్సిన ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా వేస్తున్నాం. ఒక రోజు ఆలస్యంగా కన్నప్ప ట్రైలర్ రానుంది. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి” అని విష్ణు ట్వీట్ చేశాడు.

కన్నప్ప మూవీ గురించి..

మంచు విష్ణు లీడ్ రోల్లో నటించిన మూవీ కన్నప్ప. ఈ సినిమా జూన్ 27న రిలీజ్ కానుంది. ఈ సినిమాను ముకేశ్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో విష్ణుతోపాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, ముకేశ్ రుషి లాంటి వాళ్లు నటించారు. ఈ సినిమా రిలీజ్ ఇప్పటికే ఒకసారి వాయిదా పడింది. ఈ భారీ బడ్జెట్ మూవీపై విష్ణు భారీ ఆశలే పెట్టుకున్నాడు.

ఈ మూవీ ట్రైలర్ ను జూన్ 13న రిలీజ్ చేయనున్నట్లు రెండు రోజుల కిందట మంచు విష్ణు వెల్లడించాడు. అయితే విమాన ప్రమాదం నేపథ్యంలో అర్ధంతరంగా ఈ ఈవెంట్ వాయిదా పడింది. శనివారం (జూన్ 14) కన్నప్ప ట్రైలర్ రానుంది. అదే రోజు ప్రీరిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. జూన్ 27న తెలుగుతోపాటు వివిధ భాషల్లో కన్నప్ప మూవీ రిలీజ్ కాబోతోంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024