మృత్యుంజయుడు.. విమాన ప్రమాదం నుంచి బయటపడిన ఒకే ఒక్కడు

Best Web Hosting Provider In India 2024


మృత్యుంజయుడు.. విమాన ప్రమాదం నుంచి బయటపడిన ఒకే ఒక్కడు

Sudarshan V HT Telugu

అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదం నుంచి ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అతడు ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు వైరల్ గా మారాయి.

విమాన ప్రమాదం నుంచి బయటపడిన ఒకే ఒక్కడు (HT Photo)

అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి విశ్వాస్ కుమార్ రమేశ్ అనే ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో మృత్యుంజయుడిగా నిలిచిన ఏకైక ప్రయాణికుడు రమేశ్. అతడు స్వల్ప గాయాలతో ఘటనాస్థలం నుంచి నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. ఆ తరవాత అతడిని అహ్మదాబాద్ లోని అసర్వాలోని సివిల్ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం జాయిన్ చేశారు.

బ్రిటీష్ జాతీయుడైన విశ్వాస్

బ్రిటీష్ జాతీయుడైన 40 ఏళ్ల విశ్వాస్ తన కుటుంబాన్ని చూసేందుకు కొన్ని రోజుల క్రితం భారత్ వచ్చాడు. తన సోదరుడు అజయ్ కుమార్ రమేష్ (45)తో కలిసి యూకేకు తిరిగి వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ ప్రమాదంలో చిక్కుకున్నాడు. ‘‘టేకాఫ్ అయిన ముప్పై సెకన్ల తర్వాత పెద్ద శబ్దం రావడంతో విమానం కూలిపోయింది. ఇదంతా చాలా త్వరగా జరిగిపోయింది’’ అని ఛాతీ, కళ్లు, కాళ్లపై గాయాలైన విశ్వాస్ తెలిపారు.

చుట్టూ మృతదేహాలు

బ్రిటీష్ జాతీయుడైన విశ్వాస్ తన కుటుంబాన్ని చూసేందుకు కొన్ని రోజులుగా భారత్ లో ఉండి తన సోదరుడు అజయ్ కుమార్ రమేష్ (45)తో కలిసి యూకేకు తిరిగి వెళ్తున్నాడు. ఇప్పటికీ బోర్డింగ్ పాస్ కలిగి ఉన్న విశ్వాస్ హెచ్ టితో మాట్లాడుతూ, “నేను లేచినప్పుడు, నా చుట్టూ మృతదేహాలు ఉన్నాయి. నాకు భయం వేసింది. నేను లేచి పరిగెత్తాను. నా చుట్టూ విమాన శకలాలు ఉన్నాయి. ఎవరో నన్ను పట్టుకుని అంబులెన్స్ లో ఎక్కించుకుని ఆసుపత్రికి తీసుకొచ్చారు. తాను 20 ఏళ్లుగా లండన్ లో ఉంటున్నానని, తన భార్య, బిడ్డ కూడా లండన్ లోనే నివసిస్తున్నారని విశ్వాస్ తెలిపారు. విమానంలో తన సోదరుడు అజయ్ వేరే వరుసలో కూర్చున్నాడని చెప్పారు. ‘మేం డయ్యూను సందర్శించాం. అతను నాతో ప్రయాణిస్తున్నాడు మరియు నేను ఇక అతన్ని కనుగొనలేను. అతడి ఆచూకీ కనుగొనేందుకు సాయం చేయండి’ అని కోరాడు.

విజయ్ రూపానీ కోసం..

ఎయిరిండియా విమానంలో ప్రయాణిస్తున్న వారి కోసం వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆసుపత్రిలో వెతికడం కనిపించింది. వీరిలో ఆ విమానంలో ఉన్న గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. గతంలో రూపానీకి సహకరించిన శైలేష్ మాండ్లియా ఆసుపత్రిలో మాజీ ముఖ్యమంత్రి కోసం గాలిస్తున్నారు. అతడి కోసం గాలిస్తున్నాం. ఏదైనా తెలిస్తే నాకు తెలియజేయండి’ అని మాండ్లియా హెచ్టీతో అన్నారు.

సీట్ నంబర్ 11 ఏ

ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలో విశ్వాస్ కుమార్ రమేశ్ సీట్ నంబర్ 11ఏ. విశ్వాస్ కు వెనుక వరుస లోనే గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూర్చున్నారు. ఆయన ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. విశ్వాస్ మినహా విమానంలోని 241 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. కాగా, విమానం కుప్పకూలిన భవనం ఒక మెడికల్ కాలేజీ హాస్టల్. ఆ భవనం ధ్వంసం కావడంతో అందులోని పలువురు మెడికల్ విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోయారు.

విశ్వాస్ వాంగ్మూలం కీలకం..

కాగా, విమాన ప్రమాదానికి సంబంధించి ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన విశ్వాస్ కుమార్ రమేశ్ అందించే సమాచారం కీలకంగా మారనుంది. ప్రమాదం సమయంలో ఏం జరిగిందనే విషయాన్ని ఆయన నుంచి ఫస్ట్ హ్యాండ్ సమాచారం తెలిసే అవకాశం ఉంది. అలాగే, విమానం బ్లాక్ బాక్స్ నుంచి కూడా కీలక సమాచారం పొందవచ్చు.

53 మంది బ్రిటీష్ పౌరులు కూడా..

ఈ ప్రమాదంలో విమానంలోని సిబ్బందితో సహా 241 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్ నుంచి యూకేలోని గాట్విక్ వెళ్తుంది. ఇది గురువారం మధ్యాహ్నం 1.39 గంటలకు టేకాఫ్ తీసుకుని నిమిషాల్లోనే కుప్పకూలింది. ఇందులోని 230 మంది ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటీష్ పౌరులు, ఏడుగురు పోర్చుగీస్, ఒక కెనడియన్ ఉన్నారని ఎయిరిండియా తెలిపింది.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link