



Best Web Hosting Provider In India 2024
‘‘చుట్టూ చెల్లాచెదురుగా మృతదేహాలు, క్షతగాత్రులు’’ – విమాన ప్రమాదం చూసిన ప్రత్యక్ష సాక్షి వెల్లడి
భారత దేశ విమాన ప్రమాదాల చరిత్రలో అత్యంత విషాదకర ప్రమాదంగా అహ్మదాబాద్ విమాన ప్రమాదం నిలుస్తుంది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్యను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ, మృతుల సంఖ్య భారీగానే ఉంటుందని తెలుస్తోంది.
242 మంది ప్రయాణికులు, సిబ్బందితో బయలుదేరిన ఎయిరిండియా ఏఐ-171 విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే గుజరాత్ లోని మేఘానీనగర్ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ఎయిరిండియా విమాన ప్రమాదం తర్వాత ప్రత్యక్ష సాక్షి ఒకరు పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడారు. మొదట పెద్ద శబ్దం వినిపించిందని, ఆ తరువాత అక్కడ మంటలు, దట్టమైన పొగలు వ్యాపించాయని తెలిపాడు.
మృతదేహాలు, క్షతగాత్రులు
భారీ శబ్ధం వినిపించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నానని, మొదట అది భూకంపంలా అనిపించిందని స్థానిక ప్రత్యక్ష సాక్షి తెలిపారు. “మేము బయటకు వచ్చేసరికి గాలిలో దట్టమైన పొగ కనిపించింది. ఇది విమాన ప్రమాదం అని అప్పటికి తమకు తెలియలేదని చెప్పారు. “మేము ప్రమాద స్థలానికి వచ్చినప్పుడు, చాలా మృతదేహాలు చెల్లా చెదురుగా పడి కనిపించాయి’’ అని చెప్పాడు. ఆ తరువాత సహాయ సిబ్బంది వాటిని ఆసుపత్రులకు తరలించారని వివరించారు.
మెడికల్ కాలేజీ హాస్టల్ పై..
అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం ఏఐ171 జూన్ 12న టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇద్దరు చిన్నారులు, 12 మంది సిబ్బందితో సహా 242 మందితో కూలిపోయింది. టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే మధ్యాహ్నం 1.38 గంటల ప్రాంతంలో మేఘానీ నగర్ సమీపంలోని నివాస ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే, విమానం ఒక మెడికల్ కాలేజీ కి సంబంధించిన హాస్టల్ భవనాన్ని ఢీ కొడుతూ కుప్పకూలింది. ఆ సమయంలో ఆ భవనంలో మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారని, ఆ భవనంలోని మెస్ ఉన్న ప్రాంతం పూర్తిగా ధ్వంసం అయిందని స్థానిక మీడియా తెలిపింది. ఈ ప్రమాద మృతుల్లో ఆ భవనంలోని వారు కూడా ఉండవచ్చని వెల్లడించారు.
కనీసం 120 మంది మృతి
ఇంకా అధికారిక సంఖ్యను వెల్లడించనప్పటికీ, ఎయిరిండియా విమాన ప్రమాదంలో కనీసం 120 మంది మరణించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. పైలట్ల పేర్లను సుమిత్ సబర్వాల్, క్లైవ్ కుందర్ గా ఎయిరిండియా ధృవీకరించింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, గుజరాత్ ప్రభుత్వం, అహ్మదాబాద్ పోలీసులు బాధిత కుటుంబాల కోసం హెల్ప్లైన్ నంబర్లను విడుదల చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. అహ్మదాబాద్ ను సందర్శించి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని ప్రధాని మోదీ కోరారు. ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో ఆయన చేసిన పోస్ట్ ప్రకారం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు, అత్యవసర బృందాలు అప్రమత్తంగా ఉన్నాయి.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link