ప్రయాణికులకు గుడ్ న్యూస్..! కరీంనగర్ – తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు, సర్వీసుల వివరాలివే

Best Web Hosting Provider In India 2024

ప్రయాణికులకు గుడ్ న్యూస్..! కరీంనగర్ – తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు, సర్వీసుల వివరాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. కరీంనగర్ – తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. మొత్తం 8 రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.

ప్రత్యేక రైళ్లు (image source @GMSRailway)

తిరుపతి వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. కరీంనగర్ నుంచి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. దీంతో నేరుగా కరీంనగర్ నుంచి తిరుమలకు వెళ్లి రావొచ్చు. మొత్తం 8 ప్రత్యేక రైళ్లు ఉన్నాయి. వీటిలో నాలుగు కరీంనగర్ నుంచి తిరుపతికి వెళ్తాయి. మరో నాలుగు తిరుపతి నుంచి కరీంనగర్ కి రాకపోకలు సాగిస్తున్నాయి.

మొత్తం 8 ట్రిప్స్…

దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన వివరాల ప్రకారం….తిరుపతి – కరీంనగర్ (ట్రైన్ నెంబర్ 02761) మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. జూలై 6వ తేదీ నుంచి జూలై 27 తేదీల మధ్య రాకపోకలు ఉంటాయి. కేవలం ఆదివారం తేదీల్లో మాత్రమే ఈ ట్రైన్స్ నడుస్తాయి.

ఇక కరీంనగర్ – తిరుపతి (ట్రైన్ నెంబర్ 02762) మధ్య మరో నాలుగు రైళ్లు అందుబాటులో ఉంటాయి. జూలై 7 నుంచి జూలై 28 తేదీల మధ్య రాకపోకలు ఉంటాయి. అది కూడా సోమవారం రోజుల్లో మాత్రమే ట్రైన్ అందుబాటులో ఉంటుంది. రానుపోనూ అన్ని కలిపి మొత్తం 8 ట్రిప్స్ ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

ఈ స్పెషల్ రైళ్లు ఆదివారం రాత్రి 7:45 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరుతాయి. సోమవారం ఉదయం 10:00 గంటలకు కరీంనగర్ సిటీకి చేరుకుంటాయి. ఇక సోమవారం సాయంత్రం 5:30 కి కరీంనగర్ నుంచి బయలుదేరి మంగళవారం ఉదయం 8:25 కి తిరుపతి చేరుకుంటుంది.

ట్రైన్స్ ఆగే స్టేషన్లు ఇవే:

ఈ ప్రత్యేక రైళ్లు రేణిగుంట, గూడురు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, మధురై, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్. వరంగల్, జమ్మికుంట, పెద్దపల్లి స్టేషన్లు ఆగుతాయి. ఈ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని రైల్వే అధికారులు కోరారు.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

టాపిక్

RailwaySouth Central RailwayTrainsTirupatiKarimnagar
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024