




Best Web Hosting Provider In India 2024

ప్రయాణికులకు గుడ్ న్యూస్..! కరీంనగర్ – తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు, సర్వీసుల వివరాలివే
ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. కరీంనగర్ – తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. మొత్తం 8 రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.
తిరుపతి వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. కరీంనగర్ నుంచి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. దీంతో నేరుగా కరీంనగర్ నుంచి తిరుమలకు వెళ్లి రావొచ్చు. మొత్తం 8 ప్రత్యేక రైళ్లు ఉన్నాయి. వీటిలో నాలుగు కరీంనగర్ నుంచి తిరుపతికి వెళ్తాయి. మరో నాలుగు తిరుపతి నుంచి కరీంనగర్ కి రాకపోకలు సాగిస్తున్నాయి.
మొత్తం 8 ట్రిప్స్…
దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన వివరాల ప్రకారం….తిరుపతి – కరీంనగర్ (ట్రైన్ నెంబర్ 02761) మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. జూలై 6వ తేదీ నుంచి జూలై 27 తేదీల మధ్య రాకపోకలు ఉంటాయి. కేవలం ఆదివారం తేదీల్లో మాత్రమే ఈ ట్రైన్స్ నడుస్తాయి.
ఇక కరీంనగర్ – తిరుపతి (ట్రైన్ నెంబర్ 02762) మధ్య మరో నాలుగు రైళ్లు అందుబాటులో ఉంటాయి. జూలై 7 నుంచి జూలై 28 తేదీల మధ్య రాకపోకలు ఉంటాయి. అది కూడా సోమవారం రోజుల్లో మాత్రమే ట్రైన్ అందుబాటులో ఉంటుంది. రానుపోనూ అన్ని కలిపి మొత్తం 8 ట్రిప్స్ ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
ఈ స్పెషల్ రైళ్లు ఆదివారం రాత్రి 7:45 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరుతాయి. సోమవారం ఉదయం 10:00 గంటలకు కరీంనగర్ సిటీకి చేరుకుంటాయి. ఇక సోమవారం సాయంత్రం 5:30 కి కరీంనగర్ నుంచి బయలుదేరి మంగళవారం ఉదయం 8:25 కి తిరుపతి చేరుకుంటుంది.
ట్రైన్స్ ఆగే స్టేషన్లు ఇవే:
ఈ ప్రత్యేక రైళ్లు రేణిగుంట, గూడురు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, మధురై, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్. వరంగల్, జమ్మికుంట, పెద్దపల్లి స్టేషన్లు ఆగుతాయి. ఈ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని రైల్వే అధికారులు కోరారు.
టాపిక్