కర్ణాటకలో ఏపీఎస్ఆర్టీసీ బస్సుకి ప్రమాదం – ఆరుగురు మృతి..!

Best Web Hosting Provider In India 2024

కర్ణాటకలో ఏపీఎస్ఆర్టీసీ బస్సుకి ప్రమాదం – ఆరుగురు మృతి..!

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు…. ఓ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు చిత్తూరు జిల్లా వాసులుగా తెలిసింది.

ఘోర రోడ్డు ప్రమాదం

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తున్న ఏపీఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. హోస్కోట సమీపంలో గొట్టిపుర గేట్ వద్ద లారీని ఢీకొట్టింది. ఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు ప్రాణాలు వదిలినట్లు తెలిసింది.వీరంతా చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రులను హోస్కోటలోని సిలికాన్ సిటీ ఆసుపత్రికి తరలించారు.

ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేసే ప్రమాదంలో బస్సు(AP 03 Z0190) ప్రమాదానికి గురైనట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న హోస్కోట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

టాపిక్

Road AccidentAndhra Pradesh NewsKarnataka News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024