





Best Web Hosting Provider In India 2024

కొంప ముంచే బ్యాచిలర్ పార్టీ.. నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న మలయాళం కామెడీ మూవీ
మలయాళం కామెడీ మూవీ నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజైన ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర అసలు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. మరి ఓటీటీలో ఏం చేస్తుందో చూడాలి.
మలయాళ నటుడు ధ్యాన్ శ్రీనివాసన్ నటించిన మరో సినిమా డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వస్తోంది. ఈమధ్యే ‘డిటెక్టివ్ ఉజ్జ్వలన్’లో కనిపించిన ఈ నటుడి మలయాళ కామెడీ మూవీ ‘ఆప్ కైసే హో’ ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 27న థియేటర్లలో రిలీజైంది. సరిగ్గా నాలుగు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.
ఆప్ కైసే హో ఓటీటీ రిలీజ్ డేట్
ధ్యాన్ శ్రీనివాసన్ నటించిన మలయాళ మూవీ ‘ఆప్ కైసే హో’ ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు నాలుగు నెలల తర్వాత జూన్ 27 నుంచి ఈ సినిమా సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ ధ్యాన్ శ్రీనివాసన్ మూవీ థియేటర్లలో ఆశించిన మేర ప్రభావం చూపలేకపోయింది.
ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అని మేకర్స్ ఎదురు చూస్తున్నారు. హిందీ టైటిల్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసినా.. అది బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ కాలేదు.
‘ఆప్ కైసే హో’ మూవీ గురించి..
ఆప్ కేసే హో మూవీ క్రిస్టీ అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. అతను పెళ్లికి సిద్ధమవుతాడు. అంతకంటే ముందు అతను ఒక బ్యాచిలర్ పార్టీని ఏర్పాటు చేస్తాడు. అతని స్నేహితులందరికీ అమ్మాయిలంటే పిచ్చి. ఈ నేపథ్యంలో అతని బ్యాచిలర్ పార్టీకి ఓ నార్త్ ఇండియన్ అమ్మాయి వస్తుంది.
ఆ తర్వాత కథ మొత్తం మలుపు తిరుగుతుంది. తర్వాత ఏం జరిగిందన్నది ఈ మూవీలో చూడొచ్చు. ధ్యాన్ శ్రీనివాసన్ తో పాటు ఈ సినిమాలో అజు వర్గీస్, నటుడు-దర్శకుడు శ్రీనివాసన్, రమేష్ పిషారోడి, సుధీష్, జీవా జోసెఫ్, తన్వి రామ్ తదితరులు నటించారు.
ఈ చిత్రానికి వినయ్ జోస్ దర్శకత్వం వహించాడు. కథ, స్క్రీన్ప్లేను ధ్యాన్ శ్రీనివాసన్ రాయడం విశేషం. అఖిల్ జార్జ్ సినిమాటోగ్రాఫర్, వినయన్ ఎంజె ఎడిటర్. తన స్నేహితుడికి జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ సినిమాను తీసినట్లు ధ్యాన్ శ్రీనివాసన్ గతంలో చెప్పాడు.
ధ్యాన్ శ్రీనివాసన్ చివరిగా డిటెక్టివ్ ఉజ్జ్వలన్ లో కనిపించాడు. ఈ మూవీ మే 23న థియేటర్లలో విడుదలైంది. దీనికి మిశ్రమ రివ్యూలు వచ్చాయి. అంతేకాదు అతడు దిలీప్ నటించిన ‘ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ’లో కూడా కనిపించాడు.
సంబంధిత కథనం