ఘోర ప్రమాదం; సిబ్బంది సహా 242 మంది ప్రయాణికులతో వెళ్తూ కుప్పకూలిన విమానం; ఫ్లైట్ లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ

Best Web Hosting Provider In India 2024


ఘోర ప్రమాదం; సిబ్బంది సహా 242 మంది ప్రయాణికులతో వెళ్తూ కుప్పకూలిన విమానం; ఫ్లైట్ లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ

Sudarshan V HT Telugu

గుజరాత్ లోని అహ్మదాబాద్ సమీపంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ తీసుకున్న కాసేపటికే కుప్పకూలింది. విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు.ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఘోర విమానం ప్రమాదం (PTI)

గుజరాత్ లోని అహ్మదాబాద్ సమీపంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఏఐ 171 విమానం టేకాఫ్ తీసుకున్న కాసేపటికే కుప్పకూలింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తాజా సమాచారం మేరకు, ప్రమాదానికి గురైన విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారని తెలుస్తోంది. అయితే, ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

సహాయ చర్యలు

సాంకేతిక కారణంతోనే విమానం కుప్పకూలినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో సిబ్బంది కాకుండా, 230 మంది ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది. ఆ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న బోయింగ్ 787 – 8 డ్రీమ్ లైనర్ గా అని ఎయిర్ ఇండియా ప్రకటించింది.. టేకాఫ్ తీసుకున్న కాసేపటికే ఆ ఎయిర్ ఇండియా విమానం ఏర్ పోర్ట్ సమీపంలోనే కుప్ప కూలింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి, పొగలు వ్యాపించాయి. సమాచారం తెలియగానే అక్కడికి చేరుకున్న అధికారులు సహాయ చర్యలు ప్రారంభించారు. 12 అగ్ని మాపక వాహనాలు అక్కడికి చేరుకున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయ చర్యల్లో పాలు పంచుకుంటున్నారు. సమీప ఆసుపత్రులను ఎమర్జెన్సీ ప్రాతిపదికన క్షతగాత్రలకు చికిత్స అందించేందుకు సిద్ధం చేస్తున్నారు.

సీనియర్ పైలట్ లు

ప్రమాదానికి గురైన విమానం ప్రధాన పైలట్ సుమీత్ సీనియర్ పైలట్ గా తెలుస్తోంది. అతడికి సుమారు 8200 ఫ్లైయింగ్ అవర్స్ ఎక్స్ పీరియన్స్ ఉంది. మరో పైలట్ క్లైవ్ కు 100 ఫ్లైయింగ్ అవర్స్ ఎక్స్ పీరియన్స్ ఉంది. కాగా, ఈ ఇద్దరు పైలట్స్ కాకుండా, మరో 10 మంది సిబ్బంది విమానంలో ఉన్నారు. వీరు కాకుండా, 230 మంది ప్రయాణికులున్నారు. ప్రమాదానికి ముందు ‘మేడే’ కాల్ ను పైలట్ ఏటీసీ కి చేశారు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link