ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న వారికి అలర్ట్​- ఎన్​ఐసీఎల్​ రిక్రూమెంట్​ డ్రైవ్​ షురూ..

Best Web Hosting Provider In India 2024


ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న వారికి అలర్ట్​- ఎన్​ఐసీఎల్​ రిక్రూమెంట్​ డ్రైవ్​ షురూ..

Sharath Chitturi HT Telugu

ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న వారికి అలర్ట్​- ఎన్​ఐసీఎల్​ రిక్రూమెంట్​ డ్రైవ్​ మొదలైంది. జనరలిస్ట్​, స్పెషలిస్ట్​ పోస్టుల భర్తీకి ఈ రిక్రూట్​మెంట్​ డ్రైవ్​ జరుగుతోంది. పూర్తి వివరాలు..

ఎన్​ఐసీఎల్​ రిక్రూమెంట్ 2025

నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న వారికి అలర్ట్​! నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో రిక్రూట్​మెంట్​ డ్రైవ్​ జరుగుతోంది. 266 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏఓ) పోస్టుల భర్తీకి అప్లికేషన్​ని స్వీకరిస్తోంది ఎన్​ఐసీఎల్​. ఆసక్తి గల అభ్యర్థులు ఎన్​ఐసీఎల్​ అధికారిక వెబ్‌సైట్ nationalinsurance.nic.co.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 3, 2025 అని గుర్తుపెట్టుకోవాలి.

ఎన్​ఐసీఎల్​ రిక్రూట్​మెంట్​ 2025-

ముఖ్యమైన తేదీలు:

  • ఫేజ్ I పరీక్ష: జులై 20, 2025
  • ఫేజ్ II పరీక్ష: ఆగస్టు 31, 2025

ఖాళీల వివరాలు:

  • స్పెషలిస్ట్: 96 పోస్టులు
  • జనరలిస్ట్: 170 పోస్టులు
  • మొత్తం: 266 పోస్టులు

అర్హత ప్రమాణాలు:

ఎన్​ఐసీఎల్​ రిక్రూట్​మెంట్​ 2025లో ప్రతి పోస్టుకు సంబంధించిన విద్యార్హతలను వివరణాత్మక నోటిఫికేషన్‌లో చెక్​ చేసుకోవాలి (లింక్​ కింద ఇవ్వడం జరిగింది). అభ్యర్థుల వయోపరిమితి మే 1, 2025 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే, అభ్యర్థి 02.05.1995 కంటే ముందు, 01.05.2004 కంటే తర్వాత (ఈ రెండు తేదీలతో సహా) జన్మించి ఉండకూడదు.

ఎంపిక ప్రక్రియ:

ఎన్​ఐసీఎల్​ రిక్రూట్​మెంట్​ 2025 ఎంపిక ప్రక్రియ రెండు దశల పరీక్షలను కలిగి ఉంటుంది – ఫేజ్ I (ప్రిలిమినరీ పరీక్ష), ఫేజ్ II (మెయిన్ పరీక్ష, ఇంటర్వ్యూ).

ప్రిలిమినరీ పరీక్ష: ఇది ఆబ్జెక్టివ్ టెస్ట్‌లతో (మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు) కూడి ఉంటుంది. మొత్తం 100 మార్కులకు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు (అన్ని విభాగాలకు వర్తిస్తుంది). ఈ పరీక్ష 60 నిమిషాల వ్యవధితో 3 విభాగాలుగా (ప్రతి విభాగానికి ప్రత్యేక సమయాలు) ఉంటుంది.

మెయిన్ పరీక్ష: ఇందులో 250 మార్కులకు ఆబ్జెక్టివ్ టెస్ట్‌ (మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు), 30 మార్కులకు డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటాయి. ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ టెస్ట్‌లు రెండూ ఆన్‌లైన్‌లోనే జరుగుతాయి. అభ్యర్థులు కంప్యూటర్‌లో టైప్ చేయడం ద్వారా డిస్క్రిప్టివ్ టెస్ట్‌కు సమాధానం ఇవ్వాలి. ఆబ్జెక్టివ్ టెస్ట్ పూర్తయిన వెంటనే డిస్క్రిప్టివ్ టెస్ట్ నిర్వహిస్తారు.

అభ్యర్థుల తుది స్కోరు.. ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష (ఆబ్జెక్టివ్ టెస్ట్). ఇంటర్వ్యూలో పొందిన స్కోర్‌ల ఆధారంగా నిర్ణయించడం జరుగుతుంది.

దరఖాస్తు రుసుము:

అన్ని వర్గాల అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 1000/-. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ వర్గానికి చెందిన అభ్యర్థులకు రూ. 250/-.

ఎన్​ఐసీఎల్​ రిక్రూట్​మెంట్​ 2025 వివరణాత్మక నోటిఫికేషన్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఎన్​ఐసీఎల్​ రిక్రూట్​మెంట్​ 2025 అప్లికేషన్​కి డైరక్ట్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link