JoSAA 2025 రౌండ్​ 1 సీట్​ అలాట్​మెంట్​ రిజల్ట్​ విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

Best Web Hosting Provider In India 2024


JoSAA 2025 రౌండ్​ 1 సీట్​ అలాట్​మెంట్​ రిజల్ట్​ విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

Sharath Chitturi HT Telugu

జోసా (JoSAA) 2025 రౌండ్ 1 సీట్ అలాట్‌మెంట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఎలా చెక్​ చేసుకోవాలి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

జోసా 2025 రౌండ్​ 1 ఫలితాలు విడుదల..

JoSAA 2025 రౌండ్ 1 సీట్ అలాట్‌మెంట్ ఫలితాలను జూన్ 14, 2025న విడుదల చేసింది జాయింట్ సీట్ అలాట్‌మెంట్ అథారిటీ. రౌండ్ 1 సీట్ అలాట్‌మెంట్ ఫలితాలను అభ్యర్థులు జోసా అధికారిక వెబ్‌సైట్ josaa.nic.in లో చెక్​ చేసుకోవచ్చు.

జోసా 2025- ముఖ్యమైన తేదీలు..

సీట్ అలాట్‌మెంట్ ఫలితాల విడుదల: జూన్ 14, 2025

ఆన్‌లైన్ రిపోర్టింగ్ (ఫీజు చెల్లింపు/ డాక్యుమెంట్ అప్‌లోడ్): జూన్ 14 నుంచి జూన్ 18, 2025 వరకు

ఫీజు చెల్లింపు చివరి తేదీ: జూన్ 18, 2025

ఫీజు చెల్లింపు సమస్యల పరిష్కారం (చెల్లింపు గడువులోపు ప్రయత్నించిన వారికి): జూన్ 19, 2025 వరకు

ప్రశ్నలకు స్పందించడానికి చివరి తేదీ: జూన్ 20, 2025

జోసా 2025 రౌండ్ 1 సీట్ అలాట్‌మెంట్ ఫలితాలను చెక్​ చేసుకోవడానికి డైరక్ట్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

జోసా 2025 రౌండ్ 1 సీట్ అలాట్‌మెంట్ ఫలితాలను ఎలా చెక్​ చేసుకోవాలి?

రౌండ్ 1 సీట్ అలాట్‌మెంట్ ఫలితాలను చెక్​ చేసుకోవడానికి అభ్యర్థులు కింది స్టెప్స్​ని అనుసరించవచ్చు..

స్టెప్​ 1- జోసా అధికారిక వెబ్‌సైట్ josaa.nic.in కి వెళ్లండి.

స్టెప్​ 2- లింక్​పై క్లిక్​ చేయండి: హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న “JoSAA 2025 round 1 seat allotment result” లింక్‌పై క్లిక్ చేయండి.

స్టెప్​ 3- లాగిన్ వివరాలను నమోదు చేయండి: కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను నమోదు చేయాలి.

స్టెప్​ 4- సబ్మి బటన్​పై క్లిక్ చేయండి: “Submit” పై క్లిక్ చేయండి, మీ సీట్ అలాట్‌మెంట్ రిజల్ట్​ కనిపిస్తుంది.

స్టెప్​ 5- రిజల్ట్ చెక్​ చేసుకోండి: ఫలితాన్ని చెక్​ చేసి, పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి.

స్టెప్​ 6- హార్డ్ కాపీని భద్రపరచండి: భవిష్యత్ అవసరాల కోసం దాని హార్డ్ కాపీని మీ వద్ద ఉంచుకోండి.

మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు జోసా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.

దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్​ఐటీల్లో ఇంజినీరింగ్​ చదివేందుకు జేఈఈ మెయిన్స్​ పరీక్ష నిర్వహిస్తారు. అందులో క్వాలిఫై అయన వారు జేఈఈ అడ్వాన్స్​డ్​ పరీక్ష రాస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు జోసా కౌన్సిలింగ్​ ద్వారా ఐఐటీలు, ఎన్​ఐటీల్లో సీట్లను కేటాయిస్తారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link