సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ కాంచన్ కుమారి దారుణ హత్య- అందుకే చంపానంటూ కిల్లర్ వీడియో- ఇద్దరు అరెస్ట్!

Best Web Hosting Provider In India 2024

సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ కాంచన్ కుమారి దారుణ హత్య- అందుకే చంపానంటూ కిల్లర్ వీడియో- ఇద్దరు అరెస్ట్!

Sanjiv Kumar HT Telugu

సోషల్ మీడియాలో బోల్డ్ కంటెంట్ చేస్తోందని పంజాబ్‌కు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ కమల్ కౌర్ బాబీగా పిలవబడే కాంచన్ కుమారిని అమృత్ పాల్ సింగ్ గ్యాంగ్ దారుణంగా హత్య చేసింది. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయగా ప్రధాన నిందితడు అమృత్ పాల్ పరారీలో ఉన్నాడు.

సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ కాంచన్ కుమారి దారుణ హత్య- అందుకే చంపానంటూ కిల్లర్ వీడియో- ఇద్దరు అరెస్ట్!

పంజాబ్‌కు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ కాంచన్ కుమారి దారుణ హత్యకు గురైంది. సోషల్ మీడియాలో కమల్ కౌర్ బాబీగా బాగా పేరొందిన కాంచన్ కుమారి (30) బోల్డ్ కంటెంట్‌తో సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు చేసేది. ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న కాంచన్ కుమారి తన పోస్టులతో వివాదాలు కూడా ఎదుర్కొంది.

మెడికల్ యూనివర్సిటీ సమీపంలో

అయితే, పంజాబ్‌లోని బటిండాలో బుధవారం (జూన్ 11) రాత్రి ఆదేశ్ మెడికల్ యూనివర్సిటీ సమీపంలో పార్క్ చేసిన ఓ కారులో కాంచన్ కుమారి శవమై కనిపించింది. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ హత్యను అమృత్ పాల్ సింగ్ గ్యాంగ్ చేసినట్లుగా సమాచారం. దీనికి సంబంధించిన వీడియోను అమృత్ పాల్ సింగ్ రిలీజ్ చేశాడు.

ఆ వీడియోలో కాంచన్ కుమారి సోషల్ మీడియాలో అసభ్య కంటెంట్ (బోల్డ్) పోస్ట్ చేస్తుందని, అందుకు ఇది శిక్షగా చేసిన చర్య అని అమృత్ పాల్ సింగ్ చెప్పినట్లు సమాచారం. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే, కమల్ కౌర్ బాబీ హత్య కేసు చేధించిన పోలీసులు ఇద్దరు నిహాంగ్లను శుక్రవారం (జూన్ 13) అరెస్ట్ చేశారు.

నిందితుడు పరారీలో

కాంచన్ కుమారి హత్య కేసులో జస్‌ప్రీత్ సింగ్, నిమ్రత్ జిత్ సింగ్‌లను అరెస్ట్ చేసినట్లు పంజాబ్ పోలీసులు వెల్లడించారు. అయితే, ప్రధాన నిందితుడు సిక్కు రాడికల్ నాయకుడు అమృత్ పాల్ సింగ్ మెహ్రాన్ పరారీలో ఉన్నాడని, అతనికోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమ్‌నీత్ కొండల్ తెలిపారు.

కాంచన్ కుమారిని గొంతు నులిమి చంపారని, అనధికారిక మోరల్ పోలీసింగ్ ఫలితమే ఈ దారుణానికి కారణం అని ఎస్ఎస్పీ తెలిపారు. కమ్యూనిటీ మనోభావాలను దెబ్బతీసే అనైతిక కంటెంట్‌ను అప్‌లోడ్ చేసినందుకు కాంచన్‌ను చంపినట్లు అరెస్టయిన నిందితులు ప్రాథమిక విచారణలో తెలిపారు.

పెయిడ్ ప్రమోషన్స్ అంటూ

బిజినెస్ మీటింగ్ నెపంతో అమృత్ పాల్ సింగ్ మెహ్రాన్ గత వారం కాంచన్‌ను సంప్రదించాడని, పెయిడ్ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమెను బటిండాకు ఆహ్వానించాడని ఎస్ఎస్పీ పేర్కొన్నారు.

కాంచన్ కుమారి హత్య కేసులో ఇద్దరు అరెస్ట్
కాంచన్ కుమారి హత్య కేసులో ఇద్దరు అరెస్ట్ (HT)

జూన్ 9న మధ్యాహ్నం 3.30 గంటలకు లూథియానాలోని తన ఇంటి నుంచి జస్‌ప్రీత్, నిమ్రత్‌ జిత్‌తో కలిసి బయలుదేరిన కాంచన్‌ను కొన్ని గంటల తర్వాత కారులో నడుము బ్యాండ్‌తో గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

దుర్వాసన రావడంతో

ఇక పోతే బటిండా-చండీగఢ్ హైవేపై యూనివర్సిటీ స్థలంలో పార్క్ చేసిన కారు నుంచి దుర్వాసన వస్తోందని స్థానికులు తెలిపారు. దీంతో పోలీసులు వచ్చి వాహనాన్ని తనిఖీ చేయగా సుమారు 30 నుంచి 35 ఏళ్ల మహిళ మృతదేహం కనిపించింది. అది సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ కాంచన్ కుమారి అని పోలీలుసు నిర్ధారించుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024