ఎయిరిండియా విమాన ప్రమాదంతో విషాదంగా ముగిసిన ఆటో డ్రైవర్ కూతురు కల..

Best Web Hosting Provider In India 2024


ఎయిరిండియా విమాన ప్రమాదంతో విషాదంగా ముగిసిన ఆటో డ్రైవర్ కూతురు కల..

Sudarshan V HT Telugu

అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం కుప్పకూలిన ఘటనలో ఎన్నో విషాదాలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. వాటిలో ఒకటి 25 ఏళ్ల పాయల్ ఖాతిక్ ది. లండన్ లో ఎంటెక్ చేయాలన్న ఆ ఆటోడ్రైవర్ కూతురు కల కలగానే మిగిలిపోయింది.

విమాన ప్రమాదం (AFP)

ఎయిరిండియా విమానం ఏఐ-717 ప్రమాదానికి గురైన కొన్ని రోజుల తర్వాత అందులోని ప్రయాణికుల విషాద గాథలు వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి కథే గుజరాత్ లోని హిమాత్ నగర్ కు చెందిన యువతి పాయల్ ఖతిక్ ది. ఆటో డ్రైవర్ కూతురు పాయల్ తొలిసారిగా దేశం విడిచి వెళ్లేందుకు విమానం ఎక్కింది. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన ఎయిరిండియా అహ్మదాబాద్-గాట్విక్ విమానంలోని దురదృష్టవంతులైన 230 మంది ప్రయాణికుల్లో ఆమె ఒకరు.

లండన్ లో ఎంటెక్ చేయాలని..

ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ కోసం యునైటెడ్ కింగ్ డమ్ కు వెళ్లడానికి పాయల్ ఆ విమానం ఎక్కారు. వారి కుటుంబంలో విమానం ఎక్కిన తొలి సభ్యురాలు పాయల్. ఉదయం 10 గంటల సమయంలో తమ ముద్దుల కుమార్తెకు వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వీడ్కోలు పలికి ఇంటికి తిరిగి వెళ్లారు. అయితే, కొన్ని గంటల్లోనే విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 241 మంది ప్రయాణికులు, సిబ్బంది జాబితాలో తమ కూతురు కూడా ఉందన్న విషాద వార్త వారికి చేరింది.

మొత్తం 274 మంది మృతులు

బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ కు చెందిన ఎయిరిండియా విమానం ఏఐ-171 కూలిపోయి 15 ఏళ్లలో ఎన్నడూ లేనంత ఘోరమైన విమాన ప్రమాదంలో తన పేరును లిఖించుకుంది. నగరంలోని ఓ మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై ఈ విమానం కుప్పకూలడంతో ఆ భవనంలోని 24 మంది విద్యార్థులు, సిబ్బంది కూడా చనిపోయారు.

అప్పు చేసి పంపించాం..

విమాన ప్రమాదం జరిగిన మరుసటి రోజే డీఎన్ఏ విశ్లేషణ ద్వారా పాయల్ మృతిని అధికారులు నిర్ధారించారు. పాయల్ భవిష్యత్తులో చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేస్తుందని, కుటుంబాన్ని పోషించడానికి సహాయపడుతుందనే ఆశతో తాను రుణాలు తీసుకున్నట్లు సురేష్ పేర్కొన్నాడు. కానీ ఇప్పుడు వారికి అప్పులు తిరిగి చెల్లించే మార్గం లేదు. “ఆమె కళాశాల చదువు పూర్తయిన తర్వాత లండన్ లో ఉన్నత చదువులు చదవాలనుకుంది. అందుకే ఆమెను అక్కడికి పంపించడం కోసం అప్పులు చేశాం. అక్కడ చదువు పూర్తయ్యాక జాబ్ చేసి ఆ అప్పులు తీరుస్తుందని భావించాం’’ అని పాయల్ తండ్రి సురేష్ ఖాతిక్ తెలిపారు.

కుటుంబంలో తొలి మెంబర్

‘‘మా కుటుంబంలో విదేశాలకు వెళ్లిన తొలి సభ్యురాలు ఆమె. ఆమె లండన్ వెళ్తోంది. ఉదయ్ పూర్ లో బీటెక్ పూర్తి చేసిన ఆమె ఎంటెక్ చేయడానికి లండన్ వెళ్తోంది. కానీ ఈ విషాద సంఘటన జరిగింది. మా కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది’’ అని ఆమె బంధువు భరత్ చౌహాన్ తెలిపారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కు చెందిన పాయల్ హిమత్ నగర్ లోని ఆదర్శ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుకుంది. ఆమె హిమాత్ హైస్కూల్ నుంచి పదకొండో, పన్నెండో తరగతి పూర్తి చేసింది. “ఆమె విద్యావంతురాలు. ఆమెకు అన్నదమ్ములు ఉన్నారు… మరియు ఆమె తండ్రి ఒక డ్రైవర్. కానీ ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేదు’ అని పాయల్ కుటుంబ స్నేహితురాలు సుశీలా పాఠక్ తెలిపారు. మరో బంధువు మాట్లాడుతూ.. ‘కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. పాయల్ విద్యార్థులకు ట్యూషన్ చెప్పి కుటుంబాన్ని పోషించేది’’ అన్నారు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link