దేశంలో జోరుగా వర్షాలు- ఆ 5 రాష్ట్రాలకు రెడ్​ అలర్ట్​!

Best Web Hosting Provider In India 2024


దేశంలో జోరుగా వర్షాలు- ఆ 5 రాష్ట్రాలకు రెడ్​ అలర్ట్​!

Sharath Chitturi HT Telugu

జూన్ 15న గోవా, కేరళ తదితర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఐఎండీ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

5 రాష్ట్రాలకు ఐఎండీ రెడ్​ అలర్ట్​! (Hindustan Times)

రుతుపవనాల కారణంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. తమిళనాడు, గోవా, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక తీర ప్రాంతాల్లో ఈ నెల 15న భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్​గఢ్, బీహార్, మధ్యప్రదేశ్​లోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

ఇతర రాష్ట్రాలకు ఐఎండీ యెల్లో అలర్ట్​ జారీ చేసింది. మరీ ముక్యంగా రాజస్థాన్​లో ధూళి తుపాను, పంజాబ్, హరియాణాలో వడగాలులు, బిహార్​లో వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని వెల్లడించింది.

“ తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక కోస్తాలోని కారైకల్​లో అతి భారీ వర్షాలు (>20 సెం.మీ/ 24 గంటలు) కురిసే అవకాశం ఉంది. జూన్ 16 వరకు కేరళ అండ్ మాహేలో వర్షాలు పడతాయి,” అని ఐఎండీ తన తాజా వాతావరణ బులెటిన్​లో వివరించింది.

ఈ రోజు, రేపు గోవాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. జూన్ 17 నుంచి 19 వరకు గుజరాత్​లో, జూన్ 20 వరకు మధ్యప్రదేశ్​లో, జూన్ 18 నుంచి 20 వరకు ఛత్తీస్​గఢ్​లో, జూన్ 17, 18 తేదీల్లో ఝార్ఖండ్​లో, మరో రెండు రోజుల్లో ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

కేరళలో కురిసిన భారీ వర్షాలకు చెట్లు నేలకూలడం, వీధులు, రోడ్లు జలమయం కావడం, ఇళ్లకు నష్టం వాటిల్లింది. ఈదురు గాలులతో కూడిన ఈదురుగాలులతో ఉత్తర జిల్లాల్లోని హై రేంజ్ ప్రాంతాల్లో చెట్లు విరిగిపడి తీరం వెంబడి శివారు ప్రాంతమైన వేటుకాడులో ఉన్న ఇళ్లు దెబ్బతిన్నాయి.

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న వడగాల్పుల పరిస్థితి త్వరలో తగ్గుముఖం పడతుందని ఐఎండీ శాస్త్రవేత్త నరేష్ కుమార్ తెలిపారు. వాయవ్య భారతం, హిమాలయాల్లో కొన్ని రోజులుగా వడగాలులు వీస్తున్నాయని తెలిపారు.

దిల్లీలో వర్షాలు..

జూన్ 15న తెల్లవారుజామున కురిసిన వర్షానికి దిల్లీ ఉలిక్కిపడింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ‘దిల్లీ ఎన్​సీఆర్​లో.. కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయవ్య భారతం మొత్తం ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ ద్వీపకల్పంలో 5-6 రోజుల పాటు రుతుపవనాలు కొనసాగుతాయు,” అని ఐఎండీ శాస్త్రవేత్త తెలిపారు.

తూర్పు, ఈశాన్య భారతంలో భారీ వర్షాలు కొనసాగుతాయని, రానున్న రెండు రోజుల్లో ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రరూపం దాలుస్తాయని తెలిపారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link