




Best Web Hosting Provider In India 2024
కేదార్నాథ్లో హెలికాప్టర్ ప్రమాదం- ఏడుగురు దుర్మరణం! 6 వారాల్లో 5వ ఘటన..
కేదార్నాథ్ సమీపంలో ఒక హెలికాప్టర్ అదృశ్యమై, ఆ వెంటనే కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించినట్టు అధికారులు ప్రకటించారు.
ఉత్తరాఖండ్లో మరో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కేదార్నాథ్ ధామ్ నుంచి గుప్తకాశీకి వెళ్తున్న ఒక హెలికాప్టర్ గౌరీకుండ్ సమీపంలో కుప్పకూలింది. తొలుత ఈ విమానం అదృశ్యమైందని గుర్తించిన అధికారులకు, అది కుప్పకూలినట్టు సమాచారం అందింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మే 2న కేదార్నాథ్ ఆలయం తెరుచుకున్నప్పటి నుంచి, అంటే ఆరు వారాల్లో ఇది 5వ ఘటన!
కేదార్నాథ్ హెలికాప్టర్ ప్రమాదం- అసలేం జరిగింది?
కేదార్నాథ్ హెలికాప్టర్ దుర్ఘటన ఆదివారం ఉదయం 5:20 గంటల ప్రాంతంలో జరిగింది. “గౌరీకుండ్లో అదృశ్యమైన హెలికాప్టర్ కూలిపోయింది,” అని ఉత్తరాఖండ్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ లా అండ్ ఆర్డర్ డాక్టర్ వి. మురుగేశన్ మీడియాకు తెలిపారు.
గర్వాల్ ఇన్స్పెక్టర్ జనరల్ రాజీవ్ స్వరూప్ మాట్లాడుతూ.. భక్తులను కేదార్నాథ్కు చేర్చిన తర్వాత గౌరీకుండ్ బయలుదేరిన హెలికాప్టర్ ఈ ప్రమాదానికి గురైందని చెప్పారు.
“ఈ రోజు ఉదయం 5:20 గంటల ప్రాంతంలో, శ్రీ కేదార్నాథ్ ధామ్ నుంచి గుప్తకాశీకి వెళ్తున్న హెలికాప్టర్ గౌరీకుండ్ సమీపంలో కూలిపోయినట్లు సమాచారం అందింది,” అని ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్మెంట్ అథారిటీ పేర్కొంది.
“జిల్లా పోలీసులు ప్రమాదం గురించి సమాచారం అందించారు. బృందాలు సంఘటనా స్థలానికి బయలుదేరాయి,” అని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వర్గాలు తెలిపాయి.
హెలికాప్టర్లో ఉన్నవారు ఎవరు?
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వర్గాల సమాచారం ప్రకారం, కేదార్నాథ్ సమీపంలో కూలిన హెలికాప్టర్లో ఏడుగురు ఉన్నారు! వారిలో “పైలట్ రాజ్వీర్, బీకేటీసీ నివాసి విక్రమ్ రావత్, రసి ఉఖీమత్, వినోద్, ట్రిస్ట్ సింగ్, రాజ్కుమార్, శ్రద్ధ, 10 సంవత్సరాల బాలిక రాశి,” ఉన్నారని తెలిపారు.
కేదార్నాథ్ హెలికాప్టర్ ప్రమాదం ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “రుద్రప్రయాగ్ జిల్లాలో హెలికాప్టర్ ప్రమాదం జరిగినట్లు చాలా బాధాకరమైన వార్త అందింది,” అని ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, స్థానిక పరిపాలన- ఇతర సహాయక బృందాలు సహాయక, రెస్క్యూ ఆపరేషన్లలో నిమగ్నమై ఉన్నాయని ఆయన చెప్పారు. “ప్రయాణికులందరి భద్రత కోసం బాబా కేదార్ను ప్రార్థిస్తున్నాను,” అని ధామి అన్నారు.
వారంలోనే రెండో ఘటన- 6 వారల్లో 5వ సంఘటన..!
సుమారు ఎనిమిది రోజుల క్రితం, కేదార్నాథ్ ధామ్కు వెళ్తున్న ఐదుగురు భక్తులతో కూడిన హెలికాప్టర్ ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలోని భరాసు సమీపంలో జాతీయ రహదారిపై అత్యవసరంగా ల్యాండ్ అయిన ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జూన్ 7న జరిగింది.
అధికారుల ప్రకారం, కెస్ట్రెల్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నడుపుతున్న ఏడబ్ల్యూ119 హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపాన్ని ఎదుర్కొంది. దీంతో పైలట్ నియంత్రిత పద్ధతిలో సమీప రహదారిపై ల్యాండ్ చేశారు. “బోర్డులో ఉన్న ఐదుగురు ప్రయాణికులు ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. అయితే, పైలట్కు ల్యాండింగ్ సమయంలో స్వల్ప వెన్ను గాయాలయ్యాయి, చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు,” అని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
మొత్తం మీద చూసుకుంటే, మే2 నుంచి ఇది 5వ ఘటన!
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link