ప్రయాణికులకు అలర్ట్..! చరపల్లి – తిరుపతి మధ్య 26 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఇవిగో వివరాలు

Best Web Hosting Provider In India 2024

ప్రయాణికులకు అలర్ట్..! చరపల్లి – తిరుపతి మధ్య 26 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఇవిగో వివరాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. చర్లపల్లి – తిరుపతి మధ్య 26 ప్రత్యేక రైళ్లను పొడిగించింది. వచ్చే జూలైలో ఈ ప్రత్యేక రైళ్ల సేవలు అందుబాటులో ఉంటాయి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

చర్లపల్లి – తిరుపతి మధ్య స్పెషల్ రైళ్లు

తిరుపతి వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. చర్లపల్లి నుంచి తిరుపతి మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగించింది. మొత్తం 26 రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. దీంతో తిరుమలకు వెళ్లే భక్తులకు… మరికొన్ని రోజులు ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి.

26 ప్రత్యేక రైళ్లు పొడిగింపు..

దక్షిణ మధ్య రైల్వే వెల్లడించిన వివరాల ప్రకారం….చర్లపల్లి – తిరుపతి (నంబర్ 07017) మధ్య నడిచే ప్రత్యేక రైలు… జూలై 4 నుంచి జూలై 27వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతి శుక్ర, ఆదివారాల్లో రాత్రి 9:45 నిమిషాలకు చర్లపల్లి నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 11:15 నిమిషాలకు తిరుపతికి చేరుకుంటుంది. మొత్తం 8 సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఇక తిరుపతి – చర్లపల్లి ( నంబర్ 07018) మధ్య నడిచే ప్రత్యేక రైలు.. జూలై 5 నుంచి జూలై 28వ తేదీ వరకు ప్రతి సోమ, శనివారాల్లో అందుబాటులో ఉంటుంది. ఇవి కూడా 8 సర్వుసులు ఉంటాయి.

ఈ ప్రత్యేక రైళ్లు మల్కాజ్‌గిరి, కాచిగూడ, ఉమ్దానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట, రేణిగుంట మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ఆయా స్టేషన్లలో ప్రయాణికులు ఎక్కవచ్చు.

మరోవైపు చర్లపల్లి – తిరుపతి (ట్రైన్ నంబర్ 07251) ట్రైన్… జూలై 2 నుంచి జూలై 30 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్రత్యేక రైలు ప్రతి బుధవారం సాయంత్రం 6:50 నిమిషాలకు చర్లపల్లి నుంచి బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారుజామున 6:55 నిమిషాలకు తిరుపతికి చేరుకుంటుంది. మొత్తం 5 సర్వీసులు ఉంటాయి.

ఇక తిరుపతి – చర్లపల్లి (నెంబర్ 07252) జూలై 3 నుంచి జూలై 31వ తేదీ వరకు రాకపోకలు సాగిస్తుంది. ఇవి 5 సర్వీసుల ఉంటాయి. ఈ ప్రత్యేక రైలు ప్రతి గురువారం సాయంత్రం 6:55 నిమిషాలకు తిరుపతి నుంచి బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారుజామున 6 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు జనగామ, కాజీపేట, వరంగల్, నెక్కొండ, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. మొత్తంగా 26 సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఈ సేవలను వినియోగించుకోవాలని అధికారులు ఓ ప్రకటన ద్వారా కోరారు.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

టాపిక్

South Central RailwayRailwayTrainsTirupati
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024