





Best Web Hosting Provider In India 2024

హైదరాబాద్ లో వారణాసి.. మహేష్ సినిమా కోసం రీ క్రియేట్ చేస్తున్న రాజమౌళి.. సోషల్ మీడియాలో ఫొటోలు లీక్
దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తదుపరి చిత్రం మేజర్ షెడ్యూల్ ను హైదరాబాద్ లో చిత్రీకరించనున్నారు. ఇందుకోసం వారణాసిని రీక్రియేట్ చేస్తున్న చిత్రబృందం భారీ సెట్ కోసం దాదాపురూ.50 కోట్లు ఖర్చు చేస్తోంది. మహేష్, రాజమౌళి కాంబినేషన్లో ఎస్ఎస్ఎంబీ 29 వర్కింగ్ టైటిల్ తో సినిమా తెరకెక్కుతోంది.
భారీ స్థాయిలో సినిమాలు తీయడంలో దిట్టగా పేరొందిన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రాబోయే ప్రతి ప్రాజెక్టుతో గ్రాండియర్ను మరో మెట్టు ఎక్కించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు, ప్రియాంక చోప్రా జోనస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి ఓ సినిమా చేస్తున్నారు. ఎస్ఎస్ఎంబీ 29 వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ రెడీ అవుతోంది. ఇప్పటికే రెండు కీలక షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ త్వరలో కెన్యాలో ప్రారంభం కానుంది.
హైదరాబాద్ లో సెట్
రాజమౌళి, మహేష్ బాబు సినిమాలోని ఓ కీలక ఘట్టం వారణాసిలో జరుగుతుందని యూనిట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. రియల్ లొకేషన్ లో షూట్ చేయడం కష్టం కాబట్టి రామోజీ ఫిల్మ్ సిటీలో వారణాసిలోని కీలక భాగాన్ని నిర్మించాలని రాజమౌళి తన టీంను కోరారట. సెట్ వర్క్ దాదాపు పూర్తి కావస్తోంది. ఇప్పటికే ఈ భారీ సెట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో లీకయ్యాయి.
రూ.50 కోట్లు
వారణాసి సెట్ కోసం దాదాపు రూ.50 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ప్రతి డిటైల్స్ పై దృష్టి పెడుతున్నారు. రాజమౌళి ఎంత పర్ ఫెక్ట్ గా ఉంటారో తెలిసిందే. అందుకే సెట్ విషయంలో ఆయన టీమ్ ప్రతి కొలతను పక్కాగా తీసుకుని మరి చేస్తోంది. సెట్ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా రాజమౌళి ఊరుకునే రకం కాదు. ఆయన అసలు కాంప్రమైజ్ కారు. అందుకే రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ వారణాసి సెట్ ను భారీ బడ్జెట్ తో తీర్చిదిద్దుతున్నారని తెలిసింది.
భారీ యాక్షన్ సీక్వెన్స్
ఈ వారణాసి సెట్ లో కొన్ని కీలక సన్నివేశాలు, కథానాయకుడు మహేష్ బాబుపై భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించనున్నారని సమాచారం. రాజమౌళి గత చిత్రాల మాదిరిగానే గ్రీన్ మ్యాట్ బ్యాక్ డ్రాప్ లో భారీ సీన్స్ ను షూట్ చేయనున్నారు. హాలీవుడ్ కు చెందిన కొన్ని టాప్ వీఎఫ్ఎక్స్ కంపెనీలు ఈ సినిమా గ్రాఫిక్స్ కోసం పనిచేస్తున్నాయని, ఇందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని సమాచారం.
ఈ భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామాకు రామాయణ సంబంధం ఉంది, మహేష్ బాబు పాత్ర ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన జాదీ బుటి (ఔషధ మూలికలు, మూలాలు) కోసం వేట సాగిస్తుందని వార్తలు వెలువడ్డాయి. పౌరాణిక కోణం కూడా ఈ సినిమాలో భాగం కావడంతో ఇంకా పేరు పెట్టని ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. థియేట్రికల్ రైట్స్ కోసం మేకర్స్ భారీ మొత్తాలను కోట్ చేస్తున్నారు.
సంబంధిత కథనం