అతడే శత్రువు నెంబర్ వన్.. డొనాల్డ్ ట్రంప్‌ను హతమార్చాలని ఇరాన్ భావిస్తోంది : నెతన్యాహు

Best Web Hosting Provider In India 2024


అతడే శత్రువు నెంబర్ వన్.. డొనాల్డ్ ట్రంప్‌ను హతమార్చాలని ఇరాన్ భావిస్తోంది : నెతన్యాహు

Anand Sai HT Telugu

ఇరాన్, ఇజ్రాయెల్ నడుమ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. క్షిపణి దాడులతో అల్లకల్లోలంగా ఉంది పరిస్థితి. అయితే డొనాల్డ్ ట్రంప్‌ను హతమార్చాలని ఇరాన్ భావిస్తోందని తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కామెంట్స్ చేశారు.

డొనాల్డ్ ట్రంప్, బెంజమిన్ నెతన్యాహు (AFP)

రాన్‌తో వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మొదటి శత్రువు అని ఆయన అన్నారు. అంతేకాదు ట్రంప్‌ను చంపేందుకు ఇరాన్ పనిచేస్తోందని ఆరోపించారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య శుక్రవారం నుంచి తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయి. నెతన్యాహు తనను చంపాలనుకుంటున్నారని చెప్పినట్లు ఫాక్స్ న్యూస్ వార్తా సంస్థ తెలిపింది.

‘అతడే శత్రువు నెంబర్ వన్. ఇతరులు అనుసరిస్తున్న రాజీ మార్గాన్ని ఆయన ఎన్నడూ ఎంచుకోలేదు. రాజీకి మార్గం బలహీనంగా ఉంది. యురేనియం పెంచడానికి వారికి మార్గం ఇస్తుంది, ఇది బాంబుల తయారీకి మార్గం సుగమం చేస్తుంది. బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది. నకిలీ ఒప్పందాన్ని తీసుకుని దాన్ని చింపేశారు.’ అని నెతన్యాహు ఆరోపించారు.

కొనసాగుతున్న దాడులు

ఇజ్రాయెల్ ప్రధాని కూడా ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటుందని చెప్పారు నెతన్యాహు. ఇరాన్ అణ్వాయుధాలపై యుద్ధంలో తనను తాను ట్రంప్ జూనియర్ భాగస్వామిగా అభివర్ణించుకున్నారు. ఇరాన్ అణు, క్షిపణి, సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ శుక్రవారం ఉదయం ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ను ప్రారంభించింది. ఆ తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ పై ఎదురుదాడికి దిగింది.

ఇరాన్ కొన్ని క్షిపణులు ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థలోకి చొచ్చుకుపోవడంలో, దేశం మధ్యలో ఉన్న భవనాలను లక్ష్యంగా చేసుకోవడంలో విజయం సాధించింది. ‘మేం మనుగడ కోసం పోరాడుతున్నందున ఇక్కడ ఉన్నాం. ఇది ఇప్పుడు ఇజ్రాయెల్లోని ప్రతి పౌరుడికి స్పష్టంగా తెలుసు.’అని నెతన్యాహు ఇంతకు ముందు చెప్పారు.

అమెరికా దౌత్య కార్యాలయంపై ఇరాన్ క్షిపణి

మరోవైపు తాజాగా ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల్లో ఒకటి టెల్అవీవ్‌లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని తాకింది. ఈ ఘటనలో కార్యాలయం స్వల్పంగా దెబ్బతిన్నది. ఇందులో సిబ్బంది ఎవరూ గాయపడలేదు. తమ పౌరులపై ఇరాన్ చేస్తున్న దాడులకు మూల్యం చెల్లించుకుంటుందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఖట్జ్ ప్రకటించారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link