హెచ్1బీ వీసాకు తగ్గిన డిమాండ్.. గతంతో పోలిస్తే అప్లికేషన్లు చాలా తక్కువ

Best Web Hosting Provider In India 2024


హెచ్1బీ వీసాకు తగ్గిన డిమాండ్.. గతంతో పోలిస్తే అప్లికేషన్లు చాలా తక్కువ

Anand Sai HT Telugu

హెచ్1బీ వీసా రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే గణనీయమైన తగ్గుదలగా ఉంది. నిజానికి భారతీయ ఐటీ నిపుణులు హెచ్1బీని ఎక్కువగా ఉపయోగించుకుంటారు.

హెచ్1బీ వీసాకు తగ్గిన డిమాండ్

2026 సంవత్సరానికి హెచ్-1బీ వీసా క్యాప్ రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) తాజా డేటా ప్రకారం ఈసారి కేవలం 3.58 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇది గత సంవత్సరం 4.78 లక్షలతో పోలిస్తే 26.9 శాతం తగ్గుదల అన్నమాట. 2024తో పోలిస్తే ఈ సంఖ్య 54 శాతానికి పైగా తగ్గింది.

ఈ ఏడాది రిజిస్ట్రేషన్లు

ఈ ఏడాది మొత్తం రిజిస్ట్రేషన్లలో 1,20,141 రిజిస్ట్రేషన్లు జరిగాయి. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ భారతీయ ఐటీ ఉద్యోగులకు ముఖ్యమైనది, యూఎస్ టెక్ కంపెనీలు ప్రతిభావంతులను నియమించుకోవడానికి ఇది ప్రధాన మార్గంగా చూస్తాయి. ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రామ్ 85,000 వీసాలను ఇస్తుంది. ఇందులో యూఎస్ మాస్టర్స్ డిగ్రీలు ఉన్నవారికి 20,000 సీట్లు ఉన్నాయి.

ఎందుకు తగ్గుదల?

కొత్త నిబంధనలు, అధిక హెచ్-1బీ ఖర్చులు, విదేశీ ఉద్యోగుల కెరీర్ ప్రణాళికలను మార్చడం వంటి అనేక కారణాలను ఈ భారీ పతనానికి కారణంగా ఉన్నాయి. డూప్లికేట్ ఎంట్రీలు, సిస్టమ్ దుర్వినియోగంపై యూఎస్సీఐఎస్ ఉక్కుపాదం మోపడం కూడా ఒక ప్రధాన కారణం. ‘2023 ఆర్థిక సంవత్సరం, 2024 ఆర్థిక సంవత్సరం హెచ్ -1బీ క్యాప్ సీజన్ల నుండి వచ్చిన సాక్ష్యాల ఆధారంగా మేం విస్తృతమైన దర్యాప్తులను చేపట్టాం. తదనుగుణంగా పిటిషన్లను తిరస్కరించాం, ఉపసంహరించుకున్నాం, క్రిమినల్ ప్రాసిక్యూషన్ కోసం చట్ట అమలు సూచనలను కొనసాగిస్తున్నాం.’ అని యూఎస్సీఐఎస్ తన అధికారిక వెబ్‌సైట్‌లో తెలిపింది.

పెరిగిన ఫీజు

పిటిషన్ తిరస్కరణలు, రద్దులు, క్రిమినల్ అభియోగాలతో సహా అవసరమైనప్పుడు కఠిన చర్యలు తీసుకుంటామని యూఎస్సీఐఎస్ వెల్లడించింది. విధానపరమైన మార్పులతో పాటు అప్లికేషన్ ఖర్చు కూడా దరఖాస్తుదారులు వెనుకంజ వేయడానికి పెద్ద కారణంగా మారింది. యుఎస్సీఐఎస్ ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్ ఫీజును 10 డాలర్ల నుండి 250 డాలర్లకు పెంచింది. కెరీర్ ఇప్పుడే మెుదలుపెట్టినవారికి ఇది కాస్త పెద్ద విషయమే.

ఇతర దేశాల వైపు

అదే సమయంలో ఇప్పుడు ఎక్కువ మంది అమెరికా వైపు కాకుండా ఇతర దేశాల వైపు కూడా చూస్తున్నారు. చాలా మంది ఇప్పుడు ఆస్ట్రేలియా లేదా జర్మనీ వైపు ఆలోచిస్తున్నారని చికాగోలో నివసిస్తున్న హైదరాబాద్‌కు చెందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ అఫ్తాబ్ బి చెప్పారు.

గ్రీన్ కార్డుల కోసం సుదీర్ఘ నిరీక్షణ సమయం, హెచ్-1బీ డిపెండెన్సీ, ఉద్యోగ అస్థిరత వంటి అనిశ్చిత పరిస్థితులను అమెరికా ఎదుర్కొంటోంది. ఈ మార్పు భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్లే విధానంపై పెద్ద ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికాకు విద్యార్థులను పంపే దేశాల్లో భారత్ ఎప్పుడూ ముందుంటుంది. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారుతుండటంతో చాలా మంది యూఎస్‌కు వెళ్లడానికి ఆలోచిస్తున్నారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

Best Web Hosting Provider In India 2024


Source link