



Best Web Hosting Provider In India 2024
స్కెచ్ వేసి పెళ్లికి ఒక రోజు ముందు ప్రియుడితో వరుడిని చంపించిన నవ వధువు
ఉత్తరప్రదేశ్లో పెళ్లికి ఒక రోజు ముందు వరుడిని కిడ్నాప్ చేసి హత్య చేశారు. హత్య తర్వాత మృతదేహాన్ని అడవిలో విసిరేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఈ కేసును పోలీసులు ఛేదించారు.
రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మేఘాలయకు హనీమూన్కు వెళ్లిన రాజా రఘువంశీని అతని భార్య సోనమ్.. ప్రియుడితో ప్లాన్ చేసి చంపించింది. ఈ ఘటన ఇంకా మరవకముందే ఉత్తరప్రదేశ్లో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్కు చెందిన గుల్ఫాషా.. వివాహానికి ఒక రోజు ముందు తన ప్రియుడితో కలిసి వరుడిని హత్య చేసింది.
సోమవారం పోలీసులు వరుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే వధువు గుల్ఫాషా, ఆమె ప్రేమికుడితో సహా నలుగురిపై హత్య, కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ప్రియుడిని, అతడి స్నేహితుడిని అరెస్ట్ చేశారు. వధువు, మరొక నిందితుడు ఇప్పటికీ పరారీలో ఉన్నారు.
కొత్త బట్టలు అంటూ..
రాంపూర్ జిల్లాలోని గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని నివాసి నిహాల్(35)కు నాలుగు నెలల క్రితం భోట్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ధనుపుర గ్రామానికి చెందిన గుల్ఫాషాతో నిహాల్ వివాహం నిశ్చయమైంది. జూన్ 15న పెళ్లి కావాల్సి ఉంది. ఇంట్లో పెళ్లి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంతలో జూన్ 14న నిహాల్కు ఫోన్ వచ్చింది. ఆ యువకుడు తనను తాను తన బంధువుగా పరిచయం చేసుకున్నాడు. కొత్త బట్టల పెట్టాలంటూ.. ఇందుకోసం కొలతలు తీసుకోవడానికి ఫోన్ చేసినట్టుగా చెప్పాడు.
కుటుంబానికి అనుమానం
నిహాల్ ఇంటి నుంచి బయటకు వెళ్లి బైక్ పై వచ్చిన ఇద్దరు యువకులతో వెళ్లిపోయాడు. సాయంత్రం వరకు నిహాల్ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. ఎంత వెతికినా దొరకకపోవడంతో కుటుంబం గంజ్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ ఫిర్యాదు చేసింది. కాబోయే భార్య గుల్ఫాషా, ఆమె ప్రేమికుడి మీద కూడా కుటంబం అనుమానం వ్యక్తం చేసింది.
అడవిలో మృతదేహం
ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి ఇద్దరు యువకులను గుర్తించారు. అందులో ఒకరిని అరెస్టు చేసి ప్రశ్నించగా నిహాల్ను హత్య చేసినట్లు అంగీకరించారు. సోమవారం ఉదయం, నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు నిహాల్ మృతదేహాన్ని అజీమ్నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని రతన్పురా అడవిలో స్వాధీనం చేసుకున్నారు. నిహాల్ సోదరుడి ఫిర్యాదు మేరకు గుల్ఫాషా, ప్రేమికుడు సద్దాం, ఫర్మాన్, అనీస్లపై కేసు నమోదు చేశారు. సద్దాం, ఫర్మాన్లను పోలీసులు అరెస్టు చేశారు. గుల్ఫాషా, అనీస్ పరారీలో ఉన్నారు.
ఏడాదిగా ప్రేమ
నిహాల్ను కిడ్నాప్ చేసి గొంతు కోసి చంపి మృతదేహాన్ని అడవిలో పడేశారు. అతని మొబైల్ ఫోన్ పగిలిపోయిందని నిందితులు తెలిపారు. మిగిలిన నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు. గుల్ఫాషా తన పొరుగువాడైన సద్దాంతో ఏడాదిగా సంబంధం కొనసాగిస్తోంది. గుల్ఫాషా వివాహం నిశ్చయమైన తర్వాత సద్దాం కోపంలో ఆమె ఇంటికి వెళ్లి గొడవ పడ్డాడు.
Best Web Hosting Provider In India 2024
Source link