




Best Web Hosting Provider In India 2024
వీధుల్లో మొబైల్ కవర్లు అమ్ముకునే యువకుడు.. నీట్ యూజీ 2025ని క్రాక్ చేశాడు!
నీట్ యూజీ 2025లో 12,484 ర్యాంక్ సాధించిన రోహిత్ కుమార్ కథ ఇప్పుడు వైరల్గా మారింది. వీధుల్లో మొబైల్ కవర్లు అమ్ముకుంటూ, తెల్లవారుజామున 3 గంటల వరకు చదువుకుంటూ అతను నీట్ యూజీని క్రాక్ చేశాడు!
నీట్ యూజీ 2025లో ఉత్తీర్ణత సాధించిన వారి కథలు, కష్టాలు, నిద్రలేని రాత్రుల గురించి ఇప్పుడు దేశ ప్రజలు సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటున్నారు. అలాంటి వారిలో ఒకరైన రోహిత్ కుమార్ కథ ఇప్పుడు వైరల్గా మారింది. జంషెడ్పూర్కి చెందిన రోహిత్ కుమార్.. వీధుల్లో మొబైల్ కవర్లు అమ్ముకుంటూ, నీట్యూజీకి ప్రిపేర్ అయ్యాడు. పరీక్షను క్రాక్ చేశాడు.
సభాష్ రోహిత్ కుమార్..
నీట్ యూజీ 2025లో రోహిత్ కుమార్ ఆల్ ఇండియా స్థాయిలో 12,484వ ర్యాంకు సాధించాడు. ఝార్ఖండ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రవేశం పొందాలని ఆశిస్తున్నాడు.
ఫిజిక్స్ వాలా వ్యవస్థాపకుడు, సీఈఓ అలఖ్ పాండే రోహిత్ కుమార్ను అతని బండి వద్దకు వెళ్లి అభినందించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. నీట్ 2025 లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులందరికీ ఉచిత కోచింగ్ అందించే ఫిజిక్స్ వాలా ‘ఉమ్మీద్ బ్యాచ్’లో తాను ఉన్నానని కుమార్ వెల్లడించాడు.
కుమార్ తండ్రి కూరగాయల మార్కెట్లో పనిచేసేవారు. 12వ తరగతి తర్వాత, అతను ఇంటి ఆదాయానికి సహాయం చేయడానికి పని చేయడం ప్రారంభించాడు. అదే సమయంలో రోహిత్ కుమార్ నీట్ కోసం ప్రిపేర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. కోవిడ్ మహమ్మారి సమయంలో, అతను మెడికల్ స్టోర్లో పనిచేసి, వైద్యం చదవడానికి ప్రేరణ పొందినట్లు నివేదికలు చెబుతున్నాయి.
పాండేతో మాట్లాడుతూ.. నీట్ తయారీ సమయంలో, అతను రోజంతా తన స్టాల్లో ఫోన్ కవర్లు అమ్మి, ఆపై పరీక్ష కోసం తెల్లవారుజామున 3 గంటల వరకు చదువుకునేవాడని చెప్పారు. మరుసటి రోజు, అతను తిరిగి ఉదయం 7 గంటలకు నిద్రలేచి తిరిగి పనికి వెళ్లేవాడని వివరించారు.
మరో వీడియోలో, అలఖ్ పాండే ఆ ప్రతిభావంతుడైన విద్యార్థికి డాక్టర్ కోటును బహూకరించి, అతని విజయాన్ని అభినందిస్తూ కనిపించారు.
సోషల్ మీడియాలో వైరల్గా మారిన దృశ్యాలు ఇక్కడ చూడండి :
ప్రతి చిన్న విషయానికి నిరాశపడి లేదా ఫిర్యాదు చేసే వారు రోహిత్ కుమార్ నుంచి కచ్చితంగా స్ఫూర్తి పొందాలి. ఆశలు, ఆశయాలు ఉంటే చాలు, పేదరికంతో పాటు ఎన్ని సమస్యలు ఎదురైనా అనుకున్నది సాధించవచ్చని రోహిత్ నిరూపించాడు.
నీట్ యూజీ 2025 ఫలితాలు..
ఇటీవలే విడుదలైన నీట్ యూజీ 2025 ఫలితాల్లో రాజస్థాన్కు చెందిన మహేష్ కుమార్ ఆల్-ఇండియా టాపర్గా నిలిచాడు. మధ్యప్రదేశ్కు చెందిన ఉత్కర్ష్ అవధియా రెండో ర్యాంకు సాధించాడు.
దిల్లీకి చెందిన అవికా అగర్వాల్ ఐదొవ స్థానంలో నిలిచి మహిళా టాపర్గా నిలిచింది.
మహారాష్ట్రకు చెందిన క్రిషాంగ్ జోషి, ఢిల్లీకి చెందిన మృణాల్ కిషోర్ ఝా వరుసగా మూడు, నాల్గొవ ర్యాంకులను సాధించారు.
గత సంవత్సరం 13.15 లక్షల మందితో పోలిస్తే ఈ సంవత్సరం అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య తగ్గింది! ఈ సంవత్సరం మొత్తం 22.09 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇది గత సంవత్సరం 23.33 లక్షల మంది కంటే కొద్దిగా తక్కువ.
1.70 లక్షలకు పైగా అర్హత సాధించిన అభ్యర్థులతో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది, తరువాత మహారాష్ట్ర (1.25 లక్షలకు పైగా), రాజస్థాన్ (1.19 లక్షలకు పైగా) ఉన్నాయి.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link