





Best Web Hosting Provider In India 2024

54 ఏళ్ల వయసులో ఇంతందమా? మనీషా కొయిరాలాకు 30 ఏళ్లు ఎలా వచ్చాయి? ఫ్యాన్స్ ఫిదా.. కొత్త లుక్ చూశారా? వీడియో వైరల్
నేపాలీ అందం మనీషా కొయిరాలా మళ్లీ 30 ఏళ్ల అమ్మాయిగా మారిపోయింది. అవును.. ఆమె న్యూ లుక్ చూసినవాళ్లంతా సోషల్ మీడియాలో ఇదే ఒపీనియన్ బయటపెడుతున్నారు. సెలూన్ లో హెయిర్ కట్, మేకప్ చేయించుకున్న తర్వాత 54 ఏళ్ల మనీషా లుక్ తెగ వైరల్ గా మారింది.
బ్యూటీఫుల్ నటి మనీషా కొయిరాలా ఒక్కసారిగా 30 ఏళ్ల అమ్మాయిగా మారిపోయిందా? ఈమె అందం ఏంటీ ఇంతలా పెరిగిపోయింది?.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్లు ఇవే. అవును 54 ఏళ్ల మనీషా న్యూ లుక్ ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. ఇన్ స్టాగ్రామలో యాక్టివ్ గా ఉండే ఆమె న్యూ వీడియో వైరల్ గా మారింది.
హెయిర్ మేకోవర్
రీసెంట్ గా మనీషా కొయిరాలా కొత్త హెయిర్ మేకోవర్ లుక్ తో అభిమానులను ఫిదా చేసింది. నేపాల్ కు చెందిన ఆర్డెన్ ది బ్యూటీ పాయింట్ ఇన్ స్టాగ్రామ్ లో మనీషా న్యూ లుక్ ను షేర్ చేసింది. హెయిర్ కట్ చేయించుకోవడం, మేకప్ వేసుకోవడం కనిపించింది. కొత్త హెయిర్ స్టయిల్ తీసుకున్న మనీషా చిరునవ్వు నవ్వి తనకు నచ్చిందని సైగ చేసింది. కెమెరాకు డిఫరెంట్ ఫోజులు కూడా ఇచ్చింది ఈ భామ. ఈ వీడియోలో మనీషా వైట్ టాప్, లేత గోధుమ రంగు ప్యాంట్ లో కనిపించింది.
‘‘కాలాతీత అందం, శక్తి దీపం (మెరిసే ఎమోజీ) అనే క్యాప్షన్తో ఈ వీడియోను షేర్ చేశారు. మా అందమైన మనీషా కోసం మేకోవర్’’ అని సెలూన్ వీడియో పోస్టు చేసింది. దీనిపై మనీషా స్పందిస్తూ.. ‘‘రాజేష్ ఎట్ బ్యూటీ పాయింట్ హెయిర్ మేకోవర్ చేసినందుకు ధన్యవాదాలు!!’’ అని ట్వీట్ చేసింది.
చాలా యంగ్ గా
మనీషా న్యూ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ‘నువ్వు చాలా యంగ్ గా, అందంగా కనిపిస్తున్నావు’ అని ఓ వ్యక్తి కామెంట్ పెట్టాడు. ‘ఈ హెయిర్ స్టైల్ లో నువ్వు చంపేస్తావు’ అంటూ కామెంట్ పెట్టాడు. ‘నువ్వు చాలా అరుదైన అందగత్తెవి’ అని ఓ అభిమాని కామెంట్ చేశాడు. ’90వ దశకంలోని సౌందర్యం’ అంటూ ఓ ఇన్స్టాగ్రామ్ యూజర్ కామెంట్ చేశాడు. ‘ఆమెకు మళ్లీ 30 ఏళ్లు ఎలా వచ్చాయి?’ అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు.
మహిళలను ట్రోల్
ఈ ఏడాది ప్రారంభంలో మనీషా ఫ్రీ ప్రెస్ జర్నల్ తో మాట్లాడుతూ మహిళలు తమ వయస్సును బట్టి సిగ్గుపడటం, ట్రోల్ చేయడం గురించి మాట్లాడింది. “ఇండస్ట్రీలో ఉన్నా లేకున్నా వయసు మీద పడటం అనేది మహిళలకు సంబంధించిన సమస్య. మాకు సిగ్గుగా ఉంది. ఒక మగ వ్యక్తి ముసలివాడయ్యాడని ఏ ట్రోల్ కూడా వినలేదు. కానీ చాలా మంది మహిళలను ట్రోల్ చేస్తున్నారు’’ అని మనీషా పేర్కొంది.
మనీషా చివరిసారిగా సంజయ్ లీలా భన్సాలీ వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్ లో కనిపించింది. ఈ పీరియాడిక్ డ్రామా టెలివిజన్ సిరీస్ భారత స్వాతంత్రోద్యమ సమయంలో లాహోర్ లోని హీరా మండి అనే రెడ్ లైట్ జిల్లాలో జరుగుతుంది. సోనాక్షి సిన్హా, అదితి రావు హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్, తాహా షా బదుషా తదితరులు నటించారు.
సంబంధిత కథనం