యూపీఎస్సీ ఎన్‌డీఏ, సీడీఎస్2 రిక్రూట్‌మెంట్.. త్వరగా దరఖాస్తు చేసుకోండి.. లాస్ట్ ఛాన్స్!

Best Web Hosting Provider In India 2024


యూపీఎస్సీ ఎన్‌డీఏ, సీడీఎస్2 రిక్రూట్‌మెంట్.. త్వరగా దరఖాస్తు చేసుకోండి.. లాస్ట్ ఛాన్స్!

Anand Sai HT Telugu

యూపీఎస్సీ ఎన్‌డీఏ, సీడీఎస్2 రిక్రూట్‌మెంట్ 2025కి దరఖాస్తు చేసుకోవడానికి ఈరోజే చివరి అవకాశం. అభ్యర్థులు ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోవాలి.

ప్రతీకాత్మక చిత్రం

ీరు ఇండియన్ ఆర్మీ, నేవీ లేదా ఎయిర్ ఫోర్స్‌లో ఆఫీసర్ కావాలని కలలు కంటున్నారా? ఈ న్యూస్ మీకు చాలా ముఖ్యమైనది. అంటే జూన్ 17న యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ఎన్డీఏ (నేషనల్ డిఫెన్స్ అకాడమీ), ఎన్ఏ (నేవల్ అకాడమీ), సీడీఎస్(కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్) 2 రిక్రూట్‌మెంట్ పరీక్ష 2025కి దరఖాస్తు చేసుకోవడానికి చివరి రోజు.

ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు, ఇదే లాస్ట్ ఛాన్స్. మీరు ఇంకా ఫారమ్ నింపకపోతే, సమయం వృథా చేయకుండా అప్లై చేయండి.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

రిక్రూట్‌మెంట్‌కు ఆన్‌లైన్ దరఖాస్తు మాత్రమే చెల్లుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి upsconline.nic.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఇక్కడి నుండి మీరు ఎన్డీఏ, సీడీఎస్ పరీక్షలకు వేర్వేరు ఫారమ్‌లను పూరించవచ్చు. నమోదు చేసుకున్న తర్వాత దరఖాస్తు ఫారమ్‌ను జాగ్రత్తగా పూరించి అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.

దరఖాస్తు ఫీజు

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ.200 దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఫీజును ఆన్‌లైన్ మోడ్ ద్వారా చెల్లించవచ్చు. అభ్యర్థి ఫీజు చెల్లించకపోతే దరఖాస్తు తిరస్కరిస్తారు.

అర్హతలు?

ఎన్డీఏ, ఎన్ఏ పరీక్షలకు అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి (ఇంటర్మీడియట్) పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. నావల్ అకాడమీ కోసం 12వ తరగతిలో ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులు తప్పనిసరి. ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సీడీఎస్ పరీక్షకు అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ లేదా ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉండాలి. అభ్యర్థి కమిషన్ నిర్ణయించిన వయోపరిమితిలోపు ఉండాలి.

పరీక్ష ఎప్పుడు

ఎన్డీఏ, సీడీఎస్ పరీక్షను యూపీఎస్సీ సెప్టెంబర్ 14, 2025న నిర్వహిస్తుంది. పరీక్షకు కొన్ని రోజుల ముందు అడ్మిట్ కార్డ్ వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులకు అందుబాటులో ఉంటుంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

Best Web Hosting Provider In India 2024


Source link