





Best Web Hosting Provider In India 2024

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: సుమిత్ర కోసం కార్తీక్ మాస్టర్ ప్లాన్.. ప్రేమతో దీపతో సైకిల్ సవారీ.. శ్రీధర్ కు కౌంటర్
కార్తీక దీపం 2 సీరియల్ జూన్ 18 ఎపిసోడ్ లో సుమిత్రతో భోజనం చేయించడం కోసం కార్తీక్ మాస్టర్ ప్లాన్ వేస్తాడు. దీపతో సైకిల్ పై ప్రేమతో సవారీ చేసుకుంటూ వెళ్తాడు. మరోవైపు కాశీని చెడగొట్టేందుకు మరోసారి ట్రై చేసిన శ్రీధర్ కు కౌంటర్ ఎదురవుతుంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇక్కడ చూసేయండి.
సుమిత్రను దీప అమ్మ అనడంతో కాంచన, అనసూయ షాక్ అవడంతో నేటి ఎపిసోడ్ ప్రారంభమవుతుంది. సుమిత్రను అమ్మ అంటున్నావ్ ఏంటీ? అని అనసూయ అడుగుతుంది. దీంతో కార్తీక్ మధ్యలో వచ్చి ఓనర్లను అమ్మ అని కాదు అమ్మగారు అని పిలవాలి అని కవర్ చేస్తాడు. అలా పిలిస్తే తప్పేం ఉంది, కానీ అందుకు టైమ్ ఉంది అని కార్తీక్ అంటాడు. అనసూయను పెద్దమ్మ అని పిలిచిన కార్తీక్.. దేవుడే ఇంకో అమ్మను దీపకు ఇచ్చాడని అనుకుందామని చెప్తాడు. సుమిత్రమ్మతో అన్నం ఎలా తినిపించాలోనని దీప బాధపడుతుంది.
ఇదో ఛాలెంజ్
ఆవిడే వండుకోవచ్చు కదా అని అనసూయ అంటే.. సుమిత్ర కాలు బెణికిందని, సరిగ్గా నడవలేకపోతుందని దీప చెప్తుంది. నడవలేని మనిషి ఎలా వంట చేసుకోగలుగుతుంది, వంట గది వైపు వస్తే నా ముఖం చూడాలి కదా అని దీప అంటుంది. అత్తయ్య ఇలా మారిపోయింది అంటే నువ్వు చెప్తే వింటుందా? అని కాంచనను ప్రశ్నిస్తాడు కార్తీక్. దీప ఇది మనకు ఛాలెంజ్ నీ వంట తినను అన్న మనిషి చేతే నీ చేతి వంట తినేలా చేయాలి ఇంక ఆమెను పస్తులు ఉంచడం మంచిది కాదు అని కార్తీక్ అంటాడు. అందుకోసం నా దగ్గర ఐడియా ఉందంటాడు. అందరినీ ఆలోచించమని అడుగుతాడు.
సైకిల్ సవారీ
దీపను ముందు ఎక్కించుకుని కార్తీక్ సైకిల్ తొక్కుతాడు. సైకిల్ మీద పడితే ఇబ్బందే అని దీప అంటే.. నేను పడితే ఇబ్బంది లేదా అని కార్తీక్ అంటాడు. బావగారికి వెటకారాలు ఎక్కువయ్యాయి అని దీప అంటే.. బంగారం లాంటి మరదలు మల్లెపూలు పెట్టుకుని ముందు కూర్చుంటే బావకు ఇలాగే ఉంటుంది అని కార్తీక్ ప్రేమగా చెప్తాడు. నీ నల్లని జడలో మల్లెపూలు రాత్రి వేళ చందమామలా అందంగా ఉన్నాయంటూ కార్తీక్ అంటాడు. నిన్ను తలుచుకుంటే పాటలు కూడా వస్తాయంటాడు కార్తీక్.
అత్తతో భోజనం చేయించడం గురించి నా దగ్గర ఓ సూపర్ ప్లాన్ ఉంది అని కార్తీక్ చెప్తుండగా సైకిల్ టైర్ పంక్చర్ అవుతుంది. ప్లాన్ అనగానే పంక్చర్ అయింది ఏంటీ బావ అని దీప కంగారు పడుతుంది. పంక్చర్ వేయించుకుని శివన్నారాయణ ఇంటికి సైకిల్ పై చేరుకుంటారు దీప, కార్తీక్.
లేట్ కథ
మర్యాద, గౌరవం గురించి పారు, శివన్నారాయణకు వివరిస్తాడు కార్తీక్. ఎందుకు లేట్ అయిందని శివన్నారాయణ కోపంగా అడిగితే.. సైకిల్ పై వస్తుంటే చల్లని గాలి, వెచ్చటి ఎండ, తల్లో మల్లెపూలు.. అలా ఏదో మాట్లాడుకుంటూ వస్తుంటే పెద్ద శబ్దం.. సైకిల్ టైర్ పంక్చర్ అయిందని కార్తీక్ చెప్తాడు. మనలాంటి వర్కర్ల కష్టాలు పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారు సైకిల్ కు పంక్చర్ వేసుకుని వెళ్దామని చెప్పా, దానికే అరగంట లేట్ అయిందని కార్తీక్ అంటాడు. మాకు సైకిలే కారు, విమానం అని కార్తీక్,పెద్ద సారు పెద్ద మనసు చేసుకుని మనల్ని క్షమించారు అని దీపతో కలిసి లోపలికి వెళ్లిపోతారు.
పనిమనిషి పారు
నన్ను మాత్రం పారు అంటున్నాడు, ఎందుకు అంటే మనం మనం ఒకటే అంటాడు అర్థం కాలేదండీ అని శివన్నారాయణతో పారు అంటుంది. నీ గతాన్ని గుర్తు చేస్తున్నాడు పారిజాతం అని శివన్నారాయణ నవ్వేస్తాడు. పెళ్లికి ముందు నువ్వు పని మనిషివే అని వాళ్లతో కలిపేసుకున్నాడు, అది అర్థం కాక నువ్వు ప్రేమ అనుకుంటున్నావ్ అని శివన్నారాయణ నవ్వుకుంటూ వెళ్లిపోతాడు. పారిజాతం పగ బడితే ఎలా ఉంటుందో నీకు తెలిసేలా చేస్తాను అని మనసులో కార్తీక్ గురించి అనుకుంటుంది పారు.
కాశీని చెడగొట్టేందుకు
మరోవైపు బ్యాడ్ హాబిట్స్ ఏమీ లేని కాశీని చెడగొట్టేందుకు మళ్లీ ట్రై చేస్తాడు శ్రీధర్. మీ పెద్దత్తకు జరిగిన అన్యాయం గురించి బాధ అల్లుడూ అని శ్రీధర్ అంటాడు. మీ నాన్నకి, నాన్నమ్మకు కూడా అన్యాయం జరిగింది. మా శాడిస్టు మామ ఆస్తి మొత్తం కొడుక్కే రాసేశాడని శ్రీధర్ అంటే.. ఇందులో తప్పేముంది అని కాశీ అమాయకంగా అడుగుతాడు. తాళికట్టిన భార్య, మీ నానమ్మకు అన్యాయం చేశాడు అని శ్రీధర్ అంటే.. అది తప్పేనని కాశీ చెప్తాడు.
వజ్రం లాంటి ఐడియా.. నేనేమో ఆ ఇంటి అల్లుడ్ని, నువ్వేమో నా ఇంటి అల్లుడివి.. నా భార్య తరఫున నేను, మీ నాన్నమ్మ తరఫున నువ్వు కోర్టులో కేసు వేశామంటే సగం ఆస్తి వస్తుంది? రాకపోతే అంటే కేసు వెనక్కి తీసుకుని చెరో రూ.10 కోట్లు అడుతుదాం అని శ్రీధర్ అంటాడు.
భార్య మాట
అత్తయ్య, స్వప్నను ఓ మాట అడుగుదాం అని అంటే వద్దు అంటాడు శ్రీధర్. ఇంతలో స్వప్న, కావేరి అక్కడికి వస్తారు. మా ఆయనను చెడగొట్టద్దొని స్వప్న.. మా అక్క మిమ్మల్ని సపోర్ట్ చేయదు మరి ఏం చేస్తారు అని కావేరి.. శ్రీధర్ ను అడుగుతారు. అల్లుడు నా మాట వింటే అయితే ఆస్తిలో వాటా లేదంటే రూ.10 కోట్లు వస్తాయి.. అదే నీ పెళ్లాం మాట వింటే కాఫీ తప్ప ఏం రాదు. నేను నా భార్య మాటే వింటా మామయ్య అని కాశీ అంటాడు. పద కాశీ ఇంట్లో నుంచి వెళ్లిపోదాం అని స్వప్న అంటే.. వెళ్లిపోండని శ్రీధర్ అంటాడు. నేను కూడా వెళ్లిపోతా అని కావేరి అనగానే మనం చేసిన పాపాలే ఇప్పుడు బంధాలు అని తెగ ఫీల్ అయిపోతుంటాడు శ్రీధర్. అల్లుడు ఆయన మాటలను పట్టించుకోవద్దంటూ కావేరీ, స్వప్న వెళ్లిపోతారు.
అమ్మమ్మ కోసం శౌర్య
శౌర్య అమ్మమ్మ కోసం సుమిత్ర ఇంటికి వస్తే పారు వెళ్లిపొమ్మని అంటుంది. మీ ప్రేమలు నాకు వద్దు అని పారిజాతం అంటుంది. మనం మనం ఒకటి కాదంటావా అంటే వద్దు అని పారు అంటుంది. నా ప్రేమ అంతా నీకే అని కార్తీక్ అంటే వద్దంటుంది పారు. శౌర్యను చూసి పిల్లలను అడ్డుపెట్టుకుని పెద్దల దగ్గర సింపతీ సంపాదించుకోవాల్సిన అవసరం లేదు అని జ్యోత్స్న అంటుంది. పెళ్లి అడ్డుపెట్టుకుని పెద్దవాళ్ల దగ్గర సింపతీ సాధించిన వాళ్లను చాలా మందిని చూశా అని కౌంటర్ వేస్తాడు కార్తీక్. ఆ మాటకు జ్యోత్స్న ముఖం మాడిపోతుంది.
అన్నం తినడం కోసం
శౌర్య సుమిత్రమ్మను చూస్తానని అత్తయ్య ఫోన్ చేసి చెప్పి పంపించారు అని దీప చెప్తుంది. పిల్లలకు పెద్దవాళ్లలాగా స్వార్థం ఉండదు అని దీప అంటే.. మీ ప్రేమల కోసం ఎవరు ఇక్కడ లేరు అని పారు అంటుంది. నీ కూతురు వచ్చి అమ్మమ్మ అని పలకరించగానే అన్నీ మర్చిపోయి అన్నం తిట్టుందా అని పారు అంటే.. నేను తినిపిస్తాను కదా అని శౌర్య వెళ్లిపోతుంది.
అమ్మమ్మ అని శౌర్య పిలిస్తే సుమిత్ర రూమ్ డోర్ తీస్తుంది. అమ్మమ్మ కాదు శౌర్య.. అమ్మగారు అని పిలవాలి అని దీప అంటే.. అలాగే అని అమ్మగారు అని పిలుస్తుంది శౌర్య. మీరు మా అమ్మ మీద కోపంతో భోజనం చేయలేదంటా? భోజనం మానడం బ్యాడ్ హ్యాబిట్ అని మీరే చెప్పారు కదా అమ్మగారు, మానేస్తే ఎలా అని శౌర్య అడుగుతుంది. శౌర్యను రూమ్ లోకి పంపించి, చిన్నపిల్లతో అమ్మగారు అని పిలిపిస్తావేంటీ అని దీపతో అంటోంది సుమిత్ర. పనిమనిషి కూతురు యజమానిని అలాగే కదా పిలవాలి అని దీప అంటుంది. నువ్వు పని మనిషివో ఎవరో నాకు తెలీదు కానీ నాకు నువ్వు నచ్చకపోవడం కూడా నీకు అవకాశంగా మారిందని నిన్న నీ మాటలు వింటే కానీ అర్థం కాలేదు అని సుమిత్ర చెప్తుండటంతో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్