భారత్, కెనడా దౌత్య సంబంధాల పునరుద్ధణ.. మోదీ, కార్నీ సమావేశంలో కీలక నిర్ణయాలు

Best Web Hosting Provider In India 2024


భారత్, కెనడా దౌత్య సంబంధాల పునరుద్ధణ.. మోదీ, కార్నీ సమావేశంలో కీలక నిర్ణయాలు

Anand Sai HT Telugu

కొన్ని సంవత్సరాలుగా భారత్-కెనడా మధ్య సంబంధాలు క్షీణిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం భారత ప్రధాని మోదీ, కెనడా ప్రధాని కార్నీల మధ్య జరిగిన భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ప్రధాని మోదీతో కెనడా పీఎం మార్క్ కార్నీ

ెనడాలో జస్టిన్ ట్రూడో పాలన ముగిసిన తర్వాత కొత్త ప్రధాని మార్క్ కార్నీ భారతదేశంతో సంబంధాలను మెరుగుపరచడానికి వేగంగా కృషి చేస్తున్నారు. ఇదిలావుండగా, కనన్స్కిస్లో జరిగిన జీ-7 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మార్క్ కార్నీతో సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం పలు కీలక నిర్ణయాలకు అంగీకారం కుదిరింది.

దౌత్య సంబంధాలను పునరుద్ధరించడానికి, కొత్త హైకమిషనర్‌ను నియమించడానికి భారత్, కెనడా అంగీకరించాయి. గత కొన్ని నెలలుగా భారత్‌తో కెనడా సంబంధాలు క్షీణించాయి. ఇలాంటి పరిస్థితుల్లో దౌత్యవేత్తలు, హైకమిషనర్ల నియామకం సంబంధాలను మెరుగుపరిచే దిశగా కీలక ముందడుగు వేసే దిశంగా ఆలోచనలు జరిగాయి. జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, కార్నీల మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశం అనంతరం కెనడా ప్రధాని కొన్ని నిర్ణయాలను ప్రకటించారు.

ఇరు దేశాల పౌరులకు దౌత్య సేవలను సాధారణ స్థితికి తీసుకురావాలని, గత ఏడాది బహిష్కరణ తర్వాత ఖాళీగా ఉన్న కీలక దౌత్య పదవులకు కొత్త నియామకాలతో ముందుకు సాగాలని ఇరువురు నేతలు అంగీకరించారని కెనడా ప్రధాని కార్యాలయం తెలిపింది. ఈ సమావేశం అనంతరం జీ7 సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు మార్క్ కార్నీ, కెనడాలను ప్రధాని మోదీ అభినందించారు.

‘ప్రధాని మార్క్ కార్నీతో అద్భుతమైన సమావేశం జరిగింది’ అని మోదీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. జీ7 సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు ఆయనకు, కెనడా ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలనపై భారత్, కెనడా మధ్య బలమైన విశ్వాసం ఉందన్నారు. కార్నీ, తాను భారత్, కెనడా సంబంధాల వేగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నామన్నారు.

ఎలాంటి ఆధారాలు లేకుండా ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను హతమార్చేందుకు భారత అధికారులు కుట్ర పన్నారని కెనడా ప్రభుత్వం ఆరోపించింది. ఆ తర్వాత 2023లో కెనడా ఆరుగురు భారత దౌత్యవేత్తలు, కాన్సులర్ అధికారులను బహిష్కరించింది. ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన భారత్ ప్రతీకారంగా కెనడా హైకమిషనర్‌తో పాటు మరో ఐదుగురు దౌత్యవేత్తలను బహిష్కరించింది. దీంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link