



Best Web Hosting Provider In India 2024
కన్నకొడుకు కళ్ల ముందే ప్రియుడితో భర్తను దారుణంగా హత్య చేయించిన యువతి
లవర్ తో కలిసి ఉండడం కోసం కొద్ది రోజుల క్రితమే తనను వివాహం చేసుకున్న భర్తను మేఘాలయకు హనీమూన్ కు తీసుకువెళ్లి దారుణంగా హత్య చేయించిన సోనమ్ ఉదంతం మరవకముందే, అలాంటి మరో ఘటన రాజస్తాన్ లో వెలుగు చూసింది. ఇక్కడ సొంత కొడుకే తల్లికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడు.
మేఘాలయ హనీమూన్ హత్యను గుర్తు చేసేలా మరో హత్య రాజస్థాన్ లోని అల్వార్ లో చోటు చేసుకుంది. ఓ మహిళ తన ప్రియుడు, కాంట్రాక్ట్ కిల్లర్లతో కలిసి భర్తను హత్య చేసింది. రాజా రఘువంశీ హత్య జాతీయ పతాక శీర్షికలకు రావడానికి కొద్ది రోజుల ముందు జూన్ 7న జిల్లాలోని ఖేర్లీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అయితే, మేఘాలయ హత్య మాదిరిగా కాకుండా, ఈ కేసులో ఒక సాక్షి ఉన్నాడు. అది ఆ మహిళ యొక్క తొమ్మిదేళ్ల కుమారుడు.
ప్రియుడితో కలిసి..
తన ప్రియుడు, కాంట్రాక్ట్ కిల్లర్లతో కలిసి భర్తను హత్య చేసిన అనంతరం తన భర్త మాన్ సింగ్ జాతవ్ అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో చనిపోయాడని కుటుంబ సభ్యులకు, ఇరుగుపొరుగు వారికి నిందితురాలైనన అనిత చెప్పింది. అయితే వారి కుమారుడు తాను ప్రత్యక్ష సాక్షిగా చూసిన విషయం చెప్పడంతో బాధితుడు మాన్ సింగ్ జాతవ్ మరణం వెనుక అసలు వాస్తవం బయటపడింది.
హంతకులను గుర్తించిన కొడుకు..
ఈ కేసులో ప్రధాన నిందితుడైన ‘కాశీ అంకుల్’ గురించి ఆమె కుమారుడు పోలీసులకు చెప్పాడు. హత్య జరిగిన రోజు రాత్రి తన తల్లి మెయిన్ గేటు తెరిచి ఉంచిందని బాలుడు పోలీసులకు తెలిపాడు. ‘‘అర్ధరాత్రి, కాశీ అంకుల్ తో పాటు మరికొందరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. నేను, నాన్న పడక గదిలో పడుకుని ఉన్నాం. వారు లోపలికి రావడానికి అమ్మ తలుపు తీసింది. ఆ శబ్దానికి నాకు మెలకువ వచ్చింది. కాశీ అంకుల్ బయట నిలబడి వున్నాడు. అతనితో పాటు మరో నలుగురు ఉన్నారు. నేను భయపడ్డాను, నేను లేవలేదు, నేను నిశ్శబ్దంగా ప్రతిదీ చూడటం ప్రారంభించాను. వారు మా గదికి వచ్చారు. నేను లేచి చూడగా మంచం ముందు నిలబడి ఉన్న మా అమ్మ కనిపించింది. ఆ వ్యక్తులు నాన్నను కొట్టారు. కాళ్లను విరిచారు. నోరు మూసి ఊపిరి ఆడకుండా చేశారు. కాశీ అంకుల్ నాన్న ముఖంపై దిండు పెట్టి అదిమాడు. నేను మా నాన్న దగ్గరకు వెళ్తే, నన్ను కాశీ అంకుల్ పక్కకు లాగి, తిట్టి బెదిరించాడు’’ అని ఆ 9 ఏళ్ల బాలుడు పోలీసులకు పూసగుచ్చినట్లు వివరించాడు. కాశీ అంకుల్ అసలు పేరు కాశీరామ్ ప్రజాపత్ అని, అతను ఆ మహిళ ప్రియుడు అని పోలీసులు తెలిపారు.
వివాహేతర సంబంధం కారణంగా
తనను కాశీ అంకుల్ బెదిరించడంతో భయంతో మౌనంగా ఉండిపోయానని, కొద్ది సేపటికి తన తండ్రి చనిపోయాడని, ఆ తర్వాత అందరూ వెళ్లిపోయారని ఆ బాలుడు తెలిపాడు. వివాహేతర సంబంధం కారణంగానే అనిత, కాశీరామ్ ఈ హత్యకు ప్లాన్ చేశారని పోలీసులు తెలిపారు. నలుగురు కాంట్రాక్ట్ కిల్లర్లకు రూ.2 లక్షలు ఆఫర్ చేశారు.
అనారోగ్యం కారణంగా అని..
అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడంతో తన భర్త మృతి చెందినట్లు అనిత తన భర్త కుటుంబ సభ్యులకు, ఇతర బంధువులకు తెలిపింది. అయితే అతని శరీరంపై గాయాలు ఉండడం, దంతాలు విరిగి ఉండడంతో అతడిపై దాడి జరినట్లు అనుమానించి, పోలీసులకు సమాచారమిచ్చారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు కాల్ డేటాను విశ్లేషించి హంతకులను గుర్తించారు. మేఘాలయలో గత నెలలో సోనమ్ రఘువంశీ అనే మహిళ తన భర్త రాజా రఘువంశీ హత్యకు ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి ప్లాన్ చేసింది. హనీమూన్ సమయంలో తన భర్తను హత్య చేయడానికి కాంట్రాక్ట్ కిల్లర్లను నియమించుకుంది.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link