అనుభవించు రాజా.. ఓ ఇంట్లో మ్యాగీ తిని, ఏసీ ఆన్ చేసుకుని చోరీ చేసిన దొంగలు!

Best Web Hosting Provider In India 2024


అనుభవించు రాజా.. ఓ ఇంట్లో మ్యాగీ తిని, ఏసీ ఆన్ చేసుకుని చోరీ చేసిన దొంగలు!

Anand Sai HT Telugu

కొంతమంది దొంగలు చేసే పనులు వెరైటీగా ఉంటాయి. ఎవరైనా వస్తారు అనే భయం లేకుండా చేసే పనులు నవ్వు కూడా తెప్పిస్తాయి. ఉత్తరప్రదేశ్‌లో ఓ ఇంట్లో దొంగలు అలాంటి పనే చేశారు.

మ్యాగీ తిని, ఏసీ ఆన్ చేసుకుని చోరీ చేసిన దొంగలు

ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన దొంగలు అనుభవించు రాజా అన్నట్టుగా ఎంచక్కా ఎంజాయ్ చేశారు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయి.. ఏసీ ఆన్‌చేసుకుని దొంగతనం చేశారు. అంతే కాదు అక్కడ మ్యాగీని కూడా తయారు చేశాడు. ఏసీ చల్లని గాలిలో కాసేపు విశ్రాంతి తీసుకున్న దొంగలు ఇంట్లోని విలువైన వస్తువులతో పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దొంగలు చేసిన ఓ పని వైరల్ అయింది. ఈ దొంగలు ఏసీ ఆన్ చేసుకుని ఓ రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. అంతే కాదు అక్కడ మ్యాగీని కూడా తయారు చేసుకున్నారు. హాయిగా తినేసి ఏసీ చల్లని గాలిలో కాసేపు సేదతీరి ఆ తర్వాత ఇంట్లో చోరీ చేసి విలువైన వస్తువులతో పరారయ్యారు. లక్నోలోని ఘాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్ సి-బ్లాక్ లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన తర్వాత బయటకు వచ్చిన వీడియోలో ఇంటి మొత్తం వస్తువులను చిందరవందర పడేయడం కనిపించింది.

రిటైర్డ్ ఉద్యోగి తన కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లాడు. ఇల్లు ఖాళీగా ఉండటాన్ని గమనించిన ఇద్దరు దొంగలు ఈ దారుణానికి పాల్పడ్డారు. చోరీ ఘటన తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ వీడియోను చూసి ప్రజలు షాక్ కు గురవుతున్నారు. దొంగతన ఘటనను దొంగలు తేలిగ్గా నిర్వహించడం చూస్తే వారికి ఎలాంటి భయం లేదని స్పష్టమవుతోందని కామెంట్స్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ దొంగలను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరో ఘటన

ఘాజీపూర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని ఇందిరానగర్‌లో శుక్రవారం రాత్రి ఓ యువకుడు అరుణ్ వర్మ ఉపాధ్యాయుడి ఇంట్లోకి దూకాడు. టీచర్ అలారం మోగించడంతో దొంగ పారిపోయాడు. అతడి మొబైల్ ఫోన్ అక్కడే పడిపోయింది. టీచర్ ఘాజీపూర్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఓ అనుమానితుడిని పట్టుకున్నారు. తన ఇంట్లో ఎలాంటి వస్తువులు చోరీకి గురికాలేదని అరుణ్ తెలిపాడు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link