కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోత్స్నతో కార్తీక్ పందెం- దీప వంట తిన్న కన్నతల్లి- ఓడిపోయిన జ్యోతో గుంజీళ్లు!

Best Web Hosting Provider In India 2024

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోత్స్నతో కార్తీక్ పందెం- దీప వంట తిన్న కన్నతల్లి- ఓడిపోయిన జ్యోతో గుంజీళ్లు!

Sanjiv Kumar HT Telugu

కార్తీక దీపం 2 సీరియల్ జూన్ 19 ఎపిసోడ్‌లో కార్తీక్, జ్యోత్స్న పందెం వేసుకుంటారు. సుమిత్రతో అన్నం తినిపిస్తే గుంజీళ్లు తీస్తానని జ్యోత్స్న అంటుంది. దాంతో దీప వండిన వంటను కన్నతల్లి సుమిత్ర తినేలా కార్తీక్ చేస్తాడు. మామ్ వీక్‌నెస్ మీద కొట్టావ్‌గా బావ అని జ్యోత్స్న అనుకుంటుంది.

కార్తీక దీపం 2 సీరియల్ జూన్ 19వ తేది ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో శౌర్య అమ్మగారు అని పిలవడంపై దీపను అడుగుతుంది సుమిత్ర. పని మనిషి కూతురు అలాగే పిలుస్తుంది కదా అని దీప అంటుంది. నువ్ ఏ మనిషివో నాకు తెలియదు. అసలు నువ్ ఇంట్లో ఉండటమే నాకు ఇష్టం లేదు. ఇలా నచ్చకపోవడం కూడా నీకు అవకాశంగా మారిందని నిన్న నీ మాటలు వింటేకానీ అర్థం కాలేదు. ఉంటు ఇలా ఎంతకాలం మిమ్మల్ని బాధపెడతావో పెట్టు. కానీ, ఆ చిన్నదాంతో నన్ను అమ్మగారని పిలిపిస్తావేంటీ అని నిలదీస్తుంది సుమిత్ర.

నా కూతురే కదా

దాని దృష్టిలో కూడా నన్ను చెడ్డదాన్ని చేయాలా అని సుమిత్ర అంటే అయ్యో అది కూడా నా కూతురే కదా అని దీప అంటుంది. ఆ మాటలను కార్తీక్, జ్యోత్స్న వింటుంటారు. అదంతా నాకు సంబంధం లేదు. నా కోపం నీ మీద నీ కూతురు మీద కాదు. దానికి నాకు ఓ బంధం ఉంది అని సుమిత్ర అంటుంది. తెలియకుండా చెప్పిన మామ్ కరెక్ట్‌గానే చెప్పిందని జ్యోత్స్న అనుకుంటుంది.

దానికి నాకు మాత్రమే బంధం ఉంది. నీకు నాకు కాదు. నేను శౌర్యతో మాట్లాడుతాను. దాని మనసు ఎందుకు చెడగొడతావ్ అని సుమిత్ర వెళ్లిపోతుంది. జ్యోత్స్న, పారిజాతం వెళ్లిపోతుంది. కార్తీక్ వెళ్లి మాట్లాడితే నేను పొందని అమ్మ ప్రేమను శౌర్య పొందుతుంది అని చెబుతుంది. శౌర్య అమ్మగారు అని పిలిస్తే అమ్మమ్మ అని పిలవమంటుంది సుమిత్ర. దాంతో శౌర్య అలాగే పిలుస్తుంది.

ఇంకో రెండు రోజులు తినకుండా ఉంటే దీపనే వెళ్లిపోతుంది. లేదా మావయ్య గారే పంపించేస్తారు అని అనుకుంటుంది సుమిత్ర. శౌర్య అంటే అమ్మకు ఎందుకంత ఇష్టం అని జ్యోత్స్న అడిగితే మీ అమ్మకు చిన్నపిల్లలు అంటే ఇష్టం నీకు పెళ్లి చేసి మనవరాళ్లను ఎత్తుకోవాలని తెగ ఆశపడుతుంది. అది ఇప్పుడు తీరదు అని పారిజాతం అంటుంది. ఇంతలో శౌర్య కిందకు వచ్చి అమ్మమ్మ యాపిల్ తినలేదని చెబుతుంది.

కలిసి ఉండే రోజులు

పిల్లను చేరదీసింది కానీ పెట్టింది తినలేదు అని పారిజాతం అంటుంది. శౌర్యను కార్తీక్ తీసుకెళ్తాడు. మనమందరం కలిసిండే రోజులు ముందున్నాయని అంటాడేంటీ. మొగుడు పెళ్లాలు బాగానే ప్లాన్ చేశారు అని దీప దగ్గరికి వచ్చి పారిజాతం అంటుంది. ఈ ఎధవ సోది ఆపి పనికొచ్చే పని చేస్తే బెటర్ అని కార్తీక్ కౌంటర్ వేస్తూ వస్తాడు. ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారు. కనీసం అన్నం తనిపించలేరా అని కార్తీక్ అంటాడు.

మీ అమ్మతో అయితే తినిపించేవాన్ని అన్నావుగా. మా అమ్మతో తినిపించు అని జ్యోత్స్న అంటే పందెం ఏంటీ అని కార్తీక్ అంటాడు. ఏం చేయాలో చెప్పరా అని పారిజాతం అంటే గుంజీళ్లు తీయాలి అని కార్తీక్ అంటాడు. మరి నువ్ ఓడిపోతే అని జ్యోత్స్న అంటే నేను గుంజీళ్లు తీస్తాను అని దీప అంటాడు. డీల్ అదిరిపోయింది. మీతో గుంజీళ్లు తీయడానికి సిద్ధంగా ఉండండి అని జ్యోత్స్న అంటుంది.

గుంజీళ్లు ఎన్ని తీయాలి అని పారిజాతం అంటే చివరిలో చెబితా అని కార్తీక్ అంటాడు. దాంతో పారిజాతం, జ్యోత్స్న వెళ్లిపోతారు. తర్వాత దీపకు తన ప్లాన్ ఏంటో కార్తీక్ చెబితే సూపర్ బావ అంటుంది దీప. అందరిని భోజనానికి తీసుకురమ్మని దీపకు కార్తీక్ చెబితే అలాగే చేస్తుంది. శివ నారాయణ, దశరథ్ వచ్చి కూర్చొంటారు. సుమిత్రను తీసుకొచ్చిన జ్యోత్స్న మమ్మీని రెస్టారెంట్‌కు తీసుకెళ్తున్నాను అని చెబుతుంది.

ఎలా గెలుస్తారో చూస్తా

అబ్బా ఏం దెబ్బకొట్టావ్ చిన్న మరదలా అని కార్తీక్ మనసులో అనుకుంటాడు. ఈసారి ఎలా గెలుస్తారో చూస్తానుగా అని జ్యోత్స్న అనుకుంటుంది. సుమిత్ర కూడా వెళ్లడానికి రెడీగా ఉంటుంది. అన్నీ మీకు నచ్చిన వంటలే చేశాం. ఓనర్ల ఆరోగ్యం వర్కర్ల బాధ్యత అని కార్తీక్ అంటాడు. దాంతో అన్నీ నీకు నచ్చిన వంటకాలే అని ఒక్కో వంటకం గురించి దశరథ్ చెబుతాడు.

ఇంత పసందైన భోజనం ఉంటే రెస్టారెంట్‌కు ఎందుకు అని దశరథ్ అంటాడు. అది మీకు నాకు అది పచ్చి విషం అని సుమిత్ర అంటుంది. చిన్న మేడమ్ గారు భయంతోనే బయటకు వెళ్లిపోతున్నారు. ఎక్కడ దీప వంట తిని కరిగిపోతుందో అని తప్పించుకుతిరుగుతున్నారు. అలా కాదంటే ఒక చిన్న పందెం వేసుకుందాం. మీరు వంటలు తిన్నాక అద్భుతం అనకపోతే నేను నా భార్య ఓడిపోయినట్లే అని కార్తీక్ అంటాడు.

నేను నీక పడను అని సుమిత్ర వెళ్తానంటుంది. మీరు నిజంగానే భయపడుతున్నారు. మీరు దీప వంట తిని కూడా నిజంగా ద్వేషించగలరా అని కార్తీక్ అంటాడు. ద్వేషించగలను. నా మనసు మారదు అని సుమిత్ర అంటుంది. తిన్నాక అలా చెప్పగలరా అని కార్తీక్ అంటాడు. తింటాను అని డైనింగ్ టేబుల్‌పై కూర్చొంటుంది సుమిత్ర. జ్యోత్స్న అడ్డుపడితే దశరథ్ ఆపుతాడు.

వీక్‌నెస్ మీద కొట్టావుగా

దానికంటే ముందు ఏం జరిగిందంటే అని పారు చెప్పబోతుంటే నోరు మూసుకుని వచ్చి కూర్చో అని శివ నారాయణ బెదిరిస్తాడు. దీపను వడ్డించమంటాడు కార్తీక్. దాంతో సుమిత్రకు దీప ఎమోషనల్ అవుతూ భోజనం వడ్డిస్తుంది. బావ మామ్ వీక్‌నెస్ మీద కొట్టావుగా అని జ్యోత్స్న అనుకుంటుంది. నోట్లో ముద్ద పెట్టుకున్న సుమిత్ర మైమరిచిపోతుంది. కానీ, బయటకు తెలియనివ్వదు. సుమిత్ర భోజనం తింటుంది. తిన్నాను. మనసు మారిపోయిందా అని అంటుంది.

దోశ ఆవకాయ తిన్నాక చెప్పండి. తిన్నవాళ్లకు వండినవాళ్ల మీద ప్రేమ కలుగుతుంది అని కార్తీక్ అంటాడు. దాంతో అన్ని వంటలు వడ్డిస్తుంది కన్నీళ్లు పెట్టుకుంటుంది దీప. ఇలా కన్నతల్లికి దీప భోజనం వడ్డిస్తుంది. కార్తీక్‌ గాడు అన్నట్లు సాధించాడు అని మనసులో అనుకుంటుంది పారిజాతం.

తిన్నాను. మారలేదు. మారదు కూడా. నీ మీద నాకు ఉండేది ఎప్పడు ఒకే అభిప్రాయం. నువ్ ఒక స్వార్థపరురాలివి. ఒక హంతకురాలివి. ఎవరిని చంపావని అడగొచ్చు. నేను నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని చంపేశావ్. అంతకుమించిన హత్య లేదు. నేరం లేదు. అందుకే నువ్వు ఒక హంతకురాలివి అని సుమిత్ర వెళ్లిపోతుంది. దాంతో దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024