



Best Web Hosting Provider In India 2024
ఆపరేషన్ సింధులో భాగంగా ఇరాన్ నుంచి భారత్కు 110 మంది విద్యార్థులు
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం రోజురోజుకు తీవ్రం అవుతుంది. దీనితో అక్కడ ఉన్న భారతీయ విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి. వారిని క్షేమంగా తిరిగి రావడానికి భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధును ప్రారంభించింది. ఇందులో భాగంగా 110 మంది భారతీయ విద్యార్థులు సురక్షితంగా తిరిగొచ్చారు.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకుపోయిన 110 మంది భారతీయులను భారత్ సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చింది. ఆపరేషన్ సింధు కింద ఈ భారతీయ విద్యార్థులతో కూడిన మొదటి విమానం ఆర్మేనియాలోని యెరెవాన్ నుంచి న్యూఢిల్లీకి చేరుకుంది. భారత రాయబార కార్యాలయం సహకారంతో టెహ్రాన్ లో నివసిస్తున్న విద్యార్థులను సురక్షితంగా తరలించినట్లు విదేశాంగ శాఖ ధృవీకరించింది.
భారత రాయబార కార్యాలయం సహాయంతో టెహ్రాన్ లోని భారతీయ విద్యార్థులను నగరం నుంచి తరలించినట్లు విదేశాంగ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. భారతీయ విద్యార్థులు జూన్ 18న యెరెవాన్ లోని జ్వార్ట్ నట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. ఈ విమానం జూన్ 19 ఉదయం న్యూఢిల్లీలో ల్యాండ్ అయింది. ఇరాన్ లో చిక్కుకున్న వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత్ ఆపరేషన్ సింధును ప్రారంభించింది. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోస్ట్ చేశారు.
భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి ఇరాన్, ఆర్మేనియా చేసిన సహాయాన్ని భారత అధికారులు ప్రశంసించారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ తన గగనతలాన్ని మూసివేయడంతో చిక్కుకుపోయిన పౌరుల కష్టాలు మరింత పెరిగాయి. అదే సమయంలో సమీప దేశాల్లోని డజన్ల కొద్దీ విమానాశ్రయాలను కూడా మూసివేశారు. ఆ తర్వాత పౌరులను స్వదేశానికి రప్పించేందుకు సరిహద్దుకు సురక్షితంగా వెళ్లేందుకు అవకాశం కల్పించాలని ఇరాన్ ను భారత్ కోరింది.
ఇరాన్లో భారత రాయబార కార్యాలయం 24/7 కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. ఇరాన్లో 4 వేల మందికి పైగా భారతీయులు నివసిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు.
Best Web Hosting Provider In India 2024
Source link