శ్మశానానికి హౌస్‌ఫుల్ బోర్డు.. కీర్తి సురేష్, సుహాస్ మూవీ నేరుగా ఓటీటీలోకి.. ఫన్నీగా ట్రైలర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Best Web Hosting Provider In India 2024

శ్మశానానికి హౌస్‌ఫుల్ బోర్డు.. కీర్తి సురేష్, సుహాస్ మూవీ నేరుగా ఓటీటీలోకి.. ఫన్నీగా ట్రైలర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Hari Prasad S HT Telugu

కీర్తి సురేష్, సుహాస్ నటించిన మూవీ ఒకటి నేరుగా ఓటీటీలోకి వస్తోంది. ఈ ప్రైమ్ వీడియో ఒరిజినల్ మూవీని కొన్ని రోజుల కిందటే మేకర్స్ అనౌన్స్ చేయగా.. గురువారం (జూన్ 19) ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది చాలా ఫన్నీగా సాగింది.

కీర్తి సురేష్, సుహాస్ మూవీ నేరుగా ఓటీటీలోకి.. ఫన్నీగా ట్రైలర్.. శ్మశానానికి హౌస్‌ఫుల్ బోర్డు.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

ప్రముఖ టాలీవుడ్ నటీనటులు కీర్తి సురేష్, సుహాస్ నటిస్తున్న మూవీ ఉప్పు కప్పురంబు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ మూవీ ఇది. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకే వస్తోంది. శ్మశానంలో స్థలం కోసం కొట్టుకునే ఊరు, వాళ్ల మధ్య నలిగిపోయే సర్పంచ్ పాత్రలో కీర్తి సురేష్ ను ఇందులో చూడొచ్చు. ఈ సెటైరికల్ కామెడీ ట్రైలర్ చాలా సరదాగా సాగిపోయింది.

ఉప్పు కప్పురంబు ట్రైలర్

ఉప్పు కప్పురంబు మూవీ ట్రైలర్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో గురువారం (జూన్ 29) రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ మొదట్లోనే సుబ్బరాజు అనే ఊరి పెద్ద మరణించినట్లు చూపించారు. ఆ తర్వాత అతని కూతురు పాత్ర పోషించిన కీర్తి సురేష్ ఆ ఊరి పెద్ద అవుతుంది. అసలు ఏమీ తెలియని ఆమెకు అక్కడంతా గందరగోళంగా అనిపిస్తుంది.

ఇదే సమయంలో ఆ ఊరి శ్మశానంలో స్థలం అయిపోయిందని, మరో నాలుగు శవాలను మాత్రమే పూడ్చే అవకాశమే ఉందంటూ.. ఆ ఊరి వ్యక్తి (సుహాస్) ఆమె దృష్టికి తీసుకొస్తాడు. ఇక అక్కడ మొదలవుతుంది అసలు యుద్ధం. ఆ ఊళ్లోని రెండు వర్గాలు ఆ శ్మశానంలో మిగిలిన స్థలాల కోసం కొట్టుకుంటారు.

లక్కీ డ్రా కూడా వేస్తారు. ఇక ట్రైలర్ చివర్లో ఎవరూ చావవద్దని మనవి అనే డైలాగుతోపాటు శ్మశానికి హౌస్‌ఫుల్ బోర్డు కూడా పెట్టడం ఫన్నీగా అనిపిస్తుంది. రెండు నిమిషాల 5 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ మొత్తం నవ్విస్తూనే సాగింది. ఆ లెక్కన మూవీ కూడా కడుపుబ్బా నవ్వించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఉప్పు కప్పురంబు మూవీ గురించి..

కీర్తి సురేష్, సుహాస్ తొలిసారిగా కలిసి నటించిన ఉప్పు కప్పురంబు సినిమాను ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రాధిక లావు నిర్మించారు. ఈ మూవీకి ఐవి శశి దర్శకత్వం వహించాడు. ఉప్పు కప్పురంబు సినిమాలో ఈ ఇద్దరితోపాటు బాబు మోహన్, శత్రు, తళ్లూరి రామేశ్వరి ప్రధాన పాత్రల్లో నటించారు.

వసంత్ మారింగంటి రచించిన ఉప్పు కప్పురంబు సినిమా 1990ల నాటి బ్యాక్‌డ్రాప్‌లో సెటైరికల్ కామెడీ చిత్రంగా తెరకెక్కింది. చిట్టి జయపురం అనే కల్పిత గ్రామంలో జరిగిన కథగా మూవీని తీశారు. ఈ సినిమా జులై 4 నుంచి అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ వంటి ఐదు భాషల్లో రానుండటం విశేషం.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024