




Best Web Hosting Provider In India 2024

లండన్ వీధుల్లో బాయ్ఫ్రెండ్ చేతిలో చేయి వేసి నడిచిన జాన్వీ.. పక్కనే చెల్లి ఖుషీ.. వీడియో వైరల్
లండన్ వీధుల్లో తన బాయ్ఫ్రెండ్ శిఖర్ పహారియా చేతిలో చేయి వేసి నడుస్తున్న జాన్వీ కపూర్ వీడియో వైరల్ అవుతోంది. పక్కనే ఆమె చెల్లెలు ఖుషీ కపూర్ కూడా ఉండటం విశేషం. ఈ బాలీవుడ్ బ్యూటీ చాలా రోజులుగా అతనితో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ప్రస్తుతం లండన్లో తన రూమర్డ్ బాయ్ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి చిల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఈ జంట లండన్ వీధుల్లో ఒకరి చేతిలో మరొకరు చేయి వేసి నడుస్తూ రొమాంటిక్గా కనిపించారు. వాళ్ల పక్కనే జాన్వీ చెల్లెలు ఖుషీ కూడా కనిపించింది.
క్యాజువల్ లుక్లో జాన్వీ, శిఖర్
జాన్వీ కపూర్ ఫ్యాన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసిన వీడియోలో జాన్వీ కపూర్.. బ్లాక్ ట్యూబ్ టాప్, జాగర్ ప్యాంట్స్తో క్యాజువల్గా కనిపించింది. లూజ్ హెయిర్, మినిమల్ మేకప్తో ఆమె సింపుల్గా ఉంది. శిఖర్ కూడా క్యాజువల్ టీ షర్ట్, వైట్ ప్యాంట్స్లో స్టైలిష్గా కనిపించాడు.
రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి తీసిన ఈ వీడియోలో జాన్వీ నవ్వుతూ, శిఖర్తో చేతులు కలిపి నడవడం చూడొచ్చు. ఈ జంటతో పాటు జాన్వీ చెల్లెలు, నటి ఖుషీ కపూర్ కూడా ఉంది. ఖుషీ వైట్ టాప్, ప్యాంట్స్లో కనిపించింది.
జాన్వీ, శిఖర్ రిలేషన్షిప్
జాన్వీ, శిఖర్ తమ రిలేషన్షిప్ను అధికారికంగా ఎప్పుడూ ధృవీకరించలేదు. కానీ, వీళ్లిద్దరూ తరచూ ఆ దిశగా హింట్స్ ఇస్తూనే ఉన్నారు. ఒకసారి జాన్వీ.. శిఖర్ పేరు ఉన్న నెక్లెస్ ధరించినట్లు కనిపించింది. శిఖర్ కూడా తన సోషల్ మీడియాలో జాన్వీ ఫొటోలను షేర్ చేస్తుంటాడు.
ఇటీవల, జాన్వీ తన రాబోయే సినిమా హోమ్బౌండ్ ప్రీమియర్ కోసం కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు వెళ్లినప్పుడు శిఖర్ ఆమెతో ఉన్నాడు. నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఇషాన్ ఖట్టర్, విశాల్ జెథ్వా కూడా నటిస్తున్నారు.
జాన్వీ రాబోయే సినిమాలు
జాన్వీ త్వరలో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి పరం సుందరి అనే రొమాంటిక్ కామెడీలో కనిపించనుంది. కేరళ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా జులై 25న విడుదలవుతుంది. అలాగే, వరుణ్ ధవన్తో కలిసి కరణ్ జోహార్ నిర్మించిన సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారీ అనే ఫ్యామిలీ రోమ్-కామ్లోనూ నటిస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్లో రిలీజ్ కానుంది.
అంతేకాదు, రామ్ చరణ్తో కలిసి జాన్వీ ఒక స్పోర్ట్స్-యాక్షన్ సినిమా పెద్దిలో నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ 2026లో విడుదలవుతుంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. జాన్వీకి ఇది దేవర తర్వాత రెండో తెలుగు సినిమా.
సంబంధిత కథనం