తెలంగాణ విద్యార్థులకు అలర్ట్ – ‘దోస్త్’ రిజిస్ట్రేషన్ల గడువు పొడిగింపు, కొత్త తేదీలివే

Best Web Hosting Provider In India 2024

తెలంగాణ విద్యార్థులకు అలర్ట్ – ‘దోస్త్’ రిజిస్ట్రేషన్ల గడువు పొడిగింపు, కొత్త తేదీలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

దోస్త్ మూడో విడత రిజిస్ట్రేషన్ల గడువును పొడిగించారు. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటన విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులు జూన్ 25వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లతో పాటు వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. జూన్ 28న విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు.

దోస్త్ రిజిస్ట్రేషన్లు 2025

తెలంగాలో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు విడుతలు పూర్తి కాగా… ప్రస్తుతం మూడో విడత ప్రవేశాలు కొనసాగుతున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల గడువు జూన్ 19వ తేదీతో పూర్తయింది. ఈ నేపథ్యంలో అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల గడువును పొడిగించారు. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి ప్రకటన విడుదల చేసింది.

ఈనెల 25 వరకు పొడిగింపు…

దోస్త్‌ 3వ విడత రిజిస్ట్రేషన్లకు గడువును ఈనెల 25 వరకు పొడిగించారు. ఈ తేదీల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అభ్యర్థులు.. వెబ్ ఆప్షన్లను కూడా ఎంచుకోవాలి. ఇందుకు కూడా జూన్ 25వ తేదీనే తుది గడువుగా నిర్ణయించారు. జూన్ 28వ తేదీన విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు. జూన్ 28 నుంచి 30 తేదీల మధ్య ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసుకోవాలి. అంతేకాకుండా జూన్ 28 నుంచి జూలై 1వ తేదీల మధ్య ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

జూన్ 30వ తేదీ నుంచి డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయి. జూలై 1 నుంచి 4వ తేదీ వరకు కాలేజీల్లో ఓరియేంటేషన్ కార్యక్రమాలు ఉంటాయి. సీట్లు పొందే విద్యార్థులు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయకపోతే సీటు రద్దవుతుంది. కాబట్టి దోస్త్ ద్వారా సీటు పొందే విద్యార్థులు… తప్పనిసరిగా ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.,

దోస్త్ మూడు విడతలు పూర్తి అయిన తర్వాత సీట్లు ఖాళీగా ఉంటే స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లను ప్రకటిస్తారు. దీనిపై తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సీట్లు ఖాళీగా ఉంటేనే ఇందుకు అవకాశం ఉంటుంది.

‘దోస్త్’ రిజిస్ట్రేషన్ – ప్రాసెస్ ఇలా

  • ముందుగా దోస్త్ అధికారిక వెబ్ సైట్ https://dost.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో కనిపించే Candidate Pre-Registrationపై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ మీ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, పుట్టినతేదీ, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి. చివరల్లో Aadhaar Authentication ప్రక్రియ పూర్తవుతుంది.
  • ఆ తర్వాత దోస్త్ ఐడీ జనరేట్ అవుతుంది.
  • దీని ద్వారా మీ లాగిన్ ప్రక్రియ ముందుకెళ్తుంది.
  • రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా నిర్ణయించిన ఫీజును తప్పకుండా చెల్లించాలి.
  • దోస్త్ లాగిన్ వివరాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
  • రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాలి. ఇంటర్ లో సాధించిన మార్కులతో పాటు రిజర్వేషన్ ఆధారంగా కాలేజీలో సీటును కేటాయిస్తారు.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

టాపిక్

Tg DostTelangana NewsEducationAdmissions
Source / Credits

Best Web Hosting Provider In India 2024